Monday, June 29, 2009

జ్యొతిష్యం సైంటిఫిక్ కాదా

జ్యొతిష్యం
భారతీయ జ్యొతిష్యం లొ నవ గ్రహాలలో కొత్త్తగా కనుగొన్న యురేనస్ ,నెప్ టూన్ లు లెవు.గ్రహాలకు నిజంగా మానవులపై ప్రభావం వుంటే ఇన్నాళ్ళూ వాటి ప్రభావం తెలియకుండానే చెప్పారన్నమాట.

గ్రహాలకు తారలకు తేడా తెలియక , సూర్యుడిని కూడా గ్రహం అనేశారు .

చంద్రుడు భూమికి అంటిపెట్టుకున్నదే తప్ప గ్రహం కాదు .

రాహువు కేతువు లు వునికిలో లేవు !

రాసులన్నీ వూహలే .నిజంగా లేవు.

తారాబలం అంతా అశాస్త్రీయమే.

గ్రహాలనుండి మనుషులపై పడేదేమీ లేదు .ఇక ప్రభావం ఎక్కడ ?

ఇన్ని కారణాలుగా జ్యోతిష్యం నిరాకరించదగినది

Sunday, June 28, 2009

వెనక్కు పోతున్నామా







తిరుపతి వెంకన్న విగ్రహానికి 45 కోట్ల వ్యయంతో గాలి జనార్ధన రెడ్డి వజ్రాల కిరీటం కానుకగా ఇవ్వగా, మరొక భక్తుడు విజయవాడ దుర్గ విగ్రహానికి 2 కోట్ల ఖర్చుతో బంగారు బిస్క ట్లు సమర్పించ్చాడని వార్త.


ఇలాంటి వారిపై త్రిపురనేని రామస్వామి ఇలా రాసాడు .


మల మల మాడు పొట్ట తెగ మాసిన బట్ట కలత పెట్టగా


విల విల ఏడ్చు చున్న నిరుపేదకు జాలిని చూపకుండా


వుత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు


ఇళ్ళు వాకిళ్ళు పొలము పుట్ర ఇచ్చు ప్రభుద్ద వదాన్యుల ఇచ్చ మెచ్చెదన్

Thursday, June 25, 2009

అసాధారణ నటి సావిత్రి



1935లో పుట్టిన సావిత్రి 248 చిత్రాల్లో నటించి, 45 సంవత్సరాలకే అస్తమించిన మహానటి గురించి కూలంకషంగా పరిశోధించి గ్రంథస్తం చేసిన వి. సోమరాజు, వి. ఆర్. మూర్తి అభినందనీయులు. ఇంగ్లీషులో ఇటీవలే వెలువడిన 640 పేజీల రచన అనేక చిత్రాలతో, వివరాలతో, లోగడ తెలియని అనేక అంశాలతో ఉండటం ఒక ప్రత్యేకత. సావిత్రి తెలుగు, తమిళం, మళయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. తొలుత స్టేజ్ నటిగా జీవితం ఆరంభించి, మద్రాసులో 1950 నుండి సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రారంభించి తిరుగులేని నటిగా తెలుగు సినిమా రంగంలో తన స్థానాన్ని స్థాపించుకుంది. ఈమె 1935 డిసెంబరు 6న తెనాలి తాలూకాలోని చిర్రావూరులో నిశంకరరావు గురవయ్య, సుభద్రమ్మలకు పుట్టింది. ఆమె తొలి చిత్రాలలో తడబడినా పాతాళభైరవిలో చిన్న పాత్రతో సరిపెట్టుకున్నా దేవదాసులో అక్కినేని నాగేశ్వరరావు పక్కన మహానటిగా రంగప్రవేశం చేసింది. 1953 జనవరి 26న దేవదాసు విడుదలైంది. అంతకు ముందు పెళ్ళి చేసి చూడు, సంసారం వంటి సినిమాలు ఉన్నాఆమెకు దశతిరిగింది దేవదాసు అనవచ్చు. ఎన్.టి. రామారావు మొదలు అనేక మంది హీరోలతో నటించిన సావిత్రి తన విశిష్టతను నిలబెట్టుకున్నది.
దాదాపు 50 విధాలైన అభినయాలతో సావిత్రి పతి పాత్రను పోషించగలిగిందంటే ఆమె నటనా నైపుణ్యతను గమనించవచ్చు. సావిత్రి చాలా లావుగా కనిపించినా, కాలేజీ విద్యార్థినిగా పాత్ర ధరించినా ఆమె నటనా నైపుణ్యత వల్లన మిగిలిన వేవీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. అదే బహుశా నేడైతే హీరోయిన్ గా ఆమె నిరాకరించేవారేమో తెలియదు. సావిత్రి తమిళ హీరో జమినీ గణేషన్ ను పెళ్ళి చేసుకున్నది.
1968లో సావిత్రి డైరెక్టర్ గా చిన్నారు పాపలు సినిమా వచ్చింది. దీనికి ఆద్యులు కీ.శే. వీరమాచినేని సరోజని. ఆ సినిమాలో అందరూ స్త్రీలే కావటం మూలానా గిన్నీస్ రికార్డులోకి అది చోటు సంపాదించుకున్నది.
1972 నుంచి సావిత్రి కారణాంతరాలవల్ల విపరీతంగా సారాయి తాగుతూ దానికి అలవాటు పడి మానలేని దశకు పోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నది. హీరోయిన్ స్థాయిని కోల్పోగా చివరిలో కొన్ని సినిమాల్లో స్పల్పమైన పాత్రలను మాత్రమే వేయగలిగింది. 1980 నాటికి కోమాలోకి వెళ్ళిపోయిన సావిత్రి 1981 డిసెంబరు 26న చనిపోయింది.
ఆమె మహోన్నత దశలో వివిధ భంగిమలలో పరిశోధించి గ్రంధస్తం చేసిన రచయితలు చాలా పరిశోదనాత్మకమైన విషయాలను వెల్లడించారు. ఇంగ్లీషులో వెలువడిన ఈ గ్రంథం 500 రూపాయలు. దీనికి వెబ్ సైట్ ఉన్నది. వివరాలకు www.uhpublisher.com చూడవచ్చు.

Wednesday, June 24, 2009

మ్యావొయిస్ట్ మాటలు

తెలుగులో హాస్య వ్యంగ్య విమర్శనాత్మక విజ్ఞానాన్ని అందిస్తున్న ఈ రచన, ఇంగ్లీష్ లో సుప్రసిద్ధ మానవవాద తాత్వికుడు మానవేంద్రనాథ్ రాశారు. జైలులో ఒక పిల్లి తటస్థపడగా దానిని పాత్రగా స్వీకరించి ఆ కోణంలో అనేక అంశాలు అందించటం ఈ పుస్తక వినూతన రచనా విశేషం. జటిల విషయాలను సులభంగా చెపడం కష్టమయితే తెలుగులో అనువాదకురాలు కొమల ఆ కష్టాన్ని తొలగించి సరళంగా అందరికీ ఇట్టే అర్ధమయ్యేట్టు అందించారు. అది e - పుస్తకంగా ప్రస్తుతం లభ్యమవుతుంది. చదివి మీరూ ఆనందించండి. మీకు నచ్చితే మీ మిత్రులకు చెప్పండి.

http://www.centerforinquiry.net/uploads/attachments/myavoist_matalu.pdf

Tuesday, June 23, 2009

కిర్లియన్ ఫొటోలతో దివ్యత్వం!! Kirlian photo secret







Kirlian trick photography
anyone can perform







1939 లో రష్యాలో ఇంజనీర్ దంపతులు అనుకోకుండా కొథ రకం ఫొటోలు తీశారు.ఫిల్మ్ లేకుండా,లెన్స్ లేకుండా, కేవలం ఫొతొగ్రాఫిక్ ప్లేట్ పై వస్తువు పెడితే దాని రూపం వింతగా వస్తుంది. ఆకులు, చేతి వేళ్ళు పెట్టి ఫొతోలు తీ శారు. రూపం చుట్టూ ఒక విధమైన వెలుగు రంగు కనిపిస్తుంది. వస్తువు తడి కి హై వోల్తేజ్ వలన ఆవిరి ఇలా మారి కనిపిస్తుంది .అది చూపి అతింద్రియ శక్తుల వారు పుస్తకాలే రాసేశారు .ఇది ఎవరైనా ప్రయోగం చేసి చూపవచ్చు .దినిని కరోన దిస్ చార్జ్ ఫొటొగ్రఫి అంటారు .జేంస్ రాండి అలా చేసి చూపారు. వోల్తేజ్ విద్యుత్ పంపితే ,చిత్రం చుట్టూ వెలుగు ఆకర్షణ కనపడుతుంది.బాబా ల చిత్రాలకు ఇలాంటిందే వాడి భక్తులను మభ్య పెడుతుంటారు. కిర్లియన్ ఫొతో మహత్తు రహశ్యం ఇదే .

Monday, June 22, 2009

ముస్లిం ల మదరసాలు అంటే




ముస్లిం చిన్న పిల్లలను ముస్లింలు తప్పని సరిగా మతపరమైన బడులలో చేర్పించి మత విద్య చెప్పిస్తారు .అవి మదరసాలు.జకాత్ అని ఫిత్రా అని సదఖా,ఇందాత్ అనీ డబ్బు ఇస్తారు.విదేసాలలో వున్న భారతీయ ముస్లింలు కూడా ఈ డబ్బు ఇస్తారు. మదరసాలలో పిల్లలకు వుచిత భోజనం పెడతారు. కొన్ని వక్ఫ్ బోర్డ్ లు పరిమితంగా మదరాసాలకు ఆర్థిక సహాయం అందిస్తాయి .ఇంతవరకూ బాగానే వున్నది. కాని మదరసాలలో తప్పనిసరిగా కురాన్ కంటస్తం చేయిస్తారు .అంటే ఆరబిక్ భాష విధిగా, అర్థం తెలియక పోయినా వల్లె వేయాల్సిందే. లోపం ఎక్కడ అంతే సైన్స్ చెప్పక పోవడం. దీని వలన ముస్లిం విద్యార్థులు మతపరంగానె వుంటూ, సమజంలో ఇతరులతో దీటుగా రాలేకపోవడం జరుగుతున్నది. మదరసాలలో మరొక ప్రమాదం ఏమంటే పరమత ద్వెషం ,ఇస్లాం కోసం త్యాగం నూరి పోయడం. ఇది ఆత్మాహుతి దళాలకు, హింసకు ,తెర్రరిజానికి దారి తీస్తున్నది. లోగడ పాకిస్తాన్ ప్రసిడెంట్ ముషారఫ్ కూడా మదరసాలలో జరుగుతున్న ప్రమాదాలను చెప్పి, సైన్స్ కు మరల మన్నాడు. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాషీ లేకపోవడం కూదా మంచిది కాదు.

Thursday, June 18, 2009

గోరాతో పరిచయం





















పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు.1955లో ఆవుల గోపాలక్రిష్నమూర్తి వద్ద తెనాలిలో పరిచయం. ఆ తరువాత హైదరాబాద్ లో అస్సెంబ్లి ఎదుట చెట్లు పీకి కూరగాయల మొక్కలు నాటే వుద్యమంలో చెంత వున్నాను .మా ఇంటికి తరచు వచేవారు. చొక్కా లేకుండా పంచె కప్పుకొని నిరాడంబర జీవితం గడిపారు. కొన్ని సభలలో కలసి పాల్గొన్నాము .ఆయన సాహసి.నాస్తికుడుగా బ్రహ్మణులచేత వెలికి గురి అయ్యారు. ఒక దళిత వాడలో వుండి ,చెప్పింది చేసి, కులాంతర మతాంతర మానవ వివాహాలను చేయించారు. ఫ్రపంచ పర్యటన చేసి నాస్తిక వుద్యమానికి ప్రచారం చేసారు.నేను అమెరికా యురోప్ లో పర్యటించినప్పుడు గోరా తెలుసా అని అడిగేవారు.మత పరంగా ఆహార నిషేధాలు నిరసిస్తూ, పంది గోవు మాంసాలతో విందు చేసినప్పుడు విజయవాడ లో మతస్తులు ఆందోళన చేసినా ముందుకు సాగారు.గాంధిని కలసినా తన వాదన వినిపించి నాస్తికత్వానికి నిలచిన గోరా చరిత్ర లో గొప్ప వ్యక్తిగా నిలిచారు .1975లో సభలో మాత్లాడుతూ చనిపోయారు

Tuesday, June 16, 2009

మూఢ నమ్మకాల ఆట

ఇజ్రాయిల్ క్రైస్తవ యాత్ర నుండి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రాజశెఖర రెడ్డి వర్షాలు తెచ్చానన్నారు

తెలంగాణా కోసం చండీ యాగం చేశాడు కె సి చంద్రశేఖ ర్

వర్షాలు పడడానికి యగ్నం చేయించ్చాడు మంత్రిగా

2000 ల లో ప్రపంచం అంతం అవుతున్నదని పుస్తకం ప్రచురించ్చాడు మాజి ఐ ఎ ఎస్ అధికారి వేదవ్యాస్

వర్షాల కోసం నమాజ్ ప్రార్ధనలు చేసారు ముస్లింలు హైదరబాద్ లో

జనం లొ వున్న నమ్మకాలను ఎంత బాగా వాడుకుంటునారో ! వీరికి బాధ్యత లేదు, అడిగే దిక్కు లేదు

Monday, June 15, 2009

రాళ్ళ రత్నాల చికిత్చ

రాళ్ళకు రత్నాలకు,వజ్రాలకు మనుషుల ఆరోగ్యానికి,ఆయుష్ కు,సంబంధం వున్నదని ఇటీవల టి వి లలొ, పత్రికలలో విపరీతంగా స్వాములు,జోస్యులు ప్రకటనల ప్రచారం చేస్తున్నారు.భారత మెడికల్ కౌన్శిల్ నిపుణుల సంఘం రాళ్ళ రత్నాల చికిత్చ అశాస్తీయం అని అది నిషేధం అని చెప్పారు. కనుక ప్రకటనల ద్వారా మోసాలు చేస్తున్న వారిని శిక్షించవలసి వున్నది.రాళ్ళకు గ్రహాలకూ ఎలాంటి సంబంధం లేదు. టి వి లలో పత్రికలలో ప్రకటనలు వేస్తున్నప్పుదు అది శాస్త్రీయంగా రుజువు కాలేదని రాయాలి.రుద్రాక్ష్ల విషయంలోనూ డ్రగ్స్ అండ్ మజికల్ రెమిడీస్ చతం క్రింద చర్య తీసుకుంటే అమాయకులను కాపాడవచ్చు.

Friday, June 12, 2009

కులం అంటే ఏమిటి

భారత దేశంలో పుట్టగానే కులం అంటగడతారు.వంశ పారంపర్యంగా కులం వస్తున్నది.కులం అంటే ఏమిటో తల్లి తండ్రులకు తెలియదు.వారి పూర్వికుల నుండి వారికి సంక్రమించింది.కులం ఇప్పుడు అంతువ్యాధి లా ప్రబలి, బలపడి , రాజకీయాల్లొకి వచేసింది .కులానికి తల్లి తండ్రి మతమే. నాలుగు వర్నాలు నేనే పుట్టించానన్నాడు గీతలో .కుల పరంగా మనువు శిక్షలు చెప్పాడు కులం పోగొట్టాలని సంస్కర్తలు ప్రయత్నించి విఫలమయ్యారు .మూలం మతం లో వుండడమే .దాని జోలికి పోకుండా కులం పో దు .

Thursday, June 11, 2009

అద్రుస్టం ఎక్కడ







భారత దేశంలో అరచేతిలో అద్రుస్తం తెలుస్తుందని నమ్మి హస్త సాముద్రికం పేరిత చేతులు చూపించుకుంటారు. చేతిలో రేఖలకు అలాంటి కార్య కారణ సంబంధం అనాటమి శాస్త్రం ప్రకారం ఎక్కడా రుజువులు లేవు.చైనాలొ అర కాళ్ళలో భవిశ్యత్తు తెలుస్తుందని నమ్ముతారు .అది ప్రాచీన విశ్వాసము .చైనాలో అక్యు పంక్చర్ నుండి ఇలాంటి మూఢ విశ్వాసాలు కమూనిస్తులు వచ్చినా పోలేదు!జేంస్ రాండి ని పిలిచి తమ దేశంలో అంధ విశ్వాసాల గురించి కను విప్పు గావించ మని కోరగా అతడు కొన్ని వివరించాడు. ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ కు అక్యు పంక్చర్ చూపి గొప్పగా గర్వించిన మావో రాజ్యం ఇప్పుడు అది శాస్తీయం కాదని గ్రహించింది .

Wednesday, June 10, 2009

గిన్నీస్ రెకార్ద్ లోకి వీరమాచినేని సరోజిని

Sarojini with Innaiah around 1996











వీరమాచినేని సరోజిని చిన్నారి పాపలు సినిమా (1967) లో తీసి గిన్నీస్ రెకార్ద్ లోకి చేరింది.అందులొ నటీనతులు,సాంకెతిక సిబ్బంది అందరూ స్త్రీలే కావదం ఇందుకు కారణం. సావిత్రి డై రెక్తర్ గా వున్న సినిమాకు సరోజిని కథ రాసి నేపధ్య సహాయం అందించింది .ఆమెతో నాకు హైదరబాద్ లో పరిచయం అయ్యెనాటికి బాగా వ్రుద్ధాప్యం వచ్చినా గొంతు మాత్రం చెక్కు చెదరలేదు .1940-50 మధ్య ఆమె కమూనిస్త్లు నడిపిన ప్రజానాట్య మండలిలో అల్లూరి సీతారామరాజు బుర్ర కథలు చెప్పి జనాన్ని వుర్రూత లూగించింది.అవి కొన్నీ వినిపిస్తే ఆశ్చర్య పోయాము. ఆమె భర్త వీరమాచనేని మధుసూధనరావు తీసిన సినిమాలన్నీ విజయవంతం కాగా ఆయన్ను విక్తరీ మధుసూధనరావు అని పిలిచేవారు. ఆయన బాగా వ్రుద్దాప్యం లో వున్నారు. కొన్నేళ్ళ క్రితం సరొజిని చనిపోక ముందు నాడు కళారంగంలో స్త్రీల పాత్ర చెప్పింది. నటి సావిత్రి గురించి ఆసక్తి కరమైన విషయాలు వివరించింది .ఆమె అనుభవాలు గురించి ఆంధ్ర జ్యోతి లో రాసాను

ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ప్రవర్తిస్తారా





ఆంధ్ర ప్రదేష్ లో కొత్త అస్సెంబ్లి ఏర్పడి సమావేశమైంది.పాత కొత్తల కలయికగా సభ్యులు, మంత్రులు వున్నారు.అస్సెంబ్లిలో పాటించావలసిన కనీస విధులు వున్నాయి.వాక్ ఔట్ లు పూర్తిగా మానడం అవసరం. ప్రొటెస్ట్ తెలిపి కూర్చోవాలి .అది రికార్డ్ అవుతుంది . స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నినాదాలు ఇవ్వడము ,కూర్చుండడం మానాలి సమయం పాటించాలి .ప్రశ్నలు సమాధానాలు ఒక గంటలో పూర్తి కావాలి .రూల్స్ పెట్టుకున్నది సబ్యులే అన్నది గ్రహించాలి .సభలొ కూర్చో వాలి. ప్రజలు వో ట్ వేసి పంపారని మరువకూడదు .సభా విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు వున్నది గనుక పూర్తి గా ప్రసారాలకు అవకాసం వుండాలి .కొత్త సభ్యులకు కనీస ట్రైనింగ్ ఇవ్వాలి .అసెంబ్లి పట్ల గౌరవం పెంచాలి .

Monday, June 8, 2009

ఎందుకని ? ఆలోచించండి

అదేమిటో గాని ఏ మతంలోనూ స్త్రీలను పురుషులతో సమానంగా చూడలేదు. మానవ హక్కులలో పేర్కొన్న సమానత్వం మతాలలో లేదు. ప్రధాన దేవుళ్ళందరూ మగవాళ్లే. ముఖ్యమైన ప్రవర్తనంతా పురుషులే. క్రైస్తవ పోపులు కేవలం మగరాయుళ్లే. అందరూ సమానం అన్న బౌద్ధంలో సైతం స్త్రీలకు ప్రాధాన్యత లేదు. దక్షిణ అమెరికానుండి చైనా వరకూ, ఆస్ట్రేలియా నుండి కెనడా వరకూ వివిధ దేశాలలో రకరకాల దేవుళ్ళను సృష్టించారు. కొందరు చరిత్రలో కలిసిపోయారు. కొందరు మార్పులకు లోనయ్యారు. మరి కొందరు సంస్కరించబడ్డారు. ఇదంతా పురుషుల పనే గనక స్త్రీలకు ప్రాధాన్యత ద్వితీయ స్థానంలోనే లభించింది. మూల గ్రంథాలలో కూడా రచయితలు పురుషులే గనక స్త్రీలను అగౌరవంగా కొన్నిసార్లు నీచంగా, మరికొన్నిసార్లు బానిసలుగా భావించారు. ఏతావాతా అంతా పురుషమయంగా సాగిపోతున్నది. స్త్రీలు మతాలను వ్యతిరేకించి హక్కులు, సమానత్వం కావాలనటం అంతగా లేదు. నమ్మకాల వలన పురుషాధిక్యతను, మూలగ్రంథాలను, మత విశ్వాసాలను గుడ్డిగా నమ్ముతున్నారు. అదే పిల్లలకు నూరిపోస్తున్నారు. మానవ హక్కులకు మతాలకు వైవిధ్యం వచ్చినప్పుడు మతాలనే స్వీకరిస్తున్నారు. అన్ని దోషాలకూ ఈ పురుషాధిక్యత మూలం అయి కూర్చున్నది.
ఎందుకని ? ఆలోచించండి. మార్గాంతరాలున్నాయా?

Saturday, June 6, 2009

జర్నలిస్టులకూ ఉంది యాత్రాస్థలం!

జర్నలిస్టులకు, వార్తా సేకరణకు చరిత్ర వుంది. ఇప్పుడది ప్రపంచ ప్రదర్శనశాలలో అందుబాటులోకి వచ్చింది. వార్తలు, మ్యూజియం, కలిపేసి, న్యూజియం (Newseum) గా అవతరించింది. వాషింగ్టన్ రాజధానీ నగరంలో 6 అంతస్తుల యీ మ్యూజియం జర్నలిస్టుల కృషికి అద్దం పడుతున్నది.
ఇటీవలే యీ న్యూజియంను నేను చూచాను. ఇందులో విశేషాలు సమకాలీనమే గాక, పరిశోధకులకు కావలసినంత సమాచారం వుంది.
కనుక జర్నలిస్టులు యీ న్యూజియంను సందర్శించాలి. అది ఒక పట్టాన సాధ్యమయ్యేదికాదు. ఖర్చుతో కూడిన పని. కనుకనే మారుమూలల వుండే జర్నలిస్టులకు సైతం – తెలుసుకోడానికి అనువుగా న్యూజియం వెబ్ సైట్ ఏర్పరచారు.
వార్తల్ని సేకరించడంలో జర్నలిస్టులు పడే ఇబ్బందులు, ముఖ్యంగా యుద్ధాలలో, సంక్షోభాలలో, తుఫానులలో, సునామీ వంటి ప్రమాదాలలో ఎదుర్కొనే కష్టాలు చెప్పనలవి కాదు. అందులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా రిస్క్ తీసుకుంటున్నారు. వారందరి సమాచారం సేకరించి, వారికి జోహార్లు అర్పిస్తూ, జ్ఞాపికలు ఏర్పరచారు. అది ఉత్తేజాన్ని కలిగించే దృశ్యం ఈ మ్యూజియంలో.
ప్రపంచ చరిత్రలో మలుపులు తిరిగిన సంఘటనలు ఉన్నాయి. బెర్లిన్ గోడ కూలగొట్టినప్పుడు (1989), అందులో ఒక భాగం తెచ్చి పెట్టారు. దాని చరిత్ర రాశారు. అలాంటివి ఇంకెన్నో యీ మ్యూజియంలో ఎదురౌతాయి.
రహస్య వార్తల్ని సేకరించడానికి జర్నలిస్టులు చేస్తున్న కృషిని వివరిస్తూ, థియేటర్లో దృశ్యరూపాలు ఏర్పరచారు. ఉదాహరణకు ఒక మానసిక వికలాంగుల శరణాలయానికి ఒక స్త్రీ జర్నలిస్టును రహస్యంగా పంపి, ఆమె కూడా పిచ్చెక్కిన మనిషివలె ప్రవర్తించినట్లు చేశారు. అలాంటప్పుడు అక్కడి డాక్టర్లు, నర్సులు ఎలా చూస్తారో, ఏం చేస్తారో ఆమె ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ తరవాత వాటిని వార్తల రూపేణా ప్రపంచానికి బయటపెట్టింది.
ప్రతి అంతస్తులోనూ ఒక థియేటర్ ఏర్పరచి వివిధ అంశాలు ఆకర్షణీయంగా, సంక్షిప్తంగా చూపడం ప్రత్యేక ఆకర్షణ.
ఇందులో భాగంగా 4-డి చిత్రం కూడా వుంది. మనం కూర్చున్న కుర్చీలు సన్నివేశాలకు అనుగుణంగా కదలాడడం, మన మీదకు గాలి తెమ్మెరలు, నీటి తుంపరలు పడడం మరో విశిష్టత.
కార్టూన్ల విభాగం, హస్యపూరిత బొమ్మల భాగం మరో ఆకర్షణ.
ప్రపంచంలో సుప్రసిద్ధ పత్రికలు పాతకాలపు నాటివి అట్టి పెట్టారు. తాజాగా ఏరోజుకారోజు ఎడిషన్లు చూపుతూ టి.వి.లలో ఎప్పటికప్పుడు ప్రసారాలు అందిస్తున్నారు.
సందర్శకులు స్వయంగా టి.వి. వార్తల్లో పాల్గొ నేటట్లు ఏర్పరచారు. అది గొప్ప ఆకర్షణ.
అబ్రహాం లింకన్, కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని హతమార్చిన ఘట్టాల చరిత్రలు అమర్చారు. ఏదైనా సరే యథేచ్ఛగా ఫొటో తీసుకోవచ్చు.
పిల్లలకు ఆకర్షణీయమైన అంశాలు ఆట్టే లేవు. పెద్దలకు మాత్రం మెదడుకు మేత బాగా వుంది.
పత్రికాస్వేచ్ఛ చరిత్ర చూపుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరచినవ విధానాలు ప్రస్తావిస్తున్నారు. వార్తలలో నీతి అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొని, సెన్సార్ రీతులను ప్రదర్శిస్తున్నారు.
జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా వార్తా సేకరణలో తీసిన ఫోటోలు, అందులో పులిట్జర్ అవార్డులు లభించినవి ప్రదర్శించారు.
ప్రదర్శనలో ప్రవేశించగానే ఒక థియేటర్ లో ప్రేక్షకులకు మ్యూజియంలో చూపబోయేవి, చూడవలసిన అంశాలు వివరించడం వలన, ఎవరికి తగ్గట్టు వారు ఎంపిక చేసుకోవచ్చు.
పెద్ద తెరలు పెట్టి, ఎప్పటికప్పుడు వార్తలు చూపుతున్నారు. ఆ ప్రక్రియ వెనక జరిగే కృషి వివరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ అనేది నేడు అందరూ అనుసరిస్తున్నారు. అదేమిటో వివరించడం గమనార్హం.
ప్రపంచంలో పత్రికలు, పుస్తకాలు తొలి రోజులలో ఎలా వుండేవి. ఏ విధమైన అచ్చు యంత్రాలు వాడుతూ పోయారు, ఆపరిణామాలు ప్రదర్శిస్తున్నారు. సుప్రసిద్ధ పుస్తకాలు, పత్రికల నమూనాలు వుంచారు.
ప్రపంచంలో జర్నలిస్టులు అక్కడికి వచ్చినప్పుడు వారితో చర్చలు, ప్రసంగాలు ఏర్పాటు చేయటం నిత్యకృత్యంగా ఉన్నది. వివిధ వార్తా సంస్థలతో సంబంధాలు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత ఈ మ్యూజియం వాషింగ్టన్ శివార్లలో ఉండేది. నేను అది చూచిన తరవాత జర్నలిస్టు మిత్రులు కె. శ్రీనివాస రెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రభృతులు వాషింగ్టన్ రాగా వారికి వివరించి వెళ్ళి చూడమన్నాను. ఆ తరువాత ఆ మ్యూజియం మూసేసి, ప్రస్తుతం రాజధాని మధ్యలో కొత్తగా మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందరూ దీని వెబ్ సైట్ (www.newseum.org)కు వెళ్ళి వివరంగా చూచి ఆనందించవచ్చు. వెబ్ సైట్ లో యూ ట్యూబ్, లైవ్ పిక్చర్స్ చూస్తూ మ్యూజియంని ఆనందించవచ్చు. కనుక అమెరికా రాజధాని వెళ్ళి చూడలేకపోయిన వారు కంప్యూటర్ ద్వారా ఆ విషయాలను గ్రహించి మెదడుకు మెతగా స్వీకరించవచ్చు.

Friday, June 5, 2009

వాస్తు నేరాలు

ఇటీవల అంటువ్యాధిలా వాస్తు ప్రబలింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అతిగా ఉన్నదని అభిప్రాయం ఏర్పడింది. అమెరికాలో ఉన్న ఆంధ్రులకు కూడా ఇది ప్రస్తుతం అంటుకున్నది.
వాస్తులో వాస్తవం లేదని, శాస్త్రీయ (సైంటిఫిక్) పరిశీలనకు అది నిలవడం లేదని చూపినా నమ్మకమే గట్టిగా అమలు అవుతున్నది. ప్రజలలో ఉన్న ఈ నమ్మకాన్ని పట్టుకొని వాస్తు వ్యాపారులు గృహాలలోనూ, పరిశ్రమలలోనూ దీనిని అమలు పరుస్తున్నారు. పత్రికలూ, టి.వి.లు కూడా తమ గిట్టుబాటు ధోరణిలో వాస్తుకు ప్రోత్సాహం పలుకుతున్నాయి.
హైదరాబాదులో నెలకొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యంతో పాటు వాస్తు కూడా బోధిస్తున్నారు. దీనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులను సమకూరుస్తున్నది. యూనివర్సిటీ ఇలా అశాస్త్రీయ అంశాలను విద్యార్థులకు చెప్పడం ద్రోహం అని, దీనిని తొలగించాలనీ, శాస్త్రీయం అని రుజువు అయేవరకూ కొనసాగించరాదనీ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో మేము దాఖలు చేసిన రిట్ పిటిషన్ అడ్మిట్ అయింది. యూనివర్సిటీ వారికి నోటీసులు ఇచ్చి రెండేళ్ళయినా ఇంతవరకూ సమాధానం చెప్పలేదంటే వారి లోపాన్ని, మెతకదనాన్ని గ్రహించవచ్చు.
వాస్తులో పూర్వ గ్రంథాలు కులాన్ని పాటించాయి. కట్టడాలలో కుల హెచ్చుతగ్గులను పేర్కొన్నాయి. ప్రస్తుతం అది వివాదాస్పదం అవుతుందని ఏమీ ఎరగనట్టుగా వూరుకుంటున్నారు. అంతేగాని వాస్తు గ్రంథాలలో కులపరంగా కట్టడాలు పేర్కొనడం తప్పు అని వాస్తు పండితులు ధైర్యంగా రాయడం లేదు.
వాస్తు పండితులు చెప్పినవి విఫలమైనప్పుడు వాటికి బాధ్యత వహించరు. పైగా రోగాలకు, ఆర్థిక ఇబ్బందులకు కట్టడాలలో వాస్తు దోషాలను చూపుతున్నారు. నమ్మినవారు కట్టడాలను కూలగొట్టడం, మరమ్మత్తులు చేయడం ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి బాధ్యతనూ వాస్తు పండితులు స్వీకరించరు. వారికి వచ్చే వాస్తు ఆదాయం పై పన్నులు లేవు. లెక్కలు చూపరు. అంతా రహస్యం. వైఫల్యాలను శిక్షించాలంటే తప్పించుకు పోతారు. చివరకు నమ్మకస్తులు గుడ్డిగా ప్రభుత్వ కార్యాలయాలలోకి కూడా వాస్తును ప్రవేశపెట్టారు. ప్రజల పన్నులతో వచ్చే డబ్బును ఇలా ఖర్చు చేయటం అభ్యంతరకరమైన విషయం.ఈ సందర్భాలను పదే పదే చర్చలలో, టి.వి.ల ద్వారా, పత్రికా ముఖంగా చెబుతూ ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదు. సమాజం ఈ రంగంలో వెనక్కి నడుస్తున్నది అనడానికి వాస్తు

Tuesday, June 2, 2009

జ్యోతిష్యంలో రుజువులకు నిలిచేది లేదు.

జ్యోతిష్యంలో బోగస్ నమ్మకాలు
తారాబలం అనేది జ్యోతిష్యంలో ప్రధానంగా పేర్కొంటారు. అంటే 27 నక్షత్రాల బలం మనుషులపై గట్టిగా ఉన్నట్లు చెబుతారు. అదే బోగస్ అంటే.
వారు చెప్పే తారలు ఖగోళ శాస్త్రం ధృవీకరించడం లేదు. అదలా వుంచితే, యీ తారల వెలుగు మనుషులపై పడ్డా ఎంతకాలం పడుతుంది? వాటి దూరం ఎంత? జ్యోతిష్యులు ఎలా కొలుస్తున్నారు? దీనికి జవాబు రాదు. ఇవ్వలేరు కూడా. అలాంటప్పుడు జన్మ నక్షత్రం బోగస్ కదా? అలాగే నమ్మిస్తున్నారు. ప్రశ్నించకుండా జనం గుడ్డిగా అనుసరిస్తున్నారు.
రాసుల విషయమూ అంతే గదా. అవి వూహలు. వాటి బలం ఎలా ఆపాదిస్తారు? ఇలా ఒక్కొక్కటే పొరలు విప్పుతూ పోతే జ్యోతిష్యంలో రుజువులకు నిలిచేది లేదు.
పుట్టుకను ఎలా నిర్ధారిస్తారు? పుట్టినప్పుడు శిశువుపై పడే కిరణాల వలన నిర్ధారిస్తారా? అయితే ఏ సమయంలో ఎన్ని కిరణాలు పడతాయి? జ్యోతిష్యానికి యివి ఏవీ తెలియవు.
వ్యాపారం మాత్రం జోరుగా సాగిపోతున్నది. జవాబులు చెప్పలేనప్పుడు మిగిలేది ఆగ్రహమే?