Thursday, October 1, 2009

ఇక సెలవు

నా ప్రపంచం వ్యాసాలలో ఉదహరించిన రాందేవ్, బాబా, రవిశంకర్ వగైరా ప్రభృతులపై నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం కాని ద్వేషం కాని లేవు. వారు వెళ్లడించిన భావాలతోనే నా అసమ్మతి, వ్యక్తులపై కాదు. నేను పాత్రికేయుడను. నా పుస్తకాలు తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రామిథియస్ అమెరికా వగైరా ప్రచురణకర్తలు ప్రచురించారు. అంతర్జాలంతో ఎలాంటి సంబంధం లేని నేను, మిత్రులు సి.బి.రావు అహ్వానంపై బ్లాగులోకంలోకి రావటం జరిగింది. తొలుత వారి సూచన మేరకు వివిధ పత్రికలు,పాత్రికేయులతో నా అనుభవాలు మీతో పంచుకోవటానికై ఈ బ్లాగు ప్రారంభించటం జరిగింది. నా అముద్రిత రచనలు కూడా నా ప్రపంచం లో చోటుచేసుకున్నాయి. చాలా పుస్తకాలను e-books గా ఇవ్వటం జరిగింది. తొలినాళ్లలో ఈ బ్లాగులో నా వ్యాసాలను సి.బి.రావు గారు ప్రచురించారు. వారి సహకారంతో నా ప్రపంచం లో నేనే స్వయంగా నా ప్రపంచం పేరుతో పలు వ్యాసాలు ప్రచురించాను. ఈ బ్లాగు ప్రారంభించిన ఉద్దేశం నెరవేరింది కనుక దీనిని ఇకముందు ఉపయోగించబోవటం లేదు. మానవవాదం అనే సరికొత్త బ్లాగులో త్వరలో మీతో నా భావాలు పంచుకుంటాను.

ఇన్నాళ్లుగా ఈ బ్లాగును ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఇక సెలవు.

మీ,

ఇన్నయ్య
http://innaiahn.tripod.com

Monday, September 28, 2009

ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు -పునర్వికాసం

స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతుండగా, మరో వైపు ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు పడ్డాయి. 1940 ప్రాంతాలలో విజృంభించిన యీ పునర్వికాసం కొందరు యువతను బాగా ఆకట్టుకున్నది. సినిమా, కళలు, సాహిత్యం, వివాహం, చదువు, పత్రికల రంగాలలో యీ పునర్వికాసం తొంగిచూచింది.

అటు బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి సామాజిక సంస్కరణ వాసనలు వచ్చి ప్రభావితం చేశాయి. ఆంధ్రకు ఎం.ఎన్. రాయ్ ను తెచ్చిన అబ్బూరి రామకృష్ణారావు, ములుకుట్ల వెంకటశాస్త్రి, వెన్నెలకంటి రాఘవయ్య అనుకోకుండా సాంఘిక విప్లవ బీజాలు నాటారు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. అది మెచ్చిన వారు, పునర్వికాసానికి దోహదం చేశారు. ఆనాడు వారిది ఎదురీత. అయినా వారు నాటిన బీజాలు మానసిక వికాసానికి, భావ విప్లవానికి దారి తీశాయి.


బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండోప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు. గుర్రం జాషువా వంటి వారికి ఆ వాదన నచ్చగా, యధాశక్తి అనుసరించారు. మరొక పక్క నాస్తిక వాదంతో గోరా, త్రిపురనేని రామస్వామి పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. సాంఘిక ఉద్యమం తలపెట్టారు.


ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, అధ్యయన తరగతులు, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో గూడ వల్లి రాంబ్రహ్మం సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎవరూ వెయ్యని ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించి, కళ్ళు తెరిపించారు.


ఆనాడు అదంతా ఎదురీత. స్వాతంత్ర వుద్యమ ప్రవాహం. విపరీతంగా వుండగా పునర్వికాసం సాహసోపేతంగా సేవలు అందించింది. ఎం.ఎన్. రాయ్ ఆంధ్ర పర్యటనలు కొందరు మేధావులను పురికొల్పి, ఉద్యమానికి ఉద్యుక్తుల్ని గావించింది.
అబ్బూరి రామకృష్ణారావు స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా విశాఖ నుండి రామాయణ విమర్శ అందించారు.
గుంటూరులో బండారు వందనం దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో పెమ్మరాజు వెంకటరావు నెల్లి మర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపి, చక్కని పునాదులు ఏర్పరచారు.


ఉపాధ్యాయుడుగా ఎలవర్తి రోశయ్య అనేక మంది విద్యార్థులకు అటు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేసి, చదివించారు. విద్యార్థి లోకంలో సంచలనం కలిగింది. పాముల పాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు.


గుత్తి కొండ నరహరి తన వుపన్యాసాలతో వ్యాసాలతో వుర్రూత లూగించారు. బండి బుచ్చయ్య నడిపిన ములుకోల అందుకు వూతంయిచ్చింది.
సాహిత్య ప్రచురణలు ఏర్పరచి కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు.
ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. కవులను, గాయకులను, చిత్ర కారులను, రచయితలను కూడ గట్టి, ఆవుల (ఎజికె అనే వారు) అధ్యయన తరగతులు నిర్వహించారు. సాహిత్యంలో ఔచిత్యం వుండాలన్నారు. త్రిపురనేని రామస్వామి సాహిత్యాన్ని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలను బాగా విస్తృతం గా జనంలోకి తీసుకెళ్ళారు.


తెనాలి కేంద్రంగా రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, జ్యోతి, రేరాణి, సినిమా, అభిసారిక పత్రికలు వివిధ రంగాలలో శాస్త్రీయ ఆలోచనకు దోహదం చేశాయి. ఆలపాటి రవీంద్రనాధ్ జ్యోతి పత్రిక యువ రచయితలకు ఆయువు పట్టుగా, శాస్త్రీయ చింతనకు దీటుగా తోడ్పడింది. ఆనాడే కుటుంబనియంత్రణ కావాలన్న పత్రిక జ్యోతి గొప్ప మలుపు తిప్పింది.


జి.వి. కృష్ణారావు కళా సాహితీ రంగాలలో మానవ వాద ధోరణిలో మార్క్సిస్టు పంధాను విమర్శిస్తూ, కావ్య జగత్తు రాశారు. కీలు బొమ్మలు, జఘనసుందరి, కళాపూర్ణోదయ విమర్శ, పాపి కొండలు వెలువరించారు.

రాజకీయ రంగంలో కాంగ్రెస్ వ్యవస్తనూ కమ్యూనిస్టు పద్ధతుల్ని కాదని, చిన్న కథలలో రాజకీయాల్ని రాసిన గోపీ చంద్ పెద్ద సంచలనం సృష్టించారు. ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చక్కని ఆలోచనా పూరిత రచనలు చేశారు. గోకుల్ చంద్, పి.వి. సుబ్బారావు, కోగంటి సుబ్రహ్మణ్యం ఆ కోవలోని వారే. జాస్తి జగన్నాధం విద్యార్థి దశ నుండి ఎం.ఎన్. రాయ్ రచనల్ని కొన్ని తెలుగులోకి అందించారు. చరిత్రలో శాస్త్రీయ పంధా ఎలా వుండాలో చూపారు భట్టి ప్రోలు హనుమంతరావు, కల్లూరి బసవేశ్వరరావు. ఇది ఎం.ఎన్. రాయ్ వేసిన బాట.
నాటకం, కథలు, సినీరంగంలో రాయ్ అనుచరుడుగా భావ విప్లవానికి బీజాలు వేసిన డి.వి. నరసరాజు పేర్కొన దగిన వ్యక్తి. మల్లాది రామమూర్తి మానవ వాదిగా తీవ్ర కృషి చేయగా, మల్లాది సుబ్బమ్మ ఆ కృషిని కొనసాగించింది.


రావిపూడి వెంకటాద్రి హేతువాద మానవ వాద వుద్యమాన్ని నిలబెట్టడంలో విపరీత సాహిత్య, పత్రిక, వ్యాస రంగాలను వినియోగించారు. అధ్యయన తరగతులు నిర్వహించారు.

ఎన్.వి. బ్రహ్మం మత ఛాందసాలను, బైబిల్ బండారం ద్వారా ఎండగట్టారు. సి.హెచ్. రాజారెడ్డి, కొల్లి శివరామరెడ్డి, ఎం.వి. రమణయ్య, అచ్యుత రామ్, పరమయ్య మానవ వికాస ఉద్యమ రంగంలో అనేక పరిమళాలు వెదజల్లారు. ఎ.ఎస్. అవధాని ఆ కోవలోని వారే. అలాగే ఎ.వి. మోహన్ కూడా.


తెలుగులోకి మానవ వాద సాహిత్యం అనువాదాలరూపేణా, సొంత రచనల ద్వారా రావడానికి తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్శిటి సహకరించాయి. (ఎన్. ఇన్నయ్య అనువాదాన్ని, రచనల్ని వారు వెలువరించారు).

పత్రికా రంగంలో ఎ.ఎల్. నరసింహారావు, ఎన్.కె. ఆచార్య వుద్యమాన్ని పోషించారు. ఆవుల సాంబశివరావు వివిధ పదవులు సాగిస్తూనే, మానవ వాదిగా సాహిత్యాన్ని సమాజంలోకి తెచ్చారు.

ఎం.ఎన్. రాయ్ మానవ వాద ప్రభావంతో నార్ల వెంకటేశ్వరరావు ఇంగ్లీషులో గీతపై విమర్శ గ్రంథం తెచ్చారు.
నార్ల నాటికలు, నాటకాలు, విమర్శలు, పద్యాలు బాగా పునర్వికాస మానవ వాద ధోరణి ప్రబలించాయి. నరకంలో హరిశ్చంద్ర నాటకాన్ని ఎన్. ఇన్నయ్యకు అంకితం చేశారు. అలాగే తన యితర రచనల్ని మానవ వాదులకు అంకితం చేశారు.
ఎం.ఎన్. రాయ్ మానవ వాద ధోరణి శ్లాఘిస్తూ సంజీవ దేవ్ రాశారు. లలిత కళారంగంలో కొత్త పోకడలు చూపారు. అతీంద్రియ శక్తుల ఆలోచనలో శాస్త్రీయత, లేదన్నారు. పాలగుమ్మి పద్మరాజు పుంఖాను పుంఖంగా మానవ వాద రచనలు చేసి రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన రచనతో పార్టీ రహిత ప్రజాస్వామ్యం చూపాడు.


కొండ వీటి వెంకట కవి, ఆలూరి బైరాగి, కవిరావు, తెలంగాణాలో ఎం. నారాయణ వై. రాఘవయ్య, ఆలంఖుందుమీరి యిలా ఎందరో యధాశక్తి పునర్వికాసానికి తోడ్పడ్డారు. విజయనగరంలో తాతా దేవకీ నందన్ మొదలు ఎందరో వుద్యమానికి ఉపకరించారు.
నేడు సమాజంలో శాస్త్రీయ ధోరణి సన్నగిల్లి, మత మౌఢ్య మోతాదు పెరిగింది. విద్యార్ధులలో వైజ్ఞానిక దృక్పధం పోతున్నది. ఎందుకని?
నేటి ఆవశ్యకత పునర్వికాసం, వైజ్ఞానిక పంధా, మానవ విలువ, అదెలా సాధ్యం? ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
పునర్వికాసం అంటే మానవ విలువలు పాటించడం చరిత్రను వైజ్ఞానికంగా రాసుకోవడం. మానవులను కించపరచే కులం, దానికి మూల మైన మతాన్ని దూరంపెట్టడం, శాస్త్రీయ పాఠ్య ప్రణాళికను ప్రాధమిక దశ నుండే అమలు పర్చాలి. ఇది కష్ట సాధ్యం అయినా అవస

మానవ సేవలో వైద్య రంగం


human anatomy as discovered by Vesalius made things easy for medical treatment










William Harvey made turning point through finding of circulation of blood











Wilhelm Roentgen who revolutionised through x-ray discovery










Alexander Fleming who discovered anasthesia to save surgical treatment



























humans are gradually revealed through jenome and DNA











anatomy started medical revolution








శాస్త్రీయ పరిసొధనలు చేసి ప్రపంచానికి తెలియజేసి ఉత్తమ సేవ చేసిన, చేస్తున్న రంగం వైద్యం.
ఇందులో మలుపులు తిప్పిన పరిశీలనలు వున్నాయి.




1. అనాటమీ

మానవ శరీరంలో వివరాలు బాగాతెలిస్తే వైద్యం చేయడం అనుకూలమౌతుంది .ఆందుకు ప్రధమం గా ఉపయోగపడినది శరీరవిభాగాల శాస్త్రం.ముందు జంతువులను తురువాత మనుషుల శవాలను కోసి అనాతమి వివరాలు గ్రహించారు. అది నిరంతరంగా సాగుతున్న పరిషోధన. ఎందరో మహానుభావులు వున్నా వెసాలియస్స్ కు తొలి ధన్యవాదాలు చెప్పవచ్చు .







2.రక్త ప్రసరణ గురుంచి గ్రహించడంలో విలియం హార్వె ను ప్రధము
దు గా చెప్పాలి.ఇతరులు వున్నా మౌలికంగా హార్వె కీలక పాత్ర వహించాడు. వైద్యం బాగా ముందుకు సాగడానికి ఇది పెద్ద మలుపు అయింది.






3 లెవిన్ హూక్ అనె వ్యక్తి తొలుత సూక్ష్మ జీవులున్నాయని లోకానికి చెప్పినతరువాత వైద్యవిధానంలో తిరుగులేని మార్పులు వచాయి.








4. ఎడ్వర్ద్ జెన్నర్ శాస్త్రగ్నుడు టీకాల పధతి చూపడంతో చిరకాలం గావస్తున్న మశూచి వంతి మారణ రోగాలకు అడ్డుకట్ట పదింది .ఆ రంగం వుత్తరోత్తరా చాలా మార్పులకు లోనై మానవాళి ని కాపాడుతున్నది .







5.క్రా ఫర్డ్ లాంగ్ వలన అనస్తీషియా కనుగొనగా శస్త్ర చికిచ్చ తేలిక అయి, బాధ లేకుండా చేయడం కుదిరింది .ఆందులో నేడు చాలా వుత్తమ మార్గాలు ప్రవేస పెట్టారు .








6. సైన్శ్ ప్రగతిలో గొప్ప విప్లవం తెచ్చిన ఎక్ష్ రె , వైద్యానికి కీలక మలుపులు తిప్పుతున్నది .రోట్ గెన్ ప్రారంబించిన ఈ విధానం లో క్రమీణా హాని, దోషాలు తొలగిస్తూ పోతున్నారు .









7.రొస్ హారిసన్ వలన టిస్స్యు కల్చర్ పరిసీలన వైరస్ రంగాన్ని ఎప్పటి కప్పుడు గ్రహించడానికి రోగ నిర్ధారణకు ఉపకరిస్తున్నది.








8.నికొలై అనిచ్ కొవ్ వలన రక్తంలో కొలిస్త్రాల్ గ్రహించడం మొదలైంది .ముఖ్యంగా గుండె జబ్బులకు, తదితర రుగ్మతలకు ఈ రంగం సేవ చేస్తున్నది .







9.అలెక్షాండర్ ఫ్లెమింగ్ వలన యాంటి బయటిక్స్ రాగా నేడది రోగాల పట్ల అనూహ్య శరణ్యం గా మారింది.








10 ఇక జీవన రంగాన్ని సమూలంగా అవగాన చెసుకోడానికి ది ఎన్ ఎ కనుగొనడం ప్రధాన కారణమైంది .క్రమేణా జన్యు సాస్త్రానికి దారి తీసింది .
వివరాలకు పోతే చాలా ఆసక్తి కరమైన సంగతులు వున్నాయి.
వైద్య చరిత్రలో కీలక పాత్ర వహించిన పరిషొధనలు 10

Sunday, September 27, 2009

ప్రెమానంద్ చివరిదశలో


Premanand with beard.It is removed during cancer treatment.









Narendra Naik, the successor of Premanand in Federation of Rationalist, Humanist association and Indian Skeptic magazine, sitting at the bedside of Premanand.









Premanand in Abiram hospital, not able to recognise anyone.His long beard was removed.










Will of Premanand ,asking to donate his body after his death














బసవ ప్రేమానంద్ భారత దేసం లోనే గాక ప్రపంచములో అనేక దేశాలు పర్యటించారు.
దేశములో శిక్షణ తరగతులు నిర్వహించారు.
మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల ,మాతల మోసాలను గుట్టు విప్పారు.
కోయంబత్తూర్ సమీపం లో పోడ నూర్ లో తన భవనం లో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు .
ఆయన వయస్సు 80. కొన్నాళ్ళు గా కేన్సర్ తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు .
ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి ,తాను చనిపోగానె తన దేహాన్ని మెడికల్ కాలేజ్ కు ఇవ్వమన్నారు .
సత్య సాయి బాబా మొదలు అనేక మంది మోసాలను , అరాచకాలను బయతపెట్టారు .
సాయి బాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరి తో గ్రంధం వెలువరించారు .

వివిధ మాజిక్ విషయాలు శాస్తియంగా వివరిస్తూ ,అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంధం రాశారు.
ఇండియన్ స్కెప్తిక్ అనే మాస పత్రిక నడిపి ,ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్న విశెసాలను అందించారు .

దాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్సన పెడితే మత పార్తీలు దానిని నాసనం చేసే ప్రయత్నం తలపెట్టగా ,ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు .
అంత గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాము త్వరలో .లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రెమానంద్ కూడా మానవ హేతువాద వుద్యమాలలో సేవ చేసారు.
ఆయన ఇప్పుదు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.
ఆయన చివరి దశను చూపే కొన్ని చిత్రాలు ఇక్కడ పెడుతున్నాము.

Saturday, September 26, 2009

యోగ ద్వారా మోక్షం










ఆసనాలు యోగలో ఒక భాగం. యోగలో మోక్ష సాధనకు 8 మార్గాలు చెప్పారు. ఆ సనాలు ఒక మెట్టు మాత్రమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు మోక్షం సాధించాలి. ఇది యోగ దర్శన సారాంశం. దీనికి ఆద్యుడు పతంజలి.
యోగ ఆరోగ్యం కొరకనేది ఎక్కడా చెప్పలేదు. కాని ఇప్పుడది వీధి వ్యాపార ఆకర్షణ అయింది. ఇందులో చిలువలు పలవలుగా యోగాలు ఎన్నో పేర్లతో తలెత్తాయి. భారతీయ దర్శనాలు ఆరు మోక్ష మార్గాలుగా వున్నాయి. ఒకరి మార్గం మరొకరు ఒప్పుకోలేదు గనుకనే ఆరు వేర్వేరు కుంపట్లు రాజేశాయి.
యోగ వ్యక్తిగతం అని మూలంలో చెప్పారు. నేడది బృహత్తర పరిశ్రమగా తలెత్తింది. రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో తలతిరిగే అసత్యాలు వ్యాపింపజేస్తున్నది. ప్రపంచం అంత మౌతుందనేది అందులో ఒకటి.
సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలువుండగా, యోగ ఒకటి అని గ్రహించాలి.
హఠయోగం, తాంత్రికయోగం మొదలైనవి అక్కడక్కడా కొందరు స్వీకరించారు. వీటిలో తాంత్రిక యోగంలో సెక్స్ దృష్ట్యా అస్సాం, కేరళ, గుజరాత్ లలో నిషేధానికి గురైంది.
యోగలో భాగంగా కొందరు సూర్య నమస్కారాలు, అందలి ఆసనాలు బోధిస్తున్నారు.
చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే, యోగ అమానుషం.
యోగ స్కూళ్ళలో ఎక్కడా, మూల దర్శనం ప్రకారం మోక్ష ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగంటే, నేటి తరం వారు రారేమోనని అనుకోని వుండొచ్చు. కనుక చిట్కా యోగాలే కేంద్రాలుగా తలెత్తి, వాణిజ్యరంగాలుగా మారాయి. అంతా ఆద్యాత్మికంగానే జరుగుతున్నది.
ఆరోగ్యానికి వ్యాయామం చేయడం డాక్టర్లు చెబుతారు. యోగను కొందరు అంత వరకే పరిమితం చేయడం బాగుంది. విదేశాలకు ప్రాకిన యోగలో దీపక్ చోప్రా వంటి వారు అక్కడ కూడా సైన్స్ పదజాలంతో మోసగిస్తుండగా మహేష్ యోగి వంటి వారు కొత్త పేర్లతో ఆకట్టుకున్నారు. కామిగాని వాడు మోక్షగామిగాడయా అనే సూత్రాన్ని రజనీష్ చక్కగా పాటించి, పోయారు. ఇందిరాగాంధికి సన్నిహితుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ఏకంగా ఆర్డినెన్స్ ఫాక్టరీ కూడా నెలకొల్పాడు.
ఇప్పుడు రాందేవ్ యోగం మొదలెట్టి ఏకంగా కేన్సర్ నయం చేస్తానంటున్నాడు. ఆయన్ను ఆరోగ్యశాఖ ఖండించింది. యోగ చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కేన్సర్ తో చనిపోయారు. 38 ఏళ్ళకే చనిపోయిన వివేకానంద యోగ సరిగా చేయలేదా.?
ఆరోగ్యం కోసం పరిమిత యోగం సమర్థనీయం కావచ్చు.

Thursday, September 24, 2009

సూర్యనమస్కారాలు చేసినందువలన....



భారతదేశంలో సూర్య నమస్కారాల ఆచారాన్ని కొందరు ఆరోగ్య రీత్యా చూస్తున్నారు. మరి కొందరు మతపరంగా, భక్తి పర్వంలోకి దించారు. యోగ వ్యాపారం సరేసరి. చిలవలు పలవలుగా చెప్పడం, పుస్తకాలు ప్రచురించడం కూడా జరుగుతున్నది. ఆరోగ్యాన్ని ఆచారానికి జోడించే సరికి జనానికి కొందరికి ఆకర్షణ పెరిగింది.

ఇంతకూ అసలు సంగతేమిటో చూద్దాం

భూమికి 8 కాంతి నిమిషాల (సెకనుకు 1,86,000 మెళ్ళ) దూరంలో సూర్యగోళం వుంది. అక్కడ నుండి మన భూమిపైకి పడే వాటిల్లో, కాస్మిక్ కిరణాలు, అల్ ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, చార్జ్ డ్ పార్టికల్స్ యిత్యాదులు వున్నాయి.
సూర్యుని నుండి భూమిపై పడే వాటిలో ఏది సూటిగా మన మీద ప్రసరించినా యిబ్బంది కరమే. సూటిగా సూర్యుని ఎప్పుడూ చూడరాదు. గ్రహణం అప్పుడే గాక, అన్ని వేళలా జాగ్రత్త పడాల్సిందే.
అయితే భూమిపైన సుమారు 90 కిలో మీటర్ల ఎత్తువరకూ వాతావరణ పరిధి వున్నది. అది మనకు పెద్ద అండ, రక్షణ. అందులో నుండి కిరణాలు వడపోతతో వస్తాయి గనుక, మనకు చాలా భద్రత వుంది. చివరకు మేఘాలనుండి సూటిగా వర్షం, వడగళ్ళు మన మీద పడ్డా ప్రమాదమే. వర్ష బిందువులు సైతంవడపోతలోనే మనకు చేరతాయి.
భూమిపైన వాతావరణం నాలుగు అంచెలుగా వుంది. భూమి నుండి తక్షణమే వున్న పొరను ట్రోపోస్పియర్ అంటారు. ఇది 10 నుండి 16 కిలోమీటర్ల వరకూ వుంటుంది. ఈ పొరలోనే మనం అనుభవించే నీరు, వాతావరణం వుంది.
ఆపైన రెండోపొర స్ట్రాటోస్పియర్ ఇక్కడ ఓజోన్ ప్రభావం వుంటుంది. తరువాత మెసోస్పియర్. పిమ్మట ధర్మోస్పియర్ (లేదా ఇసోనోస్పియర్) రాకెట్లు ప్రయోగించినప్పుడు వీటన్నిటిని దాటి పోవాలి.
మానవులకు 5 వేల మీటర్ల ఎత్తు వరకే భూమిపైన పరిమితం. అప్పటికే వూపిరాడకపోవడం, ఆక్సిజన్ గొట్టాలు కావలసిరావడం కద్దు. పర్వతాలు ఎక్కేవారికి అదే స్థితి. వాతావరణంలో 40 వేల ఉరుముల వర్షాలు రోజూ ప్రపంచంలో చూస్తాం. అలాగే అనేక మెరుపులు, అవి ఎంతో విద్యుత్తుశక్తి కలిగి వుంటాయి.
సూర్యుని నుండి భూమిపైకి వచ్చే వేడి ప్రాంతాల వారీగా మారుతుంది. అలాగే గాలి కూడా. వాతావరణం నిర్దుష్టంగా తెలుసుకునే శాస్త్రీయ ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటి వరకూ కొంత తెలుసు. ఇంకా చాలా తెలియాలి. అలాగే సముద్రాలను గురించి కొంతే తెలుసు. వాతావరణం నుండి భూమి మీదకు బొగ్గు పులుసు వాయువు విపరీతంగా వస్తుంటుంది. దానిని సూక్ష్మజీవులు స్వీకరించడం వలన మనం సురక్షితంగా వుంటున్నాం. ఈ కార్బన్ ను మళ్ళీ వాతావరణంలోకి రాకుండా తమ గుల్లల్లో (షెల్స్) అట్టి పెడతాయి. అదొక ప్రకృతి అద్భుతం.
జ్యోతిష్యులకు, మూఢనమ్మకస్తులకు, యీ ప్రకృతి సత్యాలు తెలుసుకోవడం అవసరం. అలాగే యోగ గురువులకు కూడా.
సూర్యుని ప్రభావం వలె మన మీద ఇతర తారల ప్రభావం వుండదు. అవి కాంతి సంవత్సరాల దూరంలో వుండడమే కారణం. అయినా తెలియకుండా తారాబలం అంటూ జ్యోతిష్యులు కథలు అల్లితే, జనం నమ్మి మోసపోతున్నారు. నక్షత్ర రాసులంటూ పేర్లు పెట్టి మనుషుల ఛాందసాలపై స్వారి చేస్తున్నారు.
అలాగే గ్రహాల నుండి మనుషుల మీద పడే కిరణాలు, తదితరాలు లేవు. దాని చుట్టూ చాలా పురాణాలు చుట్టేశారు. చక్కగా వ్యాపారం చేస్తున్నారు. దానికి టాక్స్ లేదు. బాధ్యత లేదు.

Wednesday, September 23, 2009

జనాభా పెరిగిపోతున్నది





ఒకప్పుడు జనాభా పెరుగుదల అత్యవసర సమస్యగా పరిగనించారు. ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ 1975 ప్రాంతాలలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరెషనులు చేయిస్తే పెడ్డ రియాక్షన్ వచ్చింది .ఆ తరువాత ఎవరికి వారు ముక్యంగా రాజకీయ పార్తీలు జనాభా పెరుగుదల వూసెత్తలేదు .
మత పరంగా ముస్లింలు , కేథలిక్కులు జనాభా అదుపు కు వ్యతిరేకులు. హిందువులలో మత రాజకీయ పక్షాలు ముస్లింల బూచి చూపి ,హిందువులు తగ్గి పోతారు గనుక కుటుంబ నియంత్రణ వ్యతిరేకిస్తున్నారు.
జనాభా పెరుగుదల చుట్టూ చాలా సమస్యలు అల్లుక పోయి వున్నాయి .ఆహారం, పిల్లల పోషణ ,కాలుష్యం ,పేదరికం ,తల్లి ఆరోగ్యం ,అన్నీ ఈ సమస్యతో ముడివడి వున్నాయి.
జనంలో మతపరమైన బావాలకు వ్యతిరేకం గా పోతే వోట్లు రావని రాజకీయ పార్తీలు ,కావాలని ఈ సమస్యను దాటి వేయడం చాలా తప్పు. ప్రజలకు నచ్చ చెప్పాలి .పాఠాలలో వివరించాలి .
ఇది భవిష్యత్తును దెబ్బతీసే సమస్య .జాగ్రత్త అవసరం.

Tuesday, September 15, 2009

స్త్రీలు జాగరీకులు కావాలి


అన్ని మతాలూ అమానుషాలు.అంటే దైవం ప్రధానం అని,మనిషి తుచ్చుడని భావించాయి.అంతే కాదు. ప్రతి మతమూ స్త్రీని ద్వితీయ శ్రేణి లో చూపాయి.ఇది పవిత్ర గ్రంధాల ద్వారా పురుషులు రాసి నందున , అదే ప్రమాణం అయిపోయింది .నేటి మానవ హక్కులకు అన్ని మతాలు విరుధమే .
స్త్రీలు మతాలకు దూరం అయితే ప్రపంచం మెరుగౌతుంది .వారి సంతానం ఉత్తమ పౌరులుగా రూపొందుతారు .
ఈది చెప్పినంత సులుభం కాదు .కాని ఇలా జరగడం అవసరం. .
ప్రతి మత పవిత్ర మూల గ్రంధంలో స్త్రీల గురుంచి నీచంగా రాసిన విషపూరిత రాతలు స్త్రీలకు తెలియజేస్తూ పోవాలి.

Thursday, September 10, 2009

అబద్ధాలలో బ్రతకటం మానేద్దాం

అసత్యాలలో మునిగి తేలుతున్నాం. ఇందులో చాలా వరకూ తెలిసి చేస్తున్న విషయాలే ఉన్నాయి.

పుస్తకాలు మనుషులే రాస్తారు. ఆ విషయం ఇంచుమించు అందరికీ తెలుసు. అయితే కొన్ని పుస్తకాలు మనుషులు రాయలేదని, కానీ మనుషులకు దైవం ఇచ్చినట్లు చక్కని కథలు అల్లారు. ఇది కురాన్ కు, బైబుల్ కు, వేదాలకు ఇలా అనేక మతాలలో పవిత్ర గ్రంథాల పేరుతో అన్వయిస్తుంది. రాను రాను మన అబద్ధాలను మనమే నిజమని నమ్మి, అదే ఆరాధ్యంగా, పవిత్రంగా చూడటం మొదలు పెటడతాం. మనం రాసిన పుస్తకాలు, మనం అచ్చు వేసిన గ్రంథాలనే కళ్ళకు అద్దుకుని, ప్రత్యక్షరం నిజమని నమ్ముతాం, నమ్మిస్తాం. ఇంకా ఘోరం ఎమిటంటే పిల్లలకు ఈ అబద్ధాలను చిన్నప్పటి నుంచి నూరి పోస్తాం. అవి వారికి పెద్దైన తర్వాత కూడా చెరిగిపోవు.

మసీదులు, దేవాలయాలు, చర్చిలు, పగోడాలు మనుషులు కట్టేవే. వాటిలో పెట్టే విగ్రహాలు, రాతలు, చిత్రపటాలు మనుషులు అమర్చేవే. కానీ వాటిని కాలానుగుణంగా వెలసినట్లు, వాటంతట అవే వచ్చినట్లు క్షేత్ర మహిమలు ఉన్నట్లు ఉదంతాలు చెబుతాం. అదికూడా చెప్పగా చెప్పగా నిజమేమో అనిపించే భ్రమ కల్పిస్తాం. పురోహిత వర్గాలు భక్తుల్ని అలరించటానికి, ఆకట్టుకోవటానికి అనేక క్రతువులు, ఆచారాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు సృష్టించి, నమ్మించి చేయిస్తారు. భక్తులు అదంతా నిజమని నమ్మినా, అందులో నిజం లేదని తెలిసిన వారు ప్రప్రధమంగా పురోహితులే. కానీ వారి జీవనాధారానికి, మత వ్యాపారానికి అబద్ధాన్ని అలవాటుగా భక్తులకు చెప్పక తప్పదు. ఈ ప్రక్రియలో భక్తులు దాన ధర్మాలు చేయటం, కర్మ కాండలు చేయటం, నిలువు దోపిడీలు చేయటం, యాత్రలు జరపటం, మొక్కుబడుల పేరిట విపరీతంగా నగ, నట్రా మందిరాలకు, దేవాలయాలకు, మసీదులకు సమర్పించటం నిత్య కృత్యమైపోయింది. ఆ విధంగా మతాలు డబ్బు కూడగట్టుకుని, పిల్లలను మతాలకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ మతం కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని మతానికి దగ్గరగా చేర్చి మూఢనమ్మకాలు నూరిపోసి మనసులను కలుషితం చేసి దారుణమైన తప్పులు చేస్తున్నారు. కానీ అది తప్పు అని తల్లిదండ్రులు అనుకోవటం లేదు. దానికి నీతి, నియమం అనే ముసుగు కప్పారు. మతం లేకపోతే నీతి అండదు అనే అబద్ధాలను, దైవం పేరిట భయాన్ని విపరీతంగా వ్యాపింపజేశారు. దీనికి గాను సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ, ఆకర్షణీయంగా కవితలు అల్లుతూ, భాషను కూడా భ్రష్టం చేస్తున్నారు.

చదువుకున్నా అందులో నిష్ఠాతులైనా, చిన్నప్పటి నుండి వచ్చిన మూఢనమ్మకాలను మాత్రం వదిలించుకోలేక పోతున్నారు. అందుకే హేతువులు, శాస్త్రీయ పద్ధతిని మానవ సంక్షేమానికి వినియోగిస్తూనే మరోపక్కన మూఢనమ్మకాలతో కొందరు సమాజానికి హాని చేస్తూ మానవులను ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నారు.

చివరకు సైన్స్ వల్లన క్రమేణా విషయాలు తెలుసుకుంటూ అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోగలుగుతున్నాం. వైద్య రంగంలో అభ్యుదయాన్ని సాధిస్తున్నాం. ప్రార్థనలతో రోగాలు నయం కావని, వర్షాలు రావని తెలుసుకుంటుంన్నాం. ప్రకృతి భీభత్సాలకు కారణాలు వేరే ఉన్నాయని గ్రహిస్తున్నాం. కానీ వీటిలో కూడా జ్యోతిష్యులు, దొంగ వ్యాపారానికి వెనుకాడటం లేదు.

మతం మానవాళికి చేసిన, చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. దాని పేరిట జరిగిన హింస అనూహ్యమైనది. మతం వల్లన మానవాళికి ఉపయోగ పడని అంశం లేదు. కానీ మనుషుల్ని చీలదీసి, కులాలు సృష్టించి అంటరాని తనాన్ని పెంచి పోషించి అమానుషంగా ప్రవర్తించారు. అందుకే అలాంటి దారుణాలను నీతి పేరిట అమలు పరచిన ధర్మశాస్త్రాలను దగ్ధం చేయమని కీ.శే. అంబేద్కర్ నినదించారు. మానవాళికి భవిష్యత్తు వైజ్ఞానిక దృక్పధంలోనే ఉన్నది. అందులో తప్పులు దిద్దుకుంటూ పోయే లక్షణం ఉండటం గొప్ప విశేషం.

Sunday, September 6, 2009

రాజశేఖరరెడ్డి- జ్యొతిష్యం

మేము ముందే చెప్పాము అంటూ ప్రగల్భాలు పలుకుతూ, సునామి వంటివి అలా చెప్పగలిగాము అన్న జ్యోతిష్యులు లేకపోలేదు.
ఆంధ్ర ప్రదేష్ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశెఖరరెడ్డి సెప్తెంబర్ 2 న మరణిస్తాడని చెప్పిన జ్యోతిష్యుడు ఎవరన్నా వున్నారా?
అంత ప్రధాన విషయం ఎందుకు చెప్పలేకపోయారు ?
జ్యోతిష్యం సాంఘిక నేరం .అది గ్రహిస్తే మంచిది
శాస్త్రీయ పరిశీలనకు జ్యొతిస్యం నిలవదు.
అందుకే ఎవరైనా శాస్త్రియతను జ్యోతిస్యంలో రుజువు చెస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తానని జేంస్ రాండి బాంక్ లో ధనం పెట్టి సవాల్ చేస్తున్నాడు.www.randi.org

Thursday, September 3, 2009

త్రిపురనేని గోపిచంద్





గోపీచంద్ శత జయంతి జరుపుతున్నారు.అసలు గోపీచంద్ ను మరచిపోతున్నారు.త్రిపురనేని గోపిచంద్ 1937 నుండి రచనలు అనువాదాలు మొదలు పెట్టారు.తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం అతనిపై అప్పటికే వున్నది. దేశంలో ఎం ఎన్ రాయ్ వచ్చి అటు గాంధేయ మితవాదానికి ఇటు కమ్మ్యూ నిస్త్ అతి వాదానికి మార్గాంతరం గా పునర్ వికాసం ,శాస్త్రీయ ముగా చరిత్రను రాయడం ,పునర్ వికాసం ,నూతన రాజ్యాంగం ,వికేంద్రీకరణ ప్రచారం చేసాడు .అది గోపిచంద్ ను ఆకట్టుకున్నది .అమ్రుత బజార్ పత్రికలో రాయ్ వ్యాసాలు అనువదించి ప్రచురించాలంటే ఎవరు ముందుకు రాలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజా మిత్ర సాహసం తో వాటిని ప్రచురించింది 1937-38 లో. రాయ్ ప్రభావంతో గోపిచంద్ రాజకీయ కథలు రాసి కొత్త దారులు చూపారు .పట్టాభి సోషలిజం ,మార్కిజం అంటే ఏమిటి రాసారు .రాజకీయాలో కొత్త దారులు తొక్కాలని రాయ్ పెట్టిన రాడికల్ డెమొక్రటిక్ పార్తీకి గోపిచంద్ కార్యదర్సిగా ఉపన్యాసాలు ,శిక్షణలు ఇచ్చారు .అసమర్ధుని జీవయాత్ర రాసారు .రచనలలో వ్యంగ్యం ,వాదం ,ఆలోచన ప్రవేశపెట్టారు.తండ్రి చనిపోయిన తరువాత ,1946 లో మద్రాస్ లో సినిమా రంగం లో అడుగుపెట్టి ,మారిపోయారు .అసలు గోపీచంద్ ఆగి పోగా ,ఆధ్యాత్మిక ధోరణిలో రచనలు చేస్తూ ,వివిధ వుద్యోగాలలో వుంటూ ,52 ఏళ్ళకే చనిపోయారు .

Friday, August 28, 2009

గుణపాఠం

దేవుడి గుడిలో, చర్చ్ లో, మశీద్ లో దొంగతనం జరిగినదంటే భక్తులకు కనువిప్పు కావలసినదేమిటి?
దేవుడి నగలు కాపాడడానికి రక్షణ కావాలంటే అర్థం ఏమిటి?
ముస్లింలు లోగడ గుజరాత్ లో సోమనాథ దేవాలయంపై దాడి చేయబోయేముందు పురోహితులదగ్గరకు భక్తులు వచ్చి మొరపెట్టుకుంటే ,మన దేవుడు చాలా శక్తివంతుడు శత్రువులను తరిమి కొడతాడు అని పంపించారట .ముస్లిం దండయాత్రికులు కొల్లగొట్టుకపోయారు .
గుణపాఠం కనువిప్పు కావాలి భక్తులకు .

Thursday, August 27, 2009

నిప్పులపై నడక

జేమ్స్ రాండీ బయటపెట్టిన అనేక మ్యాజిక్ రహస్యాలలో నిప్పులపై నడక ఒకటి. ఆయన సిలోన్ లో మొదలు పెట్టి అనేక సందర్భాలలో మండే నిప్పుకణాలపై నడచి, అది మానవ సాధ్యమేనని చూపారు. ఇదే విషయంలో కొందరు సాధువులు, మాంత్రికులు, నిప్పులపై నడచి, అది ఒక అద్భుతంగా చాటి, గిట్టుబాటు వ్యాపారంగా చేసుకున్నారు. అంతేకాక దీని వెనుక మతపరమైన, దైవ పరమైన శక్తి ఉన్నదని, అమాయకులను భ్రమపెట్టారు. డబ్బు వసూలు చేశారు. అది అంతా బూటకమని, ఎవరైనా ప్రాక్టీసు చేస్తే నిప్పులపై నడక మామూలు విషయంగా చూపవచ్చునని జేమ్స్ ర్యాండీ నిరూపించాడు.
అగ్నిగుండం ఏర్పరచినప్పుడు సర్వసాధారణంగా బొగ్గులు వాడతారు, కట్టెలు కూడా పెడతారు. అలా కాల్చిన వాటిపై కాసేపటికి బూడిదపొర కమ్ముతుంది. అందువల్లన సెగ తొందరగా తగలకుండా ఆపుతుంది. నడిచినప్పుడు అరికాలికి నిప్పుకణాలకి మధ్య ఈ బూడిద పొర చాలా వరకు తొర్పడుతుంది. అంటే మండే కణాలనుండి సెగ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నడక పూర్తి కావడం జరిగిపోతుంది. అయితే అగ్నిగుండంలో ఇనుప ముక్కలు లేకుండా చూచుకోవాలి. మేకులు ఉంటే అవి కాలి తొందరగా శరీరాన్ని కాల్చేస్తాయి కనుక తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇదే హెచ్చరికను జెమ్స్ రాండీ చేశాడు.
ఉదాహరణకు కాలే పెనంపై చెయ్యి పెడితే వెంటనే సెగ అంటి అరచెయ్యి కాలుతుంది. అంతే సెగ ఉన్న అవెన్ లో చెయ్యి పెడితే కాలదు. సెగ ఒకటే అయినప్పుడు ఈ తేడా ఎందుకు వస్తుంది. అంటే సెగ అంటడంలో తేడా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
1983లో శ్రీలంకలో జెమ్స్ రాండీ నిప్పులపై నడిచి తన మ్యాజిక్ అద్భుతాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని చాలా సార్లు విడమర్చి చెప్పాడు. కొందరు నిప్పులపై నడిచినప్పుడు తాము మద్యపానం సేవించి ఆ మత్తులో నడుస్తామని చెప్పారు. కానీ మత్తుకి, శరీరం కాలటానికి సంబంధం లేదు. మత్తు లేకుండా నడచి కాళ్ళు కాలవనీ జెమ్స్ రాండీ చూపాడు.
ఈ విషయంలో ఆద్యాత్మిక కారణాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టే వారిని జెమ్స్ ర్యాండీ ఖండించాడు. నిప్పులపై నడవటం అనేది అనేక దేశాల్లో ఉన్నది. ఇది ఒక మతాచారంగా కూడా చేస్తున్నారు. జపాన్, హవాయి మొదలైన చోట్ల కూడా ఈ సంఘటనలు జరిగాయి.
కేక్ తయారు చేయటంలో చక్కని ఉదాహరణ చూపవచ్చు. వివిధ వస్థువులలోకి వేడి ఎలా ప్రసురిస్తుందో ఇదొక చక్కని ఉదాహహగరణ. నాలుగు వందల డిగ్రీల వేడిలో కేక్ అవెన్ లో బేక్ అవుతుంది. అక్కడ చెయ్యి పెట్టినా కాలదు. అలాగే అంత వేడిలో బేక్ అయిన కేక్ పై చెయ్యి పెట్టినా కాలదు. అంతే వేడిగల పెనంపై చెయ్యి పెడితే కాలిపోతుంది. దీనిని బట్టి ఒకే వేడిదగ్గర వివిధ వస్తువులు వివిధ రీతులలో వేడిని ప్రసరింపచేస్తాయని అర్థమౌతుంది.
ఈ విధంగా వైజ్ఞానిక దృక్పధంతో ప్రతీ అద్భుతాన్ని, మ్యాజిక్ అంశాన్నీ వివరించవచ్చునని, జేమ్స్ రాండి అంటాడు. అలాగే అనేక ఆశ్చర్యకరమైన విషయాలను విడమరచి శాస్రీయ దోరణిలో చెప్పాడు, రాశాడు. అందుకే అతడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. బూటకంతో జనాన్ని మోసం చేసి మభ్యపెట్టే వారిని బట్టబయలు చేశాడు. వైద్య, ఆరోగ్య రంగాల్లో, జ్యోతిష్యంలో, అతీంద్రియ శక్తులలో ఇలాగే చేసి చూపాడు.

Sunday, August 23, 2009

దేవుడి గుడిలో దొంగతనం

తిరుపతి కోదండరామ ఆలయంలో పూజారి నగలను తాకట్టు పెట్టి, పట్టుబడ్డాడు.
నగలు మనుషులే సమర్పిస్తారు.ఆలయం మానవులే కడతారు.విగ్రహం మనుషులే చెక్కుతారు .కనుక దొంగతనం జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి .
మహత్తులు మహిమలు కూడా మనుషులు కనిపెట్టిన కథలు గాథలు అని తెలుసుకోవాలి. కనుక తిరుపతి దేవుడికి దొంగతనాలు ఆపే శక్తి వుండదు .ఇది అన్ని మతాలకు అన్ని దేశాలకు . క్రైస్తవులకు ,ముస్లింలకు ,వర్తిస్తుంది.
మల్లది రామమూర్తి ఒక సారి చెబుతూ ,పూజారికి దేవుడి మహత్తు గుట్టు బాగా తెలుసు అన్నారు .కాని భక్తులతో మత వ్యాపారం చేయాలంటే పూజారి నటించాలి మరి.
సామాజికంగా మనం వెనక్కు పోతున్నాము .మన శక్తిపై మనకు కుదురు లేక ఎవరో వచ్చి ఆదుకోవాలనుకోవడమే భక్తి వెర్రి తలలు వేయడానికి దారితీస్తున్నది .జనానికి నిజం చెప్పాలి.రాజకీయ పార్తీలు ఇంకా జనాన్ని వెనక్కు నడిపిస్తున్నాయి .

Friday, August 21, 2009

పూర్వ జన్మలు – పునర్జన్మలు ఉంటాయా?

అప్పుడప్పుడు కొందరు చిన్న పిల్లలు బయలుదేరి తాము పూర్వజన్మలో ఎలా ఉండేవారమో, వచ్చే జన్మలో ఎలా ఉండబోతున్నామో చెబుతారు. అది ఒక వింతగా, ఆశ్చర్యంగా వ్యాపిస్తుంది. జనం తండోపతండాలుగా రావటం, మొక్కడం, కానుకలు సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇలాంటివి ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో తరచు జరగడటం గమనిస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు అందరూ పునర్జన్మలు నమ్మరు. అలాగే ముస్లిములు కూడా. సైంటాలజీ అనే క్రైస్తవ శాఖ ఈ జన్మల గురించి నమ్మి, జనాన్ని మభ్య పెడుతున్నారు. భౌద్ధుల్లో కొందరు జన్మలు నమ్ముతారు.
మనుషులకు, పూర్వజన్మలు, పునర్జన్మలు నిజంగా ఉంటాయా? మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని తగలబెట్టడం, పూడ్చటం, ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతున్న నేపధ్యంలో, జన్మ ఎత్తేది ఏమిటి? ఇందుకు గాను మతస్తులు లోగడే ఒక పథకం ప్రకారం మనిషిలో ఆత్మ ఉంటుందని అన్నారు. అంటే ఏమిటి? అది పదార్ధం కాదు, దానిని చూడటానికి, పట్టుకోవటానికి, వీలు లేదు. కనుక అది మత, ఆద్యాత్మిక, నమ్మకంలో ఒక భాగంగా, సృష్టి అయిన విషయం. దైవం ఎలాగో, ఆత్మ కూడా అలాగే మానవుల సృష్టి. దీని చుట్టూ, పునర్జనమ్మను, పూర్వజన్మను అల్లారు. హిందువుల నమ్మకాలలో జన్మలు అనేకం. క్రిమికీటకాదుల నుండి జంతువుల మొదలు, మనుషుల వరకూ ఈ జన్మలు ఉన్నాయి. వీటిని తొలగించుకుని మోక్షం సాధించటం లక్ష్యం అన్నారు. అంటే జన్మలు ఎత్తటం అనేది గొప్ప విషయం కాదు. జన్మలు పోగొట్టుకుని దైవసాన్నిధ్యంలో ముక్తి పొందటమే పరమార్థం అన్నారు. దీనికి గాను పురోహిత వర్గాలు అనేక క్రతువులు, జీవన విధానాలు చెప్పారు. ఏమైనా జనంలో జన్మలపై నమ్మకం మాత్రం బాగా నాటుక పోయింది.
ఇటీవల భౌద్ధ శాఖలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దలైలామా ఈ జన్మలను గురించి మాట్లాడటంతో దీనికి మళ్ళీ ప్రచారం లభించింది. చిన్న పిల్లలు తాము పూర్వజన్మలో దలైలామాతో సంబంధంగల వ్యక్తులమని, రాబోయే జన్మలో ఆయన్ను మళ్ళీ కలుసుకోబోతున్నామని జప్పటం జనాన్ని ఆకట్టుకున్నది. మన దేశంలో లోగడ ఇలాంటివి తరచు జరిగాయి. పూర్వకాలం నుండి మన పురాణాలలో, ఇతిహాసాలలో పునర్జన్మల కథలు ఉండటం వల్లన జనంలో అవి స్థిరపడిపోయాయి.
వైజ్ఞానికంగా ఈ జన్మల విషయంలో ఏమైనా ఆధారాలతో ఉన్నదా అని పరిశీలన చేశారు. కొందరు శాస్త్రజ్ఞులు సీరియస్ గా కొన్ని కేసులు పరిశీలించి శాస్త్రీయ ఆధారాల కోసం అన్వేషించారు. అలా చేసిన వారిలో ఇయాన్ స్టీవెన్ సన్ పేర్కొన దగినవాడు. అయితే ఆయన గాని, ఇతరులు గాని చేసిన పరిశోధనలు ఏవీ కూడా ఇంతవరకు శాస్త్రీయ ఆధారాలు చూపలేక పోయాయి. జె.ఎమ్.ఇ. మక్ టగార్డ్, సి.జె. డుకాసే పాశ్చాత్య ప్రపంచంలో పునర్జన్మల పరిశీలన చాలా దీర్ఘంగా చేశారు. సి.జి. యుంగ్ తన పరిశీలనలో పునర్జన్మలకు అనుకూలత చూపాడు. కానీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇవ్వలేక పోయాడు. ఈ కోవలో పాల్, టిలక్, స్ట్రనిస్ లోవ్, టిమోతీ లోరే వంటివారు ఎలాగైనా పునర్జన్మలను రుజువు చేయాలని ప్రయాసపడి విఫలమయ్యారు. టిబెట్ లో ఈ పునర్జన్మల కథలు, రచనలు ఉన్నాయి. అవికూడా చాలా వదంతులకు దారి తీశాయి. టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ అనే పుస్తకం ఇలాంటి పునర్జన్మల కథలను నమ్మించటానికి చాలా ప్రాధాన్యత వహించింది. అయితే అదంతా మూఢనమ్మకాలు తప్ప ఆధారాలు లేవని తేలింది. మద్రాసులో ఉన్న సి.టి.కే. చారి ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి, భారతదేశం వంటి చోట చిన్న పిల్లలకే ఇలాంటి కథలు వినిపించటం వల్లన, వారిలో నమ్మకాలు నాటుకుపోయి కొన్ని కథనాలు అల్లడం. వాటిని సమాజంలో వ్యాపింపచేయటం జరిగిందన్నారు. అంతే గాని వాటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవన్నారు.
ఆత్మలు ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టి అవుతాయా? జనాభా పెరుగుతూ పోతుంటే కొత్త ఆత్మలు కొత్తగా పుట్టిన వారిలో ప్రవేశిస్థాయా? అయితే ఎక్కడి నుండి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు నమ్మకస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎలాగూ రుజువు చేయలేరు కనుక మూఢనమ్మకాలతో మూర్క సమాధానాలు చెబుతుంటారు. చిన్న పిల్లల్లో పూర్వజన్మల గురించి వస్తున్న స్ముతులు ఆధారంగా స్ట్రీవెన్ సన్ సుధీర్ఘ పరిశోధనలు చేశారు. అయినప్పటికీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు, కొందరు స్వార్థశక్తులు పిల్లల్ని వశపరుచుకొని పూర్వజన్మల కథలు చెప్పిస్తుంటే, స్ట్రీవెన్ సన్ వాటిని పట్టించుకోలేదు. అదోక పెద్ద లోపంగా మిగిలిపోయింది. విలియం జీ. రోల్ సైతం అమెరికాలో స్ట్రీవెన్ సన్ పరిశీలనలను సుదీర్ఘంగా అధ్యయనం చేసి వాటిలో శాస్త్రీయతను చూపలేకపోయాడు

Wednesday, August 12, 2009

మూల దోషం ఎక్కడుంది?

అన్ని మతాలకు మూల గ్రంధాలు రాశారు. మతాన్ని సృష్టించినట్లే, మూల గ్రంధాలు సృష్టించారు. మనుషులు రాశారంటే విలువరాదు. కనుక తెలియని శక్తి, దైవం, రాసినట్లు అవి మానవులకు అందించినట్లు చక్కని కథ అల్లారు. కొంచెం తేడాలతో యిలాంటి కథనాలే అన్ని మతాల్లో చూపారు.
జనం దేవుణ్ణి నమ్మినట్లే, మూల గ్రంథాల్ని పరమ సత్యాలని నమ్మారు. వాటిని పూజిస్తున్నారు. పురుషులు రాశారు గనుక స్త్రీలను కించపరచి, ద్వితీయ స్థానం యిచ్చారు. అవి దైవం రాసినందుకు మానవులు మార్చడానికి వీల్లేదన్నారు. దానికై దైవాంశ సంభూతులని ముద్ర వేసుకున్న పురోహితవర్గాలు, పోప్ లు, ముల్లాలు వ్యాపారం చేస్తున్నారు.
వీటిపై నమ్మకాలు పోతే మానవులు స్వేచ్ఛా పరులౌతారు. స్త్రీలకు సమానత్వం వస్తుంది. మానవ విలువలు అమలు జరుగుతాయి. దీనంతటికీ మతం పట్ల మూల గ్రంధాల పట్ల నమ్మకాలు పోగొట్టుకోవడం చాలా అవసరం.

Thursday, August 6, 2009

హేతువాదం అంటే

హేతువాదం
ప్రతిదీ కార్య కారణ సంబధాలతో చూస్తూ తెలుసు కొనడం హేతువాదంలో ప్రధానం. తెలియనిది ఎంతో వున్నదని క్రమెణా తెలుసుకుంటూ సాగిపోవడం ప్రక్రియ. తెలియని అంశంపై నమ్మకాలు అపోహలు వుంచకుండా నిదానించి సాస్త్రీయ ధోరణి పాటించడము జరుగుతుంది.
పూర్వకాలం ఒక పుస్తకం లో వున్న అంశం ,లేక పెద్దవారు చెప్పారనో అదే ప్రమ సత్యం అని హేతువాదం అనదు. రుజువు ,అధారం ముఖ్యం .ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా అదె ప్రమాణం అవుతుంది.
అలా జరుగుతున్నప్పుదు ,కొన్ని నమ్మకాలకు, మూఢ ఆచారాలకు వ్యతిరెకంగా వుంటే ,వాటిని పాటించేవారికి కోపం రావడం సహజం.
ఆగ్రహం ,ఆవెశం వచినప్పుడు తొందరపడకుండా ,వివేచన జోడిస్తే బాగావుంటుంది.వ్యక్తిగత దూషణలు ఆలోచన పెంచవు .
శాస్త్రీయంగా చేసిన హెతుబద్ద తీరు మానవులకు మేలు చేస్తున్నది .
ఒక రంగంలో శాస్త్రియంగా ఆలోచిస్తూ ,వుద్యోగం చేస్తూ ,మిగిలిన రంగాలలో ఆలోచన చేయనందువలనే , చిన్నప్పటి నమ్మకాలనుండి బయతపడలేక పోతున్నాము .

Monday, August 3, 2009

మానవవాదం ఎందుకు?


Left to right:M/s C.Narasimha rao, T.V.Rao and Innaiah addressing the gathering. Photo:cbrao



Left to right: M/s Anant, Gandhi and Mrs Chandana Chakrabarthi
Photo:cbrao


ఆగస్ట్ 2 వ తేది హైదరాబాదులో జరిగిన Indian Radical Humanist Association సభలో, డాలస్ (టెక్సాస్) నుంచి వచ్చిన, తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారి తెలుగు సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల నిర్వాహకులు అనంత్ మల్లవరపు ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందిన అమెరికా లో కూడా మత మౌఢ్యం, కుల మౌఢ్యం బహిరంగ చర్చకు వస్తున్నాయని అన్నారు. మానవ , హేతు వాద విషయాలలో తాను ఇన్నయ్యగారి అభిమాని అని, డాలస్ లో ఇన్నయ్య గారు హేతుబద్ధత, శాస్త్రీయ ద్రృక్పధాలపై ప్రసంగించారని సభకు తెలియ చేశారు. చూడండి http://naprapamcham.blogspot.com/2009/04/blog-post_21.html

బాబాలు, అమ్మలు అమెరికా వచ్చి పాదపూజ వగైరాలను ప్రోత్సహిస్తూ నిధుల సేకరణ చేస్తున్నారన్నారు. మొదట తెలుగు భాషా ప్రాతిపదికపై కలిసిన వారు, కులం పేరిట, ప్రాంతాల పేరిట అమెరికా లోని తెలుగు వారు విడిపోవటం బాధ కలిగిస్తుందన్నారు. హైదారాబాదు నగరంలో ప్రధాన వీధులలో కూడా మతపరమైన కట్టడాలు వెలుస్తున్నాయని, ఇవి వాహన రాక పోకలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని విచారం వ్యక్తం చెశారు.

-cbr


Audience & electronic media at the meeting Photo:Ramabrahmam of Jana Vignana Vedika

హేతువాదం ఎందుకు?


Photo courtesy: Ramabrahmam of Jana Vignana Vedika

చిత్రంలో ఎడమనుంచి కుడి వైపుకు: శ్రీయుతులు గాంధీ, శ్రీమతి చందనా చక్రవర్తి, సి.నరసింహా రావు, టి.వి.రావు ఇంకా ప్రారంభోపన్యాసం చేస్తున్న ఇన్నయ్య.

పుస్తక రూపంలో వందేళ్ల రాజకీయ చరిత్ర
భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం
న్యూస్‌టుడే, హైదరాబాద్‌: త్వరలో 'వందేళ్ల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర' అనే పుస్తకాన్ని ప్రజల ముంగిటకు తీసుకురానున్నట్లు భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం పేర్కొంది. ఈ గ్రంథంలో చరిత్రను, నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా విశ్లేషించినట్లు సంఘ సభ్యులు వివరించారు. సామాజిక వేత్తలకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘ సమావేశం నిర్వహించారు. సంఘం కోఆర్డినేటర్‌ ఎన్నికైన ప్రముఖ రచయిత, మానవతావాది నరిశెట్టి ఇన్నయ్య, జనవిజ్ఞాన వేదిక సభ్యులు టి.వి.రావు, మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు, భారత హేతవాద సంస్థ సభ్యులు వీరన్నతో సామాజిక విశ్లేషకులు నరసింహారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సామాజిక వేత్త చందన చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లోని అవినీతి, పక్షపాత ధోరణి, కుల మత మౌఢ్యాలతోపాటు సమాజంలో వేళ్లూనుకుంటున్న మూఢ, అంధవిశ్వాసాలపై రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సొసైటీ పోరాడుతుందన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మానవతావాద విలువలను సమాజానికి చాటిచెప్పడానికి తమ రచనలు, వ్యాసాలు, కళలు ద్వారా పెద్ద పీట వేసిన ఎం.ఎన్‌.రాయ్‌, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, మల్లాది రామ్మూర్తి, మల్లాది సుబ్బమ్మ, పాలగుమ్మి పద్మరాజు, త్రిపురనేని గోపిచంద్‌, జి.వి.కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రాంబ్రహ్మం తదితర మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చందన చక్రవర్తి మాట్లాడుతూ బాధ్యతగల స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం మూఢ విశ్వాసాలకు పెద్దపీడ వేయడం ఆందోళన కలిగిస్తున్న పరిణామన్నారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైనప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. భావసారూప్యత ఉన్న సంఘాలన్నీ కలిసి పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని సూచించారు. పాఠ్యగ్రంథాల్లో సైతం మూఢ విశ్వాసాలు కల్పించేలా పాఠాలు పొందుపరచడం దారుణమని సామాజిక విశ్లేషకులు నరసింహరావు తప్పుపట్టారు. మేథావులు సైతం బాబాలకు పాదపూజ చేయడం దుర్మార్గమైన చర్య అని హేతువాద సంఘ సంఘ ప్రతినిధి అనంత్‌ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు సూచించారు. సామాజిక వేత్త గాంధీ మాట్లాడుతూ సమాజంలో తాత్విక చింతన, హేతువాద దృష్టి, భావవికాసం, మానవతావాదం పెంపొందడానికి అన్ని సంఘాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

Text courtesy: ఈనాడు దినపత్రిక 3rd August 2009

Friday, July 31, 2009

Children should be free from religion

Review of Innaiah Narisetti’s Forced into Faith.
How Religion Abuses Children’s Rights?
Prometheus Books, Amherst, NY, 2009, 126 pgs.

‘Children should be brought up without allowing religion to influence them. […] Children should not inherit religion. […] Superstitions should not be taught under any circumstances.’ These quotes summarize the essence of Innaiah Narisetti’s appeal to free children from the bondage of religion imposed by parents and the social community. Imposing religion upon children is child abuse. In his succinct book Narisetti cuts to the heart of a much-neglected problem: the education and upbringing of children. For liberals this is considered mostly to be a private matter and therefore not a topic for moral concern. But this is a grave mistake. Liberalism (and humanism) should take the individual as its core value. No individual has the right to limit the freedom of other individuals. Children are not the property of their parents. Parents have no right to force their children into their faith. Education, and upbringing, should be free from religion. Education can be secular by facilitating compulsory public education (political secularism); upbringing should be secular as well, but the state is limited to enforce this (moral secularism). There should be a widespread consensus that it is immoral to speak of religious children, just as it is immoral to speak of a child as belonging to a political party of ideology. Narisetti highlights evils done in name of religion by examples taken from Christianity, Islam, Judaism, Hinduism and Buddhism. The documentary Jesus Camp also comes to my mind. This documentary is about a summer camp in the US that brainwashes children by instilling a frightful fear of god and Satan using obnoxious propaganda methods. Narisetti’s moral beacon is the Charter of Rights of Children (1989), which is added in total to the text. On paper the rights of children seem to be well protected, but alas, as with so many things, there is a seemingly unbridgeable gap between promises and reality. What is needed is a cultural gestalt switch about children: children are not property, but individuals who have rights, like the right to good (science based) education that includes education about human rights and the equality of women and men, heterosexuals and homosexuals. Religion is a big obstacle for securing the rights of children worldwide. Laws that protect religion, like the First Amendment in the US (especially the Free Exercise Clause: ‘Congress shall make no law respecting an establishment of religion, or prohibiting the free exercise thereof’), are used as an escape for those who violate human and children’s rights claiming that it is their religion. Religion should not be a hide out for injustices and evil. Narisetti doesn’t say it out loud, but it seems that religion should have the status of a personal opinion and a hobby, and not a privileged status that can be used to subject women and children. We all should be much more careful to protect the rights of children and not be put off by the smokescreen of religion. Narisetti remarks drily: ‘We cannot expect religions to condemn themselves. It is like handling our house keys to a thief with a request to stand guard.’ To remain silent about the injustices done to children in the name of religion is immoral.

Floris van den Berg is a philosopher and Co-Executive Director of Center for Inquiry Low Countries. florisvandenberg@dds.nl.

Thursday, July 30, 2009

బలవంతపు దైవ నమ్మిక



Forced into Faith -Innaiah Narisetti

Published in 2009 by Prometheus books, New York 126 Pages

Available at amazon.com

యుక్త వయసు తీరేదాకా పిల్లలకు వోటు హక్కు లేదు. ఒక వయస్సు వచ్చేదాకా వివాహానికి, అప్పు తీసుకోవటానికి పిల్లలు అనర్హులు. ఆలొచన, జీవన విధానాన్ని గతి తిప్పే మతం గురించిన ఆలోచనలు పిల్లలకు మనము ఏ వయస్సులో చెప్పాలి?

దేవుని అస్తిత్వం విషయంలో ఆస్తికులు నాస్తికులు ఎక్కడ విభేదిస్తున్నారు?

అబ్దుల్ కలాం పదవిలో ఉన్న సమయంలో సత్య శాయిబాబా కాళ్లకు మొక్కటం - భారతదేశ ప్రధమ పౌరుడు ఇలా చేయటం సరైనదేనా?

హేతువాది తప్పనిసరిగా నాస్తికుడు కావాలా?

ఇన్నయ్య గారి తో మనోజ్ మిట్టా ముఖాముఖి Times of India లో చూడండి.

http://timesofindia.indiatimes.com/Parents-impose-their-belief-system-on-children/articleshow/4831175.cms

Wednesday, July 29, 2009

ఇండియన్‌ రాడికల్‌ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య



ఇండియన్‌ రాడికల్‌ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య
(న్యూస్‌టుడే-హైదరాబాద్‌)
ఇండియన్‌ రాడికల్‌ హ్యూమనిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నరిశెట్టి ఇన్నయ్య ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీలోని గాంధీ పీస్‌ పౌండేషన్‌ సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఛైర్మన్‌గా వినోద్‌జైన్‌, ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్యలను ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈ పదవులను గతంలో జస్టిస్‌ వి.ఎం.తార్కుండే, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, ఎం.వి.రామ్మూర్తి తదితర తెలుగు ప్రముఖులు నిర్వహించారు.

Tuesday, July 28, 2009

క్రైస్తవులు ఇలా ప్రవర్తిస్తున్నారు!

బైబుల్లో కొత్త నిబంధనలను, పాత బైబుల్ నమ్మె యూదులు ఒప్పుకోరు. ఈ కొత్త నాలుగు సువార్తలకు రచయితలు మాత్యు, మార్క్, లూక్, జాన్ వీరంతా జీసెస్ తరువాత 70 నుండి 100 సంవత్సరాలలోపు రచనలు చేశారు. వీటిలో ముగ్గురికి దగ్గర పోలికలున్నా, జాన్ సువార్త తేడాగా ఉంటుంది. క్రీస్తు బాల్యంపై చరిత్రలో ఆధారాలు లేవు. జీసెస్ పేరిట రాసిన అద్భుతాలు అన్ని కథలే. మార్క్ సూవార్తలో క్రీస్తును శిలువ వేయడం వివరంగా రాయగా, మిగిలినవారు ఆయనను అనుకరించారు. ఇక జీసెస్ చనిపోయి, భూస్థాపితమైన తరువాత తిరిగి లేచి రావటం పెద్ద కథ. క్రీస్తును చివరిదశలో అనుసరించిన మగ్ధలీనా పిచ్చిదని, పూనకం, భ్రమకు ఆమెకు ఉన్నాయని మార్క్ అన్నాడు. కేవలం మాత్యూ మాత్రమే తూర్పు దిశనుండి వివేకులు కాస్పర్, మెకైర్, బాల్తసార్ ప్రస్థావన తెచ్చాడు.
బైబుల్లో పరస్పర విరుద్ధాలు 500 వరకు ఉన్నాయని చరిత్రకారులు జాబితా వేసి చూపారు. మొత్తం మీద క్రీస్తు జీవితం గురించి సమకాలీన చరిత్ర ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అయినా భక్తులు నమ్మి అనుసరించటంసరేసరి. క్రీస్తు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయనకు సంబంధించిన వస్తువులు, సమాధిలో అవశేషాలు, ఆయన శవానికి కప్పిన వస్త్రం, శిలువ వేసినప్పుడు కారిన రక్తం, అది పట్టడానికి వాడిన పాత్ర ఇలాంటివన్నీ లభించినట్లు ఇప్పుడు అనేక చోట్ల పదర్శిస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజం అంటే ఏ ఒక్క ఆధారమూ రుజూవుకు నిలబడటం లేదు. చివరకు మేరీ జుట్టు, మర్దలీనా శరీర అవశేషాలు, పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. ఆశ్చర్యమేమంటే క్రీస్తు చనిపోయిన తరువాత ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు యూరప్ లో వివిధ ప్రాంతాల్లో బయటపడ్డట్లు, వ్యూహాత్మకంగా చూపటం పేర్కొనదగింది.
జో నికిల్ ఇలాంటివన్నీ ఎంత బూటకాలో పరిశోధించి భయటపెట్టాడు. చివరకు జీసెస్ క్రైస్ట్ రూపం సైతం వ్యూహా జనితాలని, అతని సమకాలీనులెవరు ఆయన్ను రూపాన్ని వర్నించలేదని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు రాసిన నలుగురు ఆయన్ని గురించి వర్నించలేదు.
క్రీస్తుకి గడ్డం, జుట్టు మొదలైనవన్నీ ఉత్తరోత్తర గీసిన చిత్రాలే.

Friday, July 24, 2009

మూఢనమ్మకాలపై స్వారీ చేస్తున్న క్రైస్తవ అధిపతులు

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్రైస్తవ మతస్తులున్నారు. వీరిలో వివిధ శాఖలున్నాయి తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ పోతున్నారు. ఇందులో కేతలిక్ అధిపతి పోపు నుండి వివిధ శాఖల మఠాధిపతులు, తమ శక్తి యుక్తులను వినియోగించి జనంలోని నమ్మకాలు పోకుండా కాపాడుకుంటున్నారు. నిజం చెప్పటం వారికి హానికరం కనుక అబద్దాలకు తేనే పూసి జాగ్రత్తగా అద్భుతాల పేరిట కట్టుదిట్టంగా మత వ్యాపారం చేస్తున్నారు.
ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు శాస్త్రీయ పరిశీలనా కేంద్రానికి సంబంధించిన మజీషియన్ జో నికిల్ తన పరిశోధనలు, పరిశీలనలు నాతో చెప్పాడు. ఎన్నో ఆశక్తికర వాస్తవాలు వెల్లడించాడు. ఆయన రచనలు కంటకీ యూనివర్సిటీవారు ప్రచురించారు కూడా.
రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినట్లు చెప్పబడుతున్న క్రీసు అవశేషాలు దొరికినట్లు వాటిని స్వేకరించి వివిధ ప్రాంతాల్లో వివిధ దేవాలయాల్లో అట్టిపెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. వీటిని సందేహించి ప్రశ్నించినవారిని దగ్గరకు రానివ్వటం లేదు. అలా రానిచ్చిన చోట అవి బోగస్ అని తేలిపోయింది. అందువల్లన జాగ్రత్త వహిస్తున్నారు. ఇలా స్వేకరించిన వాటిలో క్రీస్తునుండి కారిన రక్తం కూడా పాత్రలో పెట్టి పూజిస్తున్నారు. అది ఇప్పటికీ ఇంకా ఎర్రగానే ఉన్నట్లు ప్రదర్శించటం పరాకాష్ట. రక్తం కాసేపటికే రంగు మారి ఊదాగా ఉండి తరువాత నల్లగా అయిపోతుంది. కానీ వీరి పదర్శనలో మాత్రం అది ఇంకా ఎర్రగానే ఉండటం విశేషం. ఇలాంటి అనేక విచిత్ర పద్ధతులు ఈ క్రైస్తవులు చేపట్టి యాత్రా స్థలాలుగా మార్చి భక్తులను ఆకట్టుకుని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవన్నీ వివరంగా స్వేకరించి, వివిధ ప్రాంతాలకు పర్యటించి వాటిని శాస్త్రీయంగా పరిశీలించి జో నికిల్ విషయాలను బయటపెట్టాడు. అవి క్రమంగా వెల్లడిస్తూ పోతాం. క్రీస్తు అవశేషాలే కాక మేరీ మాత, మగ్ధలేనా అవశేషాలు కూడా ఉన్నట్లు చూపుతున్నారు.

Tuesday, July 21, 2009

అసత్యాల పునాదిపై జ్యోతిష్య సౌధం

జ్యోతిష్యఫలాలు పత్రికలో టి.వి.లలో వస్తున్నప్పుడు అవి శాస్త్రీయం కాదని, కేవలం వినోదం మాత్రమేనని ప్రకటించమన్నాం. ఆ మేరకు అమెరికా, యూరోప్, ఇండియాలలో గత 30 ఏళ్లుగా లేఖలు రాస్తున్నాం. విజ్ఞప్తులు చేస్తున్నాం. అమెరికా, యూరోప్ లలో కొన్ని పత్రికలు అంగీకరించి, అలా ప్రకటించాయి. కాని వ్యాపార దృష్టి ప్రధానంగా గలవారు వేయలేకపోవడం, కచ్చితంగా తప్పు. దానిపై పోరాటం చేస్తూనే వున్నాం.

జ్యోతిష్యం రుజువుచేస్తే 5 కోట్లు యిస్తామని ప్రకటించిన జేమ్స్ రాండి మా మానవవాదే. చిర్రుబుర్రులాడే వారెవరూ సాహసించి ముందుకు రాలేదు.

జ్యోతిష్యంలో మూలమైన రాసులు ఊహారూపాలు. ఆకాశంలో నక్షత్ర సముదాయాన్ని పూర్వం చూచి వాటికి పేర్లు పెట్టారు. తుల, కన్య, వృశ్చికం అలా ప్రచారంలోకి వచ్చాయి. అవి నిజంగా లేవు. లేని రాసుల ఆధారంగా రాసి చక్రాలు, జన్మ నక్షత్రాలు అంటూంటే, అవి లేవు, నమ్మెద్దు అంటున్నాం.

నక్షత్రాలు చాలా దూరాన వున్నాయి. వాటిని గురించి జ్యోతిష్యానికి ఏమీ తెలియదు. కాని తెలిసినట్లే రాసేసి, నమ్మించారు. అదొక భ్రమపూరిత వాస్తవంగా నమ్మకస్తులలోనిలిచింది. జ్యోతిష్యంలో తారాబలం యావత్తు అశాస్త్రీయం. ఆధారాలులేనిది, నమ్మరానిది అంటున్నాం.

తారా బలం నుండి చంద్రబలానికి వస్తే, మరీ దారుణం. నక్షత్రానికీ, గ్రహానికీ తేడా తెలియదని స్పష్టపడింది. సూర్యుడిని గ్రహం అన్నారు. చంద్రుడిని గ్రహం అన్నారు. రాహువు, కేతువు కథలు తప్ప వాస్తవ ఉనికిలో లేవు. అయినా వాటిని చేర్చారు.

గ్రహాల ప్రభావం మానవులపై వుందనుకుందాం. కొత్తగా నెప్ట్యూన్, యూరేనస్ కనుగొన్నారు. అవి భారత జ్యోతిష్యంలో లేవుగదా. వాటి ప్రభావం ఏమైనట్టు. ప్లూటో సంగతి సరేసరి. గ్రహాల నుండి మానవులపై ఏమి పడుతుంది. ఆధారాలు చూపగలదేమీ లేదు.

గణితం సరిగా వుందని, గ్రహణాలు మొదలైనవి అంచనా వేయగలుగుతున్నా మంటున్నారు. గణితం అటు సైన్స్ లోనూ, సాంకేతికంలోనూ వాడతారు. కాని వారెవరూ మానవుడిపై జోస్యం చెప్పరు.

భవిష్యత్తు తెలుసుకోవాలని మనుషులకు వున్న బలహీనతల్ని జ్యోతిష్యం బాగా వ్యాపారం చేసింది.

వైజ్ఞానిక పద్ధితలో కొత్తవి కనుగొనడం, తెలియనివి తెలుసుకోనడం, తెలిసింది అందరికీ చెప్పడం ముఖ్య లక్షణం. అలాగే తప్పులు దిద్దుకుంటూ పోవడం కూడా వుంది. జ్యోతిష్యం వంటి మూఢ నమ్మక శాస్త్రాలు పూర్వం రాసిన గ్రంధాలనే ప్రమాణంగా తీసుకుంటాయి. మార్పులు చేస్తే తమ వ్యాపారానికి దెబ్బ అనుకుంటారు.

చిరకాలంగా నమ్మిన వాటిని, ఆచరిస్తున్న వాటిని ప్రశ్నించినప్పుడు కోపం రావడం సహజం. అప్పుడు కొంచెం తమాయించుకుని ఆలోచిస్తే, ఆగ్రహావేశాలకు వివేచన జోడిస్తే ఉపయోగం.

జ్యోతిష్యం భిన్న రూపాల్లో వివిధ దేశాల్లో వున్నది. అది పూర్వకాలం నుండీ వస్తున్న నమ్మకం. అది పొరవిప్పినప్పుడు నిజానిజాలు తెలస్తే, దిద్దుకుంటే, మానవులకు మంచిది.

క్రైస్తవం, ఇస్లాం వాస్తవాలను సహించలేక, మనుషుల్ని హతమార్చాయి. భూమి గుండ్రంగా వుందంటే, సూర్యునిచుట్టూ భూమి, గ్రహాలు తిరుగుతున్నాయంటే, హతమార్చారు. జ్యోతిష్యం తప్పు అంటే తిట్టడం ఆశ్చర్యం కాదు. మార్పుకు సమయం పడుతుంది. మానవులకు తోడ్పడేది వైజ్ఞానిక పంధా. మూఢమత విశ్వాసం కాదు. జ్యోతిష్యం మూడ విశ్వాసమే.

186 మంది సైంటిస్టులు (18 మంది నోబెల్ ప్రైజ్ గ్రహీతలు) జ్యోతిషం అశాస్త్రీయమని ప్రకటించారు.