Thursday, September 3, 2009

త్రిపురనేని గోపిచంద్





గోపీచంద్ శత జయంతి జరుపుతున్నారు.అసలు గోపీచంద్ ను మరచిపోతున్నారు.త్రిపురనేని గోపిచంద్ 1937 నుండి రచనలు అనువాదాలు మొదలు పెట్టారు.తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం అతనిపై అప్పటికే వున్నది. దేశంలో ఎం ఎన్ రాయ్ వచ్చి అటు గాంధేయ మితవాదానికి ఇటు కమ్మ్యూ నిస్త్ అతి వాదానికి మార్గాంతరం గా పునర్ వికాసం ,శాస్త్రీయ ముగా చరిత్రను రాయడం ,పునర్ వికాసం ,నూతన రాజ్యాంగం ,వికేంద్రీకరణ ప్రచారం చేసాడు .అది గోపిచంద్ ను ఆకట్టుకున్నది .అమ్రుత బజార్ పత్రికలో రాయ్ వ్యాసాలు అనువదించి ప్రచురించాలంటే ఎవరు ముందుకు రాలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజా మిత్ర సాహసం తో వాటిని ప్రచురించింది 1937-38 లో. రాయ్ ప్రభావంతో గోపిచంద్ రాజకీయ కథలు రాసి కొత్త దారులు చూపారు .పట్టాభి సోషలిజం ,మార్కిజం అంటే ఏమిటి రాసారు .రాజకీయాలో కొత్త దారులు తొక్కాలని రాయ్ పెట్టిన రాడికల్ డెమొక్రటిక్ పార్తీకి గోపిచంద్ కార్యదర్సిగా ఉపన్యాసాలు ,శిక్షణలు ఇచ్చారు .అసమర్ధుని జీవయాత్ర రాసారు .రచనలలో వ్యంగ్యం ,వాదం ,ఆలోచన ప్రవేశపెట్టారు.తండ్రి చనిపోయిన తరువాత ,1946 లో మద్రాస్ లో సినిమా రంగం లో అడుగుపెట్టి ,మారిపోయారు .అసలు గోపీచంద్ ఆగి పోగా ,ఆధ్యాత్మిక ధోరణిలో రచనలు చేస్తూ ,వివిధ వుద్యోగాలలో వుంటూ ,52 ఏళ్ళకే చనిపోయారు .

No comments: