Monday, May 26, 2008

సాహితి పరులతో సరసాలు 24






ధూళిపూడి ఆంజనేయులు
(1924-1998)








గోపాలచక్రవర్తి ఆయన్ను డాంజనేయులు అని చమత్కరించేవారు. తెలుగు వాడైనా, ఆంజనేయులు రచనలన్నీ ఇంగ్లీషులోనే చేశారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాకు చెందినప్పటికీ కాలేజి చదువంతా మద్రాసులోనే. ఎన్నో ఉద్యోగాలు చేసి, వూళ్ళు తిరిగినా చివరకు మద్రాసులోనే స్థిరపడ్డారు.
తెలుగు ప్రసిద్ధ రచయితల్ని బయట ప్రపంచానికి తెలియజేసిన ఆంజనేయులు చక్కని ఇంగ్లీషు రాసేవారు. అందుకే నార్ల వెంకటేశ్వరరావు వంటివారు తమ రచనల్ని ఆయనచే దిద్దించుకునేవారు.
యూరోప్ పర్యటనచేసి (Window to the West) అనే చిన్న గ్రంథం బాగా రాశారు. ఆంజనేయులుగారి భార్య ఆదిలక్ష్మి మాస్కోలో రేడియోలో పనిచేస్తూ, శాంతిశ్రీని ప్రసవించిన అనంతరం అక్కడే చనిపోయింది. టాన్యాపేరిట కొన్నేళ్ళు పెంచి, తండ్రికి అప్పగించగా ఆయన శాంతిశ్రీ అని పేరు పెట్టారు. ఆమెకు 18 ఏళ్ళు ప్రాయంనిండగానే ఆమె పేరిట బాంక్ లో వుంచిన డబ్బును తండ్రికి అప్పగించింది రష్యా ప్రభుత్వం. శాంతి శ్రీ పూనాయూనివర్శిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ గా వున్నారు.

మద్రాసులో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఆంజనేయులు కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. హిందూ పత్రికలో పనిచేశారు. మద్రాసు జర్నలిస్టు క్లబ్ అధ్యక్షులుగా వున్నారు.
Between you and me అనే శీర్షికకు హిందూలోకొన్నేళ్ళు రాశారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో అనేక వ్యాసాలు రాశారు. ఢిల్లీ నుండి విదేశీవ్యవహారాల శాఖ పక్షాన పత్రికకు సంపాదకత్వం వహించారు.
ఆంజనేయులుగారే తొలుత నన్ను దేవులపల్లి కృష్ణశాస్త్రికి పరిచయం చేశారు. తన పుస్తకాలు ముఖ్యంగా సి.ఆర్. రెడ్డి వంటివి నాకు పంపించి, నా అభిప్రాయాలు తీసుకున్నారు. అది ఆయన ఔదార్యానికి నిదర్శనం. తన పుస్తకాలలో నాకు ధన్యవాదాలు చెప్పారు కూడా.
సుప్రసిద్ధ జర్నలిస్టుల గురించి పరిశోధించి, వ్యాసాలు రాశారు. కోటం రాజు పున్నయ్య, రామారావు, సి.వై. చింతామణి, వంటివారిని గురించి మంచి పరిచయ వ్యాసాలు రాశారు.
సంగీతం, సంస్కృతం ఆంజనేయులుగారికి ప్రీతిపాత్రం. నన్ను వెంటబెట్టుకుని చక్కని పాటకచేరీలకు, సెమినార్లకు తీసుకెళ్ళారు. అవి మధురస్మృతులు.
ఆలిండియా రేడియో మద్రాసులో పనిచేస్తున్న దాశరథి కృష్ణమాచార్యను పరిచయం చేశారు.
ఆంజనేయులుగారి సన్నిహిత రాజకీయ వాదులలో బెజవాడ గోపాలరెడ్డి ఒకరు. మద్రాసులో బి.ఎస్. ఆర్. కృష్ణ, జగ్గయ్య, బాజి, ఆయన సన్నిహితులు.
ఆంజనేయులుగారికి మంచి గ్రంధాలయం వుండేది. ఎన్నో పత్రికలలో ఆయన వ్యాసాలు రాశారు. ఇంగ్లీషులో రాస్తే అనువదించి ప్రచురించేవారు.
Window to the West, Veeresalingam, C.R. Reddy, Author as artist, The art of Biography, Nehru - Nirad Choudary, Literary Criticism, Aspects of Modern Telugu Literature, Translation into English., గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి).

1 comment:

Anonymous said...

Innaiah garu,
Because of your blog I came to know about talented Andhra people names. Though I am a telugu person but I have scant regard for Andhra people because they don't recognize talent. Only they like discussing politics,films and caste related topics. May be your generation is last one after that people will be participating dance baby dance kind of programs and watching useless TV programs. Anyways I appreciate your articles, no need to say these are very informative.

Regds,