Tuesday, July 7, 2009

జ్యొతిష్యం కొత్త ఎత్తుగడలు

వ్యాపారంలో ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలు అనుసరించినట్లే జ్యొతిస్యంలో జనాన్ని దో చు కోడానికి వ్యూహాలు పన్నుతుంటారు .2009 జూలై ఆగస్ట్ లో మూడు గ్రహణాలు వస్తున్నయి కనుక పెద్ద ఉపద్రవం రానున్నదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు పుస్తకమే రాసారు .దీనిపై పత్రికలు ,టి.వి లు విపరీతంగా గాధలు ప్రచారం చేస్తున్నయి .మూడో ప్రపంచ యుద్దం రావచ్చు అనేటంతవరకు వెళ్ళారు .లోగడ అలాగె వచ్చినట్లు కథలు అల్లారు .ప్రభుత్వం చేతులు ముడుచుకొని వున్నది. అందులోనే నమ్మకస్తులు వున్నారు గనుక ఇలా జరుగుతున్నది .చట్టాన్ని ప్రయోగించి అబద్దాలు, మోసాలు క్రింద శిక్షలు అమలు పరిస్తే ,జ్యోతిష్యం పేరిట జరుగుతున్న నేరాలకు కొంత అడ్డుకట్ట పదుతుంది .

2 comments:

Satyamevajayate said...

సరే , జూలై పోయి ఆగష్టు ,వస్తుంది రోజులు సాధారణం గా గడిచిపోతాయి ..మరి ఈ జాతక చక్రవర్తులు ఆ విషయం మరచిపోయి ..కొత్త కథలు అల్లడం ..మన ప్రజలు, పత్రికు హా హా అంటూ ,,వెర్రి ఎత్తడం ,మామూలే ..నాకు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ...గురుతుకు వస్తుంది..

Praveen Mandangi said...

పల్లెటూరి వాళ్ళు చేతబడులు, దెయ్యాలని నమ్మితే పట్టణాలలో జ్యోతిష్యం, వాస్తు లాంటి వాళ్ళని నమ్ముతారు. మూఢ నమ్మకాల విషయంలో పల్లె వాసులకీ, పట్టణ వాసులకీ పెద్ద తేడా కనిపించడం లేదు.