Wednesday, December 31, 2008

హోమియోశాస్త్రీయం అయితే రుజువు చేసే పద్దతులు ఎందుకు చేయరు

హొమియో లొ నమ్మకమే ప్రధానమా?




హోమియో చికిత్స జర్మనీలో ప్రారంభించిన హేనిమన్ 1819లో యువరాజు షవర్జన్ బర్గ్ కు చికిత్స చేశాడు. ఆనాడు యువరాజు ప్రజలలో ప్రాచుర్యంగల ఆకర్షణీయ వ్యక్తి. హేనిమన్ ప్రత్యామ్నాయ చికిత్సవలన అతడు మరణించాడు. ఆధునిక వైద్య విధానాన్ని విమర్శిస్తూ బయలుదేరిన హేనిమన్ వైఫల్యాన్ని పండితులు గానీ, ప్రజలు గానీ హర్షించలేదు. అతని వెంటబడి తరిమికొట్టారు. అప్పుడు హేనిమన్ జర్మనీ వదలి ఫ్రాన్స్ పారిపోయాడు. ఆగ్రహావేశులైన ప్రజలు అతని మందులను పారబోసి, పుస్తకాలను తగులబెట్టారు. ఫ్రాన్స్ లో స్థిరపడిన హేనిమన్ వయసులో తనకంటే 45 సం. తేడాగల సంపన్న యువతిని పెండ్లాడు. అయితే ఫ్రాన్స్ లో హోమియో ప్రాక్టీసు ద్వారా బాగా ఆర్జించాడు.
హేనిమన్ సమకాలీనుడు ఆండ్రాల్ అతని అనుచరుడు కూడా వైద్య వృత్తిలో ఉంటూ హేనిమన్ చెప్పిన ఔషధాలు పరిశీలనార్థం తీసుకున్నారు. సింకోనా, ఎకోనైట్, సల్ఫర్, ఆర్నికా వంటి హోమియో ఔషధాలు వేసుకున్నారు. ఎం.డబుల్ కూడా సింకోనా తీసుకున్నాడు. అలాగే ఎం. బోనెట్ హేనిమన్ ను పారిస్ లో సవాల్ చేస్తూ అతడు చెప్పిన ఏ ఔషధాన్నయినా స్వీకరిస్తాననీ, అతడు చెప్పిన లక్షణాలు కనిపిస్తే హోమియోను అంగీకరిస్తాననీ, 1835లో ప్రకటించారు. హేనిమన్ గానీ, అతని అనుచరులు గానీ అలాంటి సవాల్ను స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఔషధాలు స్వీకరించిన వారికి హేనిమన్ చెప్పిన లక్షణాలేవీ కనిపించలేదు. అయినప్పటికీ ఆనాడు వైద్యవిధానం లోపాల వలన హేనిమన్ సిద్ధాంతాలూ, రచనలూ బహుళ ప్రచారంలోకి వచ్చాయి. యూరప్ లో హేనిమన్ బాగా పేరు తెచ్చుకున్నాడు. క్రమేణా నమ్మకం ఆధారంగానే హోమియో ప్రచారంలోకి వచ్చింది. హేనిమన్ బ్రతికుండగానే యూరప్ లో ప్లేగు, కలరా, మసూచి వంటి రోగాలు అంటు వ్యాధులుగా లక్షలాది జనాన్ని తుడిచి పెడుతుంటే హోమియో నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఉత్తరోత్తర ఆధునిక వైద్య విధానం వలననే ఈ అంటు రోగాలను అరికట్ట గలిగారు.

హోమియోను యూరోప్ దేశాలలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో భిన్న కాలాలలో నాటి నుండి నేటి వరకు శాస్త్రీయ పరిశోధనలకు గురి చేశారు. ఏ ఒక్క సందర్భంలోనూ హోమియో శాస్త్రీయ పరిశోధనలకు నిలవలేకపోయింది. రుజువు పరుచుకోలేకపోయింది.

1977లో ఆస్ట్రేలియా పార్లమెంటుకు వైద్య శాస్త్రజ్ఞుల నిపుణుల సంఘం తన నివేదికను సమర్పించింది. అనేక వాదోపవాదాల తరువాత నిగ్గు తేల్చాలని ఈ సంఘాన్ని నియమించారు. మందులో మూల పదార్థాన్ని తగ్గించుకుంటూ, కుదుపుతూపోతే పొటెన్సీ పెరుగుతుందనే హోమియో సిద్ధాంతం రుజువు కాలేదని వారు స్పష్టం చేశారు.

అమెరికాలో తొలుత 19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్దంలోనూ హోమియో జనాన్ని ఆకట్టుకుంది. 1920 ప్రాంతానికి హోమియో కళాశాలలో ప్రభావం తగ్గిపోగా వాటన్నిటినీ మూసివేశారు. అయినప్పటికీ హోమియో ప్రచారం కొందరు సాగిస్తూనే ఉన్నారు. దీనికి ఎలాంటి డిగ్రీలు, అర్హతలు అక్కరలేకపోవడం, గుర్తింపు లేని హోమియో కేంద్రాలు వ్యాప్తిలో ఉండడం జరుగుచున్నది. ఆకర్షణీయంగా మార్గాంతర వైద్యం పేరుతో పుస్తకాలు రాసి ప్రచారం చేస్తున్నారు. పత్రికలు అచ్చు వేస్తున్నారు. కొందరు హోమియో చికిత్సలో కంప్యూటర్లను వాడుతున్నారు. అదొక ప్రత్యేకతగా జనానికి చూపుతున్నారు. అమెరికా, ఫ్రాన్స్ లో, ఇజ్రాయల్ లో కొందరు హోమియో వాదులు రుజువునకు నిలబడతామని విఫలమయ్యారు. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు నేచర్ పత్రికలో ప్రచురించగా, అమెరికా నుండి శాస్త్రీయ పరిశోధనా సంఘం వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నది. దొంగ లెక్కలతో అబద్ధాలతో నివేదిక రాసినట్లు రుజువయింది. పారిస్ లో ఉన్న హోమియో పరిశీలనా కేంద్రాన్ని అంతటితో మూసివేయవలసి వచ్చింది. అమెరికాలో కూడా హోమియో రుజువుపరచలేక కోర్టుకు వెళ్ళి కూడా ఓడిపోయి నార్త్ కెరోలైన్ రాష్ట్రంలో హోమియో డాక్టర్లు క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. హ్యూమనిస్ట్ పరిశోధనాకేంద్రంవారు హోమియో అధ్యయనానికి ఒక నిపుణుల సంఘాన్ని నియమించారు. వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హోమియో వారు చెప్పుకుంటున్నరుజువులు అనే అబద్ధాలను బయట పెడుతున్నారు.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

రోగ నిరోధక శక్తి అనే సూత్రాన్ని హోమియో వారు చెప్పిన రీతిలో ఆధునిక వైద్యం కూడా అనుసరిస్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు టీకాల వైద్యం హోమియోకి విరుద్ధంగా నడుస్తున్న చికిత్స. టీకాల మందు పెద్ద మోతాదులలో ఇస్తే ఆ లక్షణాలు హోమియో సూత్రం ప్రకారం మనిషికి కావాలి. కాని అలాంటిదేమీ రుజువు కాలేదు. టీకాల మోతాదు హోమియో చెప్పినట్లు తగ్గిస్తూ పోతే దాని ప్రభావమే ఉండదు. అంతేగాక, కుదపటం అందువలన శక్తి పెరుగుతుందటం కూడా టీకాల వైద్యంలో జరగదు. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచటానికి టీకాల మందు ఇస్తారు. ఈ మందు కూడా అలాగే పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి.

హోమియోపతి ఎయిడ్స్ మొదలు, కేన్సర్ వరకు చికిత్స చేయగలదని చెపుతుంటారు. దీనికి కూడా రుజువుకు నిలిచిన ఆధారాలు లేవు. తల్లిదండ్రుల నుండి పారంపర్యంగా కొన్ని లక్షణాలతో కూడిన మియాజంలు పిల్లలకు సంక్రమిస్తాయని హోమియో చెబుతుంది. వ్యక్తి స్వభావం, ప్రవర్తన, అలోచన ఉద్వేగాలు పరిగణనలోకి తీసుకుని రోగనిర్ణయం చేస్తుందని వ్యక్తిత్వ ఔషధం నిర్ధారిస్తుందని చెబుతారు. (కాన్ట్సిట్యూషనల్ మెడిసిన్) ఈ పద్ధతిని హోమియో సంపూర్ణ వ్యక్తిత్వ చికిత్సగా పేర్కొన్నారు. మిగిలిన చికిత్సలకంటే ఇది ఉన్నతం కావడానికి ఇది వ్యక్తిత్వ చికిత్సే పేర్కొనదగినదన్నారు. ఇలాంటి నమ్మకాలతో హోమియో వైద్యం జనాన్ని ఆకట్టుకోవటానికి తోడ్పడుతున్నది. ఏదీ రుజువు చేయనక్కరలేని స్థితిలో హోమియో సాగిపోతున్నది.

1986లో బ్రిటిష్ జర్నల్ లాసెట్ ప్రచురించిన నివేదిక ప్రకారం జ్వరపీడితులైన రోగులకు, జ్వరం లేని వారికీ పంచదార మాత్రలు, హోమియో ఔషధాలు యిచ్చి పరిశీలించగా హోమియో ప్రభావం కనిపించలేదని రుజువయినట్లు రాశారు. ఇలాంటి నివేదికలు 1989లో కూడా లాన్ సెట్ ప్రచురించింది.

ఇంగ్లండులో హోమియో వైద్య విధానం అక్కడి ఆధునిక వైద్యశాఖలో భాగంగా ఉండాలని హోమియో వైద్యుడికి ఎం.డి. డిగ్రీ ఉండాలని ఆంక్షలు పెట్టారు. హోమియోవారు వాటిని అంగీకరించి ఆ పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. వృత్తి వ్యాపార నిమిత్తం ఎలాంటి రాజీ ధోరణి అయినా హోమియో అవలంబిస్తుందని ఇది ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారత దేశంలో హోమియో వైద్యం ప్రభుత్వ గుర్తింపు పొందినది. వైద్య అధ్యయనంలో ఆధునిక వైద్య పద్ధతులు నేర్చుకుంటున్నారు. ఈ పద్ధతులకూ, వారి వైద్యానికీ పూర్తి వైవిధ్యం ఉన్నది. హోమియోలో ఆధునిక పరిశోధనా, పరిశీలన భారతదేశంలో జరగటం లేదు. కాని హోమియో వైద్యులు మాత్రం డిగ్రీలు పుచ్చుకుని ప్రాక్టీసు చేస్తున్నారు. ఏ డిగ్రీలూ లేకుండా హోమియో గ్రంథాలు చదివి కేవలం అనుభవంతో వైద్యం చేసేవారు చాలామంది ఉన్నారు. వీరిపైన నామమాత్రమయిన ఆంక్షలే ఉన్నాయి. రోగులతో చెలగాటమాడే యీ వైద్య విధానంలో యిలాంటివారి బాధ్యతారహితమైన ప్రాక్టీస్ ప్రమాదాలను తెచ్చిపెడుతున్నది. హోమియో చికిత్సకు భీమా లేదు. చికిత్స చేయించుకున్న రోగుల విషయం సర్వే లేదు. వైద్యులు సాధారణంగా రికార్డు అట్టిపెట్టరు. మందులు ఏది వాడారు అనే విషయం బహిరంగంగా చెప్పరు. హోమియో చికిత్సలో రోగి చనిపోతే పోస్ట్ మార్టమ్ పద్ధతి లేదు. ఒకవేళ ఉన్నా ఏ మందు తీసుకున్నదీ తెలియదు. మందు లేదు గనుక తెలియడానికి వీలు లేదు. ప్రభుత్వం హోమియోకి నిధులు యిచ్చేటప్పుడు యిలాంటి విషయాలను పట్టించుకోవటం అవసరం.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

కేంద్ర ప్రభుత్వం హోమియోను గుర్తించింది గనుక రాష్ట్రాలు రబ్బరు స్టాంపువలె గుర్తింపునిచ్చాయి. ఈ గుర్తింపు కేవలం నిధుల కోసమేనని గమనించాలి. ఇంగ్లండులో వలె ఆధునిక వైద్య కౌన్సిల్ ఆధ్వర్యంలో హోమియోను అదుపులో పెట్టాలి. నిరంతర పరిశోధనలు జరపటానికీ, రుజువు పరచడానికీ ఒక బోర్డును నియమించాలి.

హోమియో మందుల వలన చెడు జరగదనీ, ఇంగ్లీషు మందులవలె దుష్ఫలితాలు ఉండవనీ ప్రచారం చేస్తున్నారు. సీరియస్ జబ్బులకు, కలరా వంటి అంటు రోగాలకు హోమియో చికిత్స పనికిరాకపోగా, ప్రాణాపాయం కలిగిస్తున్నది. హోమియో చికిత్స విఫలం కాగా లివర్, కిడ్నీ జబ్బులతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికొచ్చినవారున్నారు. ఒక హోమియో కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల కిడ్నీలో రాళ్ళు తీయించుకోటానికి హైదరాబాదులో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిలో చేరాడు. ఇలాంటి విషయాలు దృష్టికి వచ్చినప్పుడు హోమియో వారు చెప్పేదానికీ, చేస్తున్నదానికీ అవినీతికరమైన వ్యత్యాసం కనిపిస్తున్నది.



హోమియో కొన్నిటికే బాగా పనిచెస్తుందా? అవి ఏవి?







కొందరు హేతువాదులు హోమియో చికిత్స చేస్తున్నారు. మిగిలిన అన్ని విషయాలలో హేతుబద్ధం కాని వాటిని విమర్శిస్తూ, హోమియో విషయం వచ్చేసరికి హేతువాదాన్ని అన్వయించలేకపోతున్నారు. ఇందుకు సంపాదనే ప్రధాన కారణం. హేతువాదం ఒకవేళ హోమియోను సమర్ధిస్తే, హేనిమన్ సిద్ధాంతాలలో వైటల్ ఫోర్స్ వంటి నమ్మకాలు, వ్యక్తిని వర్గీకరించడం, పొటెన్సీ సిద్ధాంతం శాస్త్రీయంగా ఎలా రుజువు చేస్తారో చెప్పగలగాలి. హోమియోలో అత్యంత ఆధునిక శాస్త్రీయ జ్ఞానం అనుసరిస్తున్నట్టు ఎప్పటికప్పుడు మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు కొందరు రాస్తున్నారు. హోమియో మూలగ్రంథాలు ఆర్గానన్ వంటివి ఏ మేరకు సవరించారు, ఖండించారు, తృణీకరిస్తున్నారు అనేది స్పష్టం కావాలి. హేనిమన్ చనిపోయిన తరువాత ఆధునిక విజ్ఞానం ఎంతో పెరిగింది. సూక్ష్మజీవుల విషయం మొదలు సూక్ష్మాణువుల విషయం వరకూ అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వాటిని వైద్యశాస్త్రం మానవులకు ఉపయోగకారిగా మలుచుకుంటుంది. హోమియో అలాంటిదేమీ చేయలేకపోయింది.

----

Friday, December 26, 2008

క్రైస్తవం ఇంత అమానుషమా?


Innaiah with Sam Harris in USA







Book Release function
{L to R}Vikram,Mr Isanaka Muralidhar, Innaiah, Mrs Chandana Chakravarty, Ravi Prakash,CEO TV9,

Mr C.Narasimharao. in press club, Hyderabad, India









శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని క్రైస్తవం ఇంత అమానుషమా? అనే పేరుతో తెలుగీకరించారు.


మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.

ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?

ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.

మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.

1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.






ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.
http://www.esnips.com/doc/fb11c928-9223-4e15-9b84-80836c12e26e/Christianity-by-Sam

Friday, December 19, 2008

అడవిగాచిన వెన్నెల చైనాలొ నిషేదించారు


Komala Venigalla ( translator)
writer Jung Chang
Jon Haliday( Chang`s husband)







యంగ్ చాంగ్ గొప్ప చైనీస్ రచయిత్రి. ఆమె రాసిన అడవిగాచిన వెన్నెల( Wild Swans) చైనాలొ నిషేదించారు.కాని ఆమెను మాత్రం చైనా రానిస్తున్నారు.ప్రస్తుతం యంగ్ ఇంగ్లంద్ లొ భర్త జాన్ హాలిడే తో వుంటున్నది.
తెలుగులో వెనిగళ్ళ కోమల వెలువరించగా ,ఆవిష్కరణకు యంగ్ ,జాన్ వచ్చి మాట్లాడారు .
యంగ్ కుటుంబం చైనాలో మావో ,కమ్మ్యూనిస్ట్ అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు గల వారు. కమ్మ్యూనిస్టుల దారుణాలు ,మావో క్రూరత్వం యంగ్ చాంగ్ కళ్ళకు కట్టినట్ట్లు రాసింది. అందుకే నిషెదించారు . కాని బయట లక్ష లలో అమ్ముడు పోయింది.
కోమల తెలుగు సేతకు చాలా సమీక్షలు వచ్చాయి . సభలో కోమల రచయిత్రిని పరిచయం చేసి ,పుస్తకాన్ని వివరించిన తీరు యంగ్ మెచ్చుకున్నది.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఆంధ్ర ప్రభలో చాలా సుదీర్ఘ సమీక్ష చేసారు .
యంగ్ , జాన్ కలసి మావో మీది రాసిన గ్రంధం కూదా బాగా ఆదరణకు గురి అయినది.



Jon Haliday, Jung Chang, (Innaiah interviewing at Hyderabad)

Thursday, December 18, 2008

అమెరికాలో తెలుగు పాటల కేసెట్


Ganti Udayabhaskar
released Telugu songs in USA






గంటి ఉదయ భాస్కర్ అమెరికాలొ విదుదల చేసిన పాటల కేసెట్ తెలుగు సభలు సమావేశాలలో ఆదరణ పొందినది.

భలే భలే ఇండియా ప్రయాణం

అదే అదే అప్పుల సరాగం

ఆ ట్రిప్ ప్రమాదం చుట్టాల వినొదం

మనసేమో విచారం లైఫ్ అంతా కల్లోలం

ఫస్ట్ ప్రయాణం అది పెద్ద ప్రయోగం

వెళ్ళినప్పుదు పెట్టె నిండా పెద్ద బరువుతో

వచ్చు నప్పుడు పెట్టె నిండా ఆవకాయలే

అప్పు చేసి పట్టుకెళ్ళు వి సి ఆర్ లు

వచ్చు నప్పుదు తీసుకొచ్చు తోలు చెప్పులు

నూనె జిడ్డుతో నడ్డి నొప్పితో

అప్పులేక తిరిగిరాడు ఒక్కరైననూ

నెల ముందు చెప్పిరంతా ఏమీ లేదని


రోజు ముందు నిండి పోవు పెట్టెలన్ని

నీవు ఇచ్చు బ్లేద్ పెన్ అచట దొరుకులే

పెద్ద వస్తువిచ్చు శక్తి నీకు లేదులే

బుద్ది మార్చుకో తెలివి తెచ్చుకో

డాబు కొరకు డాలర్లు వ్రుధా చేయకు

కారులెక్కి లేనిపోని పోజులివ్వకు

పుట్టినింటి అభిమానం మారిపోదులే

ఈ దేశపు వస్తువుతో మార్చవద్దులే


ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా

పొంగి పోరు ఒక్కరైనా ఆత్మ త్రుప్తితో

ప్రస్తుతం అమెరికాలో కంప్యుటర్ ఇంజనీర్ గా పని సాగిస్తున్నారు .


( ఈ పాటను ఏమే ఏమే భామా శైలిలో పాడాలని రచయిత కోరిక)

దేశానికి తెచ్చాదు వూరంతా చెప్పాదు

ఇంతివద్ద సాయంగా వుంచ్చారయ్యా

కారులోనే తిప్పారు కాళ్ళ పీకు తెచ్చారు


ఇంటిలోన తోడులేక

టి వి చూడమంటూ మమ్ము వదిలేరయ్యా

ఈ ఇల్లు కూడా అందమైన జైలేమోనయ్యా

మేమున్నామని పార్టీ ఇచ్చిరే

వంటలోని మిగులు అన్నీ

నెక్స్ట్ వీక్ లింక్ పెట్టి

బిజి బిజీ అంటూ వారు తిరిగారయ్యా

మాకు భొజనాలు ఇక వద్దనిపించ్చారయ్యా

అదేదో సంతాపం

పాపా బాబ్జి పుట్టిన రోజు

వద్దమ్మో ఏటేటా రాళ్ళబాత

కొన్నాళ్ళు డేకేర్ కొన్నేళ్ళు కాలేజ్

పేరెంట్స్ పార్టీలో కిద్స్ అంతా ఖైదీలు

మన కల్చర్ అన్నారు డాన్స్ ఏదో నేర్పారు

వాళ్ళంతా వచ్చేసి డిస్కోలే చేసారు

ఏదో లెక్చర్ ఇచ్చే మనోళ్ళు

వద్దమ్మో వాళ్ళిచ్చే బోర్ స్పీచ్
(ఇలా అనేక పాటలు రాసి స్వయంగా పాడుతున్నారు )
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజులలో ఎన్నికలలో తిరిగి పాడారు .
Now computer soft ware engineer in USA

Wednesday, December 17, 2008

పురాణ ప్రలాపం






పురాణ ప్రలాపం ఒక వినూత్న రచన. హరి మోహన్ ఝా హిందీలో రాసారు .తెలుగులోకి జె. లక్ష్మి రెడ్డి తెచ్చారు .కాని ఎక్కడా అనువాదం అనిపించదు .
ఇటీవల ఇంత మంచి రచన గమనించలేదు .వేదాలు, పురాణాలు, ఆయుర్వెదం, సత్యనారాయణ వ్రతం, దుర్గ పూజ ,జ్యొతిష్యం మొదలైన విషయాలపై మూల గ్రంధాల నుండి వుదహరిస్తూ ,వ్యంగ్యం , హాస్యం మిళితం చేసి రాసారు .పవిత్ర రచనల్లో ఇలావుంటుందా అని అబ్బురపడతాము.
ఇది ఇ రచనగా అందిస్తున్నాము .
http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html


Down load at the above site and if you make copy, it would idle gift to friends.

Tuesday, December 16, 2008

హ్యూమనిస్ట్ వే








ఆంధ్ర ప్రదెశ్ లో నవ్య మానవవాద ఉద్యమం కొన్నాళ్ళు బలంగా సాగింది.అప్పుడు అఖిల భారత మానవ వాద సభలో హ్యూమనిస్ట్ వే అనే వ్యాస సంకలనం నేను, జి బాబు ప్రచురించాము. హేమ ప్రచురణలు చీ రాలలో రావి పూడి వెంకటాద్రి వద్ద లభిస్తాయి .
ఆ పుస్తకాన్ని విడుదల చేసి ముగ్గురు మెధావులు ప్రసంగించారు .
ఫొటోలో ఎడమ నుంచి ప్రొఫెసర్ శిబ్ నారయణ్ రే గొప్ప గ్రంధ కర్త .రాజా రామ మోహన్ రాయ్ గ్రంధాలయ సంస్తకు కొన్నాళ్ళు నిర్వాహకులుగా వున్నారు .
తరువాత జస్టిస్ వి ఎం తార్కుందే పౌర హక్కుల కొరకు క్రిషి చేసిన వారు.
ఇందుమతి పరేక్ సాంఘిక సేవలొ అవార్డులు అందుకున్న మహిళా నాయకురాలు .
వారితో కలసి పనిచేసాను .అది గొప్ప అనుభవం.

Monday, December 15, 2008

జ్వాలాముఖి చనిపోయారు







జ్వాలాముఖి విప్లవ కవి. నేను నిజాం కాలేజీ లొ 1970 లొ ఫిలాసఫి చెబుతున్నప్పుడు జ్వాలాముఖి నా విద్యార్థి.తరువాత స్నేహితులం. నా పుస్తకం అబద్దాల వేట అతనే ఆవిష్కరించాడు. దిగంబర కవులతో సమావెశం జరిపి చర్చలు చెసాము. ఇద్దరం నేటి రాజకీయం పత్రికలో కలసి పని చేసాము .
నిన్న చనిపోయారు. ఉపన్యాసకుడు గా, టేచర్ గా పేరున్నది .తీ వ్ర కవితలు రాసారు .జ్వాలముఖి పెట్టుకున్న పేరు .

Sunday, December 14, 2008

మార్గాంతర వైద్యం Alternative medicine

ఇటీవల మార్గాంతర వైద్యం పై చ్క్కటి సైంతిఫిక్ గ్రంధం వెలువడినది.చదవమని కోరుతున్నాను.ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు.
ఇందులొ హొమియో, అక్యుపంక్చర్,పై శాస్త్రియ వివరణ వున్నది.
writers:
Simon Singh and Edzard Ernst
Title: Trick or treatment; undeniable facts about alternative medicine
published: 2008 w.w. norton and co London and New York

నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు








నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేసినప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ లు పాల్గొని,నిశిత పరిశీలన ప్రసంగాలు చేసారు.
ఫొటోలో ఎడమనుంచి కె.శ్రినివాస్ రెడ్డి ,విశాలాంధ్ర ఎడిటర్;
కె.రామచంద్ర మూర్తి ,కొత్త టి.వి. చానల్ సి ఇ ఒ ;
పుస్తక రచయిత ;
దేవులపల్లి అమర్ ,ప్రెస్ అకాడమి అధ్యక్షులు ;
కి.శె. ఆర్ .జె. రాజేంద్ర ప్రసాద్ (హిందు );
బండారు శ్రీనివాస్ (ఆకాశవాణి )
ముఖ్య మంత్రిగా రాజశేఖరరెడ్డి పదవి చేపట్టినంతవరకు రచన వున్నది.

Saturday, December 13, 2008

తెలుగులో మానవ వాద సాహిత్యం


left to right sitting : Indumati Parekh, president Indian Radical Humanist association; Dr Sivaramamurthy, registrar of university; Justice Avula Sambasivarao, chief justice A P High court





తెలుగులో మానవ వాద సాహిత్యం 1940 నుండీ ప్రచురితమైనది. ఎం ఎన్ రాయ్ పై కొందరు సమగ్రంగా రాసారు. ప్రొఫెసర్ శిబ్ నరాయణ రే రాసిన రాయ్ జీవితాన్ని నేను తెలుగులో అనువదించగా పొట్టి శ్రీరాములు తెలుగు యూ నివర్సిటీ ప్రచురించింది .హై కోర్త్ ప్రధాన న్యాయ మూర్తి ఆవుల సాంబ
శివరావు ఆవిష్కరించగా , భారత హూమనిస్త్ సంఘ అధ్యక్షురాలు ఇందుమతి పరేక్ ప్రత్యెకంగా పాల్గొన్నారు .యూ నివర్సిటీ రిజిస్త్రార్ శివ రామ మూర్తి ప్రసంగించారు .

Friday, December 12, 2008

కంచి శంకరాచార్యను అరెస్ట్








తమిళనాదు ముఖ్య మంత్రి జయలలిత కొన్ని నేరాలకు గాను కంచి శంకరాచార్యను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది .చట్టానికి అతీతంగా ఆయన్ను చూడాలని భక్తులు ఆందొళన చేసినా ఆమె లొంగి రాలేదు.
. కంచి ఆచార్యుల దారుణాలు వివరంగా కె. వీ రమణి గ్రంధం రాశారు .ఇప్పటికీ కంచి ఆచార్యులు కోర్ట్ చుట్టూ తిరుగుతూనే వున్నారు. ఆయన ఒకప్పుదు ఆశ్రమం వదలి ఒకామెను తీసుకొని వెళ్ళగా ,పరువు పోతుందని పరమచార్య వెళ్ళి బ్రతిమిలాడి వెనక్కు తెచ్చిన విషయం భక్తులు మరచి పోయారు .
ఆశ్రమంలొ హత్యలు , నేరాలు , ధన దుర్వినియోగం విపరీతంగా జరిగింది. ఆశ్రమాలకు పన్ను మినహాయింపు దేనికి? రహశ్య కార్య కలాపాలు అవసరం ఏమిటి?
సత్య శాయి ఆశ్రమంలో హత్యలు జరిగితే ఎన్ టి రామారావు ముఖ్య మంత్రిగా అరెస్ట్ వారెంట్ ఇస్తే అమలు జరగకుండా ఆపినదెవరు?
పారదర్సికంగా ఆశ్రమాలు వుండకపోటానికి ఎవరు కారకులు?
Police enquiry reports in this regard are also suppressed by some key persons in power without the knowledge of NTR. Deccan Chronicle revealed some such police records where as Premanand gave full details.

premanand gave documentary evidence of murders in satya sai ashram

Wednesday, December 10, 2008

సత్య సాయి ని నమ్ముకొని పోతే

అమరెంద్ర మంచి కవి, అనువాదకుడు,ఇంగ్లిష్ లో ఉపాధ్యాయుడు గా గుంటూ ర్ హిందూ కళాశాలలోనూ ,హైదరాబాద్ లోని అమెరికా పరిషొధనా సంస్థలోనూ పనిచేసారు .

వి కె గోకక్ హైదెరాబాద్ లోని కెంద్ర ఇంగ్లిష్ ఫారెన్ భాషల సంస్థకు దైరెక్తర్ గా వుండేవారు.
అడపా రామక్రిష్నరావు ఉస్మానియ విశ్వ విద్యాలయం ఇంగ్లిష్ శాఖలో పనిచేసారు. రచయిత .

వీరంతా వివిధ దశలలో , పైకి చెప్పక పోయినా , ఏదో ఐ పోదామని , సత్య సాయి బాబా దగ్గర కుదురుకున్నారు .
కొన్నాళ్ళు వుండి తిరిగి వచి మౌనం గా వుండి పోయారు .

నేను అడిగితే ఏమీ జవాబు ఇవ్వలేదు.

వ్యతిరేకం గా చెప్పలేరు, అనుకూలంగా చెప్పడానికి ఏమీలేదు! అదీ సంగతి.

భవనం వెంకట్రాం విద్యా మంత్రిగా, ముఖ్య మంత్రిగా వుండగా సత్య సాయిని దర్సించుకోమని చాలా వత్తిళ్లు వచ్చాయి .ఆయనకు నమ్మకం లేదు. కనుక నిరాకరించాడు.అదే సమయంలొ మాధురి షా యునివర్సిటి గ్రాంట్స్ కమిషన్ చైర్ మన్ గా అనంతపురం వెళ్ళినప్పుడు, విద్యామంత్రి గా భవనం కూడా వెళ్ళారు. నేను వున్నాను. శ్రి క్రిష్న దేవరాయ యూనివర్సిటి ని అశ్రద్ద చేసి ఆమె పుట్టపర్తి డీం డ్ యూనివర్సిటి కి వెళ్ళింది. అప్పుదూ భవనం నిరాకరించి అనంతపురం లోనే వున్నాడు. ( She gave deemed university status as chairman of UGC and she was devotee of Sai Baba)

ఎం ఆర్ పాయ్ ఐ ఎ స్ అధికారి గా వున్నప్పుడు ఆయనకు నమ్మకాలు లేవు. కాని ఆయన భార్య అనసూయ కు కాన్సర్ రాగా చివరి దశలో ఆమె సాయి దగ్గరకు వెడితే నయం అవుతుందని చెప్పగా , పాయ్ ఏమీ అనలేక వారుకున్నాడు. సాయి దగ్గర ఏమీ జరగ లేదు . ఆమె చనిపో యింది. నమ్మకాల ప్రమాదం అలాంటిది.

న్ మిత్రుడు శివనాగెస్వరరావు ఒకప్పుడు శాయి పాఠశాలలో చదివాడు.ప్రతి ఏటా ఊటొకి తీసుక వెళ్ళేవారని అక్కడ లైంగిక దురాచారాలు జరిగేవని చెప్పాడు. అయితే తల్లి తండ్రులకు ఎందుకు చెప్పరు అంటే , వారు పరమ భక్టులు గనుక నమ్మరని, పైగా తమనే కోపపడేవారని అన్నారు.
.

Tuesday, December 9, 2008

మానవ వాద సంఘం


Innaiah( speaking),Ravipudi Venkatadri(only slightly visible), Sakhamuri Raghavarao





మానవ వాద సంఘానికి ఆంధ్రలో 1950 నుండీ చరిత్ర వున్నది. నేను 1980 -1990 మధ్య రాస్త్ర శాఖ అధ్యక్షుడుగా , తరువాత భారత శాఖ కార్య దర్శిగా పనిచేసాను.
నా మిత్రుదు , శాఖ మూరి రాఘవరావు నాతొ పాటు పని చేశారు. ఆయన ప్రస్తుతం గుంటూరులో లలిత ఆసుపత్రి మేనేజర్ గా వుంటున్నారు .మెము ఇరువురం ఎ. సి .కాలేజిలో , ఆంధ్ర యూని వర్సిటిలో కలసి ఫిలాసఫి చదివాము .
రాను రాను మానవ వాద సంఘం పెరగడం లేదు. యువకులు రావడం లేదు.
ఫాత వారే వున్నారు. రావిపూడి వెంకటాద్రి , అంచా బాపారావు పని చేస్తున్నారు.
చాలా సభలు జరిపాము .ఇక్కద అలాంటి ఒక సభ ఫొటో ప్రచురిస్తున్నాను.
Founder: M N Roy
active participants in the past:
Gopichand, Abburi Ramakrishnarao
Palagummi Padmaraju
Tata Devakinandan,
Koganti Radhakrishna Murthy
Malladi Ramamurthy, Subbamma
V.S.Avadhani
G.V.Krishnarao

Sunday, December 7, 2008

నూరేళ్ళ అంధ్ర ప్రదేష్ రాజకీయాలు


సినారె, గాలి ముద్దు క్రిష్న మ నాయుదు (నాదు మంత్రి), కి.శె. నల్లపురెడ్డి స్రీనివాసులు రెడ్డి ( మంత్రి)left)Innaiah ,హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లొ ప్రసంగించారు .







ఆంధ్ర ప్రదెష్ రాజకీయాల గురించి 1968 నుండీ రాస్తున్నాను. తొలి పుస్తకం విజయవాడలొ నవజ్యొతి వారు ప్రచురించారు. ఆంధ్ర ప్రదెష్ రాజకీయ పరిణామ చరిత్ర 100 పుటల రచన.
1900 నుండి నూరేళ్ళ అంధ్ర ప్రదేష్ రాజకీయాలు పేరిట తొలుత ఇంగ్లిష్ లొ రాసాను. మిత్రులు వెనిగళ్ళ వెంకటరత్నం టైప్ చేసి 100 కాపీలు జెరాక్ష్ తీసారు. బుక్ లింక్స్ కె.బి. సత్యనారాయణ అమ్మారు .మొదటగా లై బ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు 20 కాపీస్ కొన్నారు .తరువాత అచ్చు మొదలు పెట్టాము .


ఆ తరువాత ఎప్ప్పటికప్పుదు రాస్తూ వున్నాను. ఎన్ టి రామారావు ముఖ్య మంత్రి అయినప్పుదు ఖద్దర్ నుండి కాషాయానికి అని తెలుగులోనూ , శాఫ్రాన్ స్తార్ ఓవర్ ఆంధ్ర ప్రదెష్ అని ఇంగ్లిష్ లోనూ రాసాను.
పార్తీలు ఎన్ని మారిస్తే నేం పైన ఖద్దరే గదా అని మరొకటి రాసాను.
ఇలా కొత్త విషయాలు చేర్చి నప్పుదు శీర్షిక మారుతూ పోయింది .
1986 లొ ఒక సభలో రాజకీయాల పుస్తకాలు విడుదల చేసిన సభలొ సినారె, గాలి ముద్దు క్రిష్న మ నాయుదు (నాదు మంత్రి), కి.శె. నల్లపురెడ్డి స్రీనివాసులు రెడ్డి ( మంత్రి) ,హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లొ ప్రసంగించారు .
ఇటీవల రాష్త్ర రాజకీయాలు రాయడం లేదు.

Saturday, December 6, 2008

చేకూరి రామారావు, వడ్లమూడి శ్రీ క్రిష్ణ


chekuri ramarao, vadlamudi srikrishna, Innaiah, Mrs srikrishna jamuna in USA




.
శ్రి క్రిష్ణ 1960 లోనే అమెరికా వచ్చి ప్రభుత్వ వుద్యోగంలో వున్నారు. తొలుత చికాగోలో వుండేవారు. ఆరోజులలో అమెరికా వచ్చిన తెలుగు వారికి ఆయన ఆదరించ్చే వారు. తరువాత వాషింగ్తొన్ లొ స్తిర పడ్డారు .1963 లో ఆవుల గోపాల క్రిష్ణ మూర్తి వచ్చినప్పుదు ఆయన అతిధి గా వున్నారు .ప్రతి తానా సభకు , ఇతర తెలుగు సభలకు క్రిష్ణ తప్పక వెళ్ళేవారు. 2000 తరువాత హైద్స్రాబాద్ లొ వుంటూ చనిపోయారు .మోపర్రు గ్రామము వారిది. తెనాలి సమీపంలో వున్నది. ఆ గ్రామానికి సహయ పదుతుండేవారు.
చేకూరి రామారావ్ నేను ఉస్మానియా విశ్వ విద్యాలయం లొ పని చేసినప్పటి నుండి -1965- స్నేహితులం .ఆయన లింగ్విస్తిక్స్ లొ నేను ఫి లాసఫి శాఖలొ వున్నాము.
చెకూరి రామారావ్ నేను వుద్యమాలలో కలసి పని చేయలేదు. కేవలం మిత్రులు గానే ఇప్పటికీ కొనసాగుతున్నాము.
ఒకసారి ఉదయం దినపత్రికలొ త్రిపురనేని రామస్వామి విషయం లో భేదాప్రిప్రాయాలు రాసుకున్నాము .రామస్వామి లొ హేతు వాద ధోరణులు సమర్ధిస్తూ , తొలి దశలో వెల్లడి అయిన కులతత్వాన్ని చూపాను . రామారావు రామ స్వామిని సమర్ధిస్తూ రాసారు.
రామారవు అనేక సాహిత్య సభలలో పాల్గొనే వారు. అమెరికాలొ తానా సభలో ఒకసారి అవధానం గోస్తి లో అధ్యక్షత వహించ్చారు. అప్పుదు మాదుగుల ఫణి శర్మ జ్ఞాపక శక్తికి అంటూ సరస్వతి లేహ్యం తమలపాకులో పెట్టి $ 116 కు అమ్మారు. రామారవు అభ్యంతర పెట్టారు. సభలొ అలాంతి పనులు చేయరాదన్నారు .పైగా అమెరికాలో లై సెన్సె లేకుండా మందులు అమ్మడం నేరం అన్నారు. రామారావు ధొరణి నాకు నచ్చింది. మాదుగుల శర్మ అధికార భాషా సంఘ అధ్యక్షుదుగా వచ్చి దుర్వినియోగం చేయడం తప్పు.
శ్రి క్రిష్న ఇంట్లొ రామారావు నేను మేరీ లాండ్ లొ కలసి ఫోటొ తీయించు కున్నాము.

Tuesday, December 2, 2008

ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు అంకితం


left K P S Raju,middle Ravipudi Venkatadri releasing Andhra Pradesh politics by N.Innaiah in Inkole, near parchur,ongole tq, AP





రావిపూడి వెంకటాద్రి , నేను 50 సంవత్సరాలుగా మానవవాద ఉద్యమం లో కలసి పని చేస్తున్నాము. ప్రస్తుతం ఆయన వయస్సు 85 దాటింది.అయినా రచనలు సాగిస్తున్నారు. పర్యటనలు ,ప్రసంగాలు తగ్గిపోయాయి .తన పాత రచనలన్నీ సంపుటాలుగా వెలికి తెస్తున్నారు .ఫాసిజం రచనకు నాచే త పీఠిక రాయించారు .
నేను రాసిన ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు ఇంగ్లిష్ గ్రంధాన్ని వెంకటాద్రి ఇంకొల్లు లో విడుదల చేసినప్పుదు ,కె పి ఎస్ రాజు ( తణుకు )గారు అంకితం అందుకున్నారు .రాజు గారు 1940 ప్రాంతాలలో ఎం ఎన్ రాయ్ ని తణుకులో ఊరేగింపు జరిపి సభ పెట్టారు.

Meeting Dr Gauri, Mr Ed Doerr in USA


left Ed Doerr , humanist working for center for Inquiry in USA
right Dr Gauri , humanist, worked for renaissance institute, India


గౌరి ఇండియాలొ ప్రముఖ మానవ వాది. ఎం ఎన్ రాయ్ తత్వాన్ని పాటించింది. రినైసాన్స్ సంస్థ కు అధ్యక్షురాలిగా చాలా కాలం పని చేసారు. మెడిచల్ డాక్తర్. ఆమె భర్త మాలిక్ కూడా మానవ వాది. ఆమె తండ్రి ప్రే మ నా త్ కాస్మిరి పండిత్ . గీత పై విమర్స రాసారు .
ఎడ్ డోర్ అమెరికా మానవ వాద సంఘ ప్రెసిడెంట్ గా సెక్యుల రిజం కొరకు క్రిషి చేసారు . నేడు శాస్త్రీయ పరిసీలనా కెంద్రం పై పని చెస్తున్నారు.
ఇరువురి తో చిరకాలం గా నాకు సన్నిహిత పరిచయం వున్నది. అమెరికాలో అతనికి గౌరి ని పరిచయం చేసిన సందర్భం గా ఫొటొ తీసుకున్నాము. గౌరి నే డు అమెరికాలోనే వుంటున్నారు.

Monday, December 1, 2008

సంజయ్ గాంధి బాధితుడు ఆవుల


(right side) Avula Vijayarao in syracuse




అవుల విజయా రావు నేడు సిరక్యూస్ , న్యూయార్క్ లో వుంటున్నారు. ఇండియన్ అడ్మినిస్త్రేటివ్ సర్వీస్ ఇండియాలొ చదివి కేంద్ర సర్వీస్ లొ పని చేసారు. బంగ్లా దెష్ సరిహద్దులలొ కార్ల బోర్డ్లు మార్చి దొంగ రవాణా చేస్తున్నవారిని ఆపాడు. ఫలి తంగా బీహార్ కు బదిలీ అయ్యారు. అక్కడ రాజకీయ నాయకుల ఆటలు సాగనివ్వక , విద్యుత్ బిల్లులు ఇగగొట్టటాన్ని ఆపారు. ప్రతిఫలంగా డిల్లి కి మార్చారు .
అప్పుడు ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ గాంధి అనధికార పెత్తనం విచలవిడిగా సాగుతున్నది .ఒక సారి విమాన ప్రయాణం చే యించడానికి విజయరావు నిరాకరించారు. ఇంకేముంది ? బాగా బాధలు పెట్టసాగారు . విశాఖ వుక్కు కర్మాగారంలొ పనులు చేసారు.
బాధలు తప్పించుకొడానికి ప్రపంచ బాంక్ లో వాషింగ్ టన్ లొ పని చేసారు . చివరకు ఐ ఎ స్ కు రాజీ నామా ఇచారు . అది ఒక పట్టాన ఒప్పుకోలెదు. పి.వి. నరసిం హా రావ్ ప్రధాని గా వుందగా తేళ్ళ లక్ష్మి కాంతమ్మ సహాయంతొ బయట పడి , అమెరికాలొ వుద్యోగాలు చేసుకుంటూ వున్నారు.
అసలు తెనాలి ప్రాంతం వాసి అయితే చిత్తూ రు ప్రవాసము వెళ్ళారు. మద్రాసు లొ తండ్రి అద్వ కే ట్ గా కుమార మంగళం వద్ద పని చేస్తుండగా , అతని సలహా పై ఐ ఎ స్ చదివి , ముక్కు సూటిగా వున్నందుకు ఇన్ని బాధలు పద్దారు .
నాకు మంచి మిత్రులు . కొండపి జానకి తో సహా అనేక ఐ ఎ స్ అధికారులకు సహాయ పద్దారు .
ఇటివల గుండె పోటు రాగా కోలు కుంతున్నారు. కులాతీతంగా గుజరాతి ని పెళ్ళి చేసుకున్నారు .