Saturday, July 18, 2009
సూర్యుడి గురించి తెలిసింది స్వల్పమే
మనకు అతి సమీపంలో వున్న తార సూర్యుడే.ఆ తరువాత దగ్గరగా వున్న తార ప్రాక్షిమ సెంటారి నుండి భూమి మీదకు వెలుగు కిరణాలు రావడానికి 4 ఏళ్ళు పడుతున్నది.ఇక మిగిలిన తారల గురించి తెలిసింది తక్కువ,దూరం ఎక్కువ .
8.2 నిమిషాలలో సూర్యుడినుండి మనకు కిరణాలు వస్తాయి. భూమి పైన వున్న వాతావరణ పొరలు వడకట్టి నందున మనకు చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి.
సూరుడు గురించి సైన్స్ క్రమెణా తెలుసుకుంటున్నది .
1991 లో జపాన్ పంపిన యొకొ శాటిలెట్ వలన సూర్య బింబ ఎక్స్ రే తీయగలిగారు .భూమి మీద చూడలేని సూర్య అంశాలు నిమిత్తం 1990 లో యులిసిస్ ,1995 లో పెట్టిన సోహొ ద్వారా చాలా విషయ సేకరణ జరుగుతున్నది.
సూర్య కాంతి సూటిగా చూడరాదుగనుక ,1890 నుండీ స్పెక్ త్రొ హెలియొ గ్రాఫ్ ,1931 నుండి కరొనగ్రాఫ్ ఉపయోగిస్తున్నారు .
మనకు సూర్యుడికీ మధ్య వస్తె చంద్రుడు సూర్య గ్రహణం
అంటారు .
లెక్కలు నిర్దిస్త అంచనాలు సైన్స్ వాడిన ,పిచ్చి జోస్యాలు చెప్పదు .మానవుల బలహీనతల పై జోస్యం వ్యాపారం చేయదు.
ప్రతి సెకండ్ కూ అనంతంగా కిరణాలు భూమిమీద పడుతుండగా పుట్టుక అప్పుడు ఎన్ని పడతాయో చెప్పలేము .అయినా జోస్య వ్యాపారం సాగిపోతున్నది.
Thursday, July 16, 2009
చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి.

చంద్రుడి గురించి
1969 జులై 20 న్ చంద్రుడిపై నిల్ ఆంస్త్రాంగ్ కాలు పెట్టి మానవ జాతికి గర్వకారణమయ్యాడు. అక్కడనుండి రాళ్ళు తేగా జనం చూస్తున్నారు, సైంటిస్టులు పరిశీలిస్తున్నారు .చంద్రుడిపై గాలి లేదు .భూమికి వున్న ఆకర్షణ లేదు .భూమి నుండి మనం ఒక వైపు చంద్రుడినే చూడగలం .ఇప్పుడు సాస్త్రీయ పరికరాల ద్వారా అటువైపు తెలుసుకోగలుగుతున్నాము .చంద్రుడి లొ అయస్కాంతశక్తి లేదు. నీరు లేదు .అక్కడ మన బరువులో 6వ వంతు మాత్రమే వుంటాము . భూమిపై సముద్రాల మీద మాత్రమే చంద్రుడి ప్రభావం వున్నందున ఆటు ఫోటు కలుగుతున్నది .ంఅనుషులపై చంద్రుడి ప్రభావం లేదు. మనం చూసే చంద్రకాంతి సూర్య కిరణాల పరావర్తనమే.384 400 కిలో మీటర్ల దూరాన వున్న చంద్రుడు గ్రహం కాదు .భూమికి ఉప గ్రహం. పూర్వ కాలం నుండీ మనవాళ్ళు చంద్రుడిపై ఎన్నో కథలు అల్లారు ,వింత ఆకారాలు చూశారు. గ్రహణాలప్రభావం అంటూ నేటికీ జనాన్ని మభ్య పెడుతున్నారు .సైన్స్ పొరలు విప్పుతూ చెబుతున్నది .ఇంకా చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి. జ్యొతిష్యం అంతా అరాచకం ,అవివేకం మాత్రమే .
Wednesday, July 15, 2009
పిరమిడ్ మోసాలు

ఈజిప్త్ లో పిరమిడ్ లు రాజులు తమ కోసం నిర్మించిన సమాధులు .కొన్ని వేలమంది కూలీలను వాడి ఎన్నో ఏళ్ళు కట్టించారు.దక్షిణ అమెరికాలో పిరమిడ్లు పండుగ లు జరుపుకునే కట్టడాలు.ఇప్పుడు కొందరు బయలుదేరి పిరమిడ్ల ఆకారాల కింద బ్లేడ్ పెడితే అవి కాస్మిక్ ఎనర్జి తో పదును ఎక్కి శాశ్వతంగా వాడుకో వచ్చునంటున్నారు .మరి కొందరు పిరమిడ్లకు జబ్బులు నయం చేసే గుణం వున్నదని అసత్య ప్రచారం చెస్తున్నారు .ఇవన్ని రుజువులు లేని అబద్దాలు .కాని కొందరు మోసపోతూనే వున్నారు .పిరమిడ్ పధకాలు అమాయకులనుండి ధనం కాజేసే విధానమే. ఇందులో ఒకరితో మొదలుపెట్టి ,10 రూపాయలు వసూలు చేసి, మరొక పదిమందిని అలాగే చేర్పించమంటారు.ఇది అలా సాహి పోతూ వుంటుంది .మొదలు పెట్టినవారికి డబ్బు కమిషన్ చేరుతుంటుంది.ఇది లాటరి పధకం. పిరమిడ్ల పేరిట చెప్పే సైన్స్ మాటలకు అర్థం గాని రుజువులు గాని లేవు. అయినా జనం మోసాలకు గురి అవుతూనే వున్నారు .