Monday, March 2, 2009

నార్ల సాహిత్య యాత్రలో ఇంత చైతన్యమా

82 ఏళ్ళ వయస్సులో సుప్రసిద్ధ రచయిత కాశీపట్నం రామారావు పాల్గొన్న నార్ల సాహిత్య యాత్ర గమనార్హం. కథానిలయం నుండి కదలి శ్రీకాకుళం సభలో పాల్గొన్న రామారావు అందరికీ స్ఫూర్తి కలిగించారు.
కీ.శే. నార్ల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన మెట్టిన కవుతరం (కృష్ణా జిల్లా) మొదట కథానిలయం. (శ్రీకాకుళంలో కాశీపట్నం రామారావు సాహిత్య వేదిక) వరకూ సాగిన సాహిత్య యాత్ర చాలామందికి కను విప్పు కలిగించింది. హిందీ అకాడమీ అధ్యక్షులు, బహుగ్రంథరచయిత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన సాహిత్య యాత్ర పార్టీలకు అతీతంగా, సమాజాన్ని స్పందింపజేసింది.
ఫిబ్రవరి 21న (2009) మొదలైన నార్ల సాహిత్య యాత్ర 24తో శ్రీకాకుళంలో ముగిసి, భవిష్యత్తు ఉద్యమానికి పిలుపు యిచ్చింది.
ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికల సంపాదకుడుగా తెలుగు సాహిత్య చరిత్రలో మలుపులు తిప్పిన నార్లకు కేవలం జోహార్లు అర్పించడానికి లక్ష్మీ ప్రసాద్ యీ యాత్రను ఉద్దేశించలేదు. నానాటికీ జనంలో చిక్కిపోతున్న తెలుగు భాషకు మళ్ళీ జీవం పోయాలని సత్సంకల్పంతో మొదలైన యాత్ర యిది. తెలుగు భాష నుడికారం, జీవ చైతన్యం తన రచనలలో ఒలికించిన నార్లను మార్గదర్శకంగా ఎన్నుకున్నారు. తెలుగు భాష బ్రతికి బట్టకట్టాలంటే నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు పాఠ్యప్రణాళికలు, పుస్తకాలు రావాలని నార్ల 1956 నుండీ సూచించారు. ఆధునిక విజ్ఞాన విస్తార రంగాన్ని యధేచ్ఛగా, ఛాందసాలు లేకుండా తెలుగులోకి తెచ్చుకోవాలన్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రభుత్వానికీ, ప్రజలకూ ఒక దిశ చూపడాని వై. లక్ష్మీ ప్రసాద్ పూనుకున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ఎటుచూచినా 1వ తరగతి నుండీ ఇంగ్లీషు బోధనా భాషగా ఆకర్షిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తున్నది. తెలుగు రాష్ట్రంలో తెలుగు తెలియకుండానే తెలుగు పిల్లలు స్కూలు విద్య పూర్తి చేస్తున్నారు. అది భవిష్యత్తులో భయానక పరిస్థితికి దారి తీసే అవకాశం వుంది. అందుకే యీ సాహిత్య చైతన్య యాత్ర తలపెట్టారు.
ముందుగా అన్ని తరగతులలో కనీసం ఒక్క సబ్జక్టే అయినా తెలుగు వుండాలన్నారు. వీలైతే 1 నుండి 5 వరకు తెలుగులోనే భోధన వుండాలన్నారు.
దీనికి యువకులు, విద్యార్థులు స్పందించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విద్యార్థులు, జర్నలిజం విద్యార్థలు యాత్రలో పాల్గొన్నారు. విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, తుని, పాయకారావుపేట, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో వూరేగింపులు, సభలు జరిగాయి.
హైకోర్టు న్యాయమూర్తులు రఘురాం, భాను ప్రసాద్ గారలు వూరేగింపులో పాల్గొని ప్రసంగించారు. మాజీ గవర్నర్, రచయిత రమాదేవి, మంత్రి మండలి బుద్ధప్రసాద్, సినారె, ఎ.బి.కె. ప్రసాద్, వెంకయ్యనాయుడు, ఎమెస్కో అధిపతి విజయకుమార్, నడుస్తున్న చరిత్ర సంపాదకులు, జర్నలిజం శాఖాధిపతి బాబీవర్థన్ ఎక్కడికక్కడ వుత్తేజాన్ని అందించారు. ప్రతి చోటా బాబీ వర్థన్ అనుచరులు అనూహ్యంగా తోడ్పడ్డారు.
సాహిత్య ప్రియుడుగా మండలి బుద్ధ ప్రసాద్ జనంలో కలిసిపోయి సాహిత్య యాత్రను ప్రోత్సహించారు. నార్ల వెంకటేశ్వరరావు పెద్ద కుమార్తె శారద యాత్ర చివరి వరకూ పాల్గొనడం విశేషం. శాసన మండలి సభ్యులు శేషారెడ్డి, రత్నకుమారి పాల్గొని చేయూత నిచ్చారు.
ఈ యాత్ర వెనుక వై. లక్ష్మీ ప్రసాద్ కు సహాయంగా అరమరికలు లేకుండా తోడ్పడిన గజల్ శ్రీనివాస్ పాత్ర గణనీయమైనది. దీనికి తోడు తన గజల్ పాటలతో అదనపు ఆకర్షణ కలిగించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు యధాశక్తి యాత్రకు ప్రేరణ కల్పించారు.
సాహిత్య యాత్రలో నార్ల రచనలు, ఆయన భావాల ప్రాచుర్యం, లభ్యమవుతున్న సంపూర్ణ సంపుటాల వివరాలు నేను అందించాను.
యాత్ర తుది సమావేశంలో తమ స్పందన వినిపించిన విద్యార్థుల గళం యిందులో పరాకాష్ఠ. ఎక్కడికక్కడ స్థానిక అధికారులు కూడా యాత్రకు తమ అండ చూపారు.
పత్రికల వారు తమ వృత్తి ధర్మంగా కాక, నార్ల రచనల ప్రేరణతోనూ, సాహిత్యం పై ప్రేమతోనూ యీ యాత్రలో పాల్గొనడం విశేషం. అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ వారే యాత్ర నిర్వహించి, క్లబ్ అనే మాటను పాత్రికేయుల కేంద్రంగా ప్రకటించడం పేర్కొనదగింది.
పరభాషను నేర్చుకుంటూ, పరభాషా ద్వేషం వదిలేసి, సొంత భాషను పెంపొందించాలని, పోషించాలని క్షీణదశకు రాకుండా చూడాలనేది యీ యాత్ర సందేశం.
శ్రీకాకుళం వరకూ ప్రతిచోటా నేను పరామర్శిస్తూ, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, సంస్థలు ఎన్ని వున్నాయి? అని అడిగాను. అందుకు జవాబుగా తెలుగు మీడియంలో ఎవరు చదువుతున్నారు? ఎన్ని బడులు సక్రమంగా నడుస్తున్నాయి? అని అడగండి సార్ అన్నారు. అదీ పరిస్థితి. ఇంగ్లీషు మీడియం సహజం అయిపోయింది. తెలుగు మీడియం విడ్డూరంగా మారింది.
దీనికి కారణం ఎవరనుకున్నారు? తెలుగు అకాడమి, తెలుగు యూనివర్సిటీ, అధికార భాషా సంఘం, సిలబస్ కమిటీలు. తెలుగులో విజ్ఞాన సాంకేతిక, బిజినెస్ పాలన, వృత్తిపరమైన సిలబస్, నిఘంటువులు, శబ్దకోశాలు, విజ్ఞాన సర్వస్వాలు, అందించకపోవడమే పెద్ద లోపం. జ్యోతిష్యం, వాస్తు వంటి మూఢ నమ్మకాల ఛాందసాలు ప్రచారంలో పెట్టారు. గ్రాంధిక భాషలో తెలుగు స్తంభించి పోతున్న దశలో, వాడుక భాష వచ్చి, ప్రజాస్వామిక రీతుల్ని ప్రవేశపెట్టింది. నేడు ఛాందసుల చేతుల్లో తెలుగు వికసించకుండా వున్నది. వైజ్ఞానిక, సాంకేతిక, న్యాయ, పాలన, వాణిజ్య, వ్యవసాయ రంగాలలో తెలుగు విస్తరించాలని ఏ స్థాయిలోనైనా, ఏ విషయాన్నైనా తెలుగులో చదువుకోగలమనే అవకాశం కల్పిస్తే, తెలుగు బట్టకట్టి, తలెత్తుకు తిరుగుతుంది.

1 comment:

Nrahamthulla said...

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు
ఏకగ్రీవ ఎన్నిక వలన లాభాలు:
1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి