Sunday, October 28, 2007

Agehananda తెలుగు వ్యక్తి – భారత్ దర్శనం 3

నేను చిన్న తనంలోనే ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. మధ్యలో వదిలేసినా, ఉదయశంకర్ సందర్శనం తరువాత మళ్ళీ ప్రారంభించాను. ఆయన నృత్య ప్రదర్శన సందర్భంగా వచ్చిన భారతీయులలో ఒకతేలుగు వ్యక్తి నాకు పరిచయమయ్యారు. ఆయన పేరు బాలకృష్ణశర్మ. 19వ యేటనే ఇంగ్లండు వెళ్ళి కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉండి చక్కని ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆయన అభ్యుదయవాది శాస్ర్తీయంగా, ఆసంకేతికంగా ఇండియా పాశ్చాత్య ప్రపంచంతో పాటు పురోగమించాలని ఆయన ఉద్దేశ్యం.
నాకు అప్పుడు 13 సంవత్సరాలు. బాలకృష్ణ తటపటాయించి నన్ను ఇండియా క్లబ్బుకు తీసుకువెళ్ళారు. ఈ క్లబ్బును విఠల్ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ 1933లో స్థాపించారు. ఇందులో డాక్టర్లు, విద్యార్థులు, రోగులు సభ్యులుగా వుండేవారు. నేను క్లబ్బులో సభ్యుణ్ణి అయిన తర్వాత చాలా ఉత్సాహం చూపాను. అందరిలోకి నేను చిన్నవాడిని. వారి మధ్య నేను మసలుతూ ఇండియాను గురించి, భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకున్నాను. క్లబ్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ, అక్కడికి వచ్చే భారతీయ వార్తా పత్రికలన్నీ చూసేవాడిని.
జర్మనీలో వైద్యం చదువవలసిన భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా జర్మన్ భాష నేర్చుకోవలసి వచ్చేది. దీనికోసం వేరే ట్యూషన్ కావాలంటే చాలా ఖర్చుయ్యేది. ఆ అవకాశం తీసుకొని భారతీయులకు నేను జర్మన్ భాష నేర్పేవాడిని. వారి వద్ద సంస్కృతం, హిందీ, ఉర్ధూ, బెంగాలీ నేర్చుకున్నాను. శాంతినికేతన్ విద్యార్థిని సుచిత్ర చౌదరి సంగీతం నేర్చుకోడానికి వచ్చినాకు బెంగాలీ నేర్చింది. ఆ విధంగా నేను బెంగాలీ నెర్చుకుని టాగూర్ సంప్రదాయాలను తెలుసుకున్నాను. డాక్టర్ కేసరవాణి నాకు సంస్కృతం నేర్పారు. 1937లో అక్టోబరు 2న మహాత్మాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా హోటల్ ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఉత్సవంలో నేను భగవద్గీతలో కొంత భాగం చదివాను. అది నా 14వ యేట మరునాడు వియన్నా పత్రికలు నన్ను పొగుడుతూ వ్రాశాయి.
వియన్నా విశ్వవిద్యాలయంలో సుప్రసిద్ధ ప్రొఫెసర్ ప్రావాల్ సర్ సంస్కృతం, ప్రాచీన భారతీయ విషయాలు చెప్పేవారు. ఆయన అనుమతితో క్లాసులో కూర్చొని అనేక విషయాలు నేర్చుకున్నాను.

నెహ్రూతో ఒకసారి
1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వియన్నా వచ్చారు. అప్పటికి గాంధీపేరు చాలా మందికి తెలుసుగాని, నెహ్రూ యింకా అంతగా ప్రచారంలోకి రాలేదు. ఇండియా క్లబ్ అధ్యక్షుడు నన్ను రమ్మని ఆహ్వానిస్తే హోటల్ ఫ్రాన్స్ లో 114వ గదిలో వుంటున్న నెహ్రూను చూడడానికి వెళ్ళాం. బహుశా నా గురించి అప్పటికే ఆయనకు చెప్పారేమో తెలియదు. నన్ను చూడగానే కుర్చీ చూపి కూర్చోమన్నారు. నా ఉర్దూ విని ఆశ్చర్యపోయారు. అప్పుడే వెలువడిన తన పుస్తకం చదివారా అనీ. అందులో అర్థం కానిదేమైనా వుంటే నిర్మోహమాటంగా అడగమన్నారు. ఇండియాలో మంచి పత్రికలేవని అడిగాను. దానికి సమాధానంగా ఆయన భారతీయ పత్రికలపై ఒక చిన్న వుపన్యాసమిచ్చారు.

భాయీ సచ్చిదానంద1939 ఏప్రిల్ 20న సచ్చిదానంద యూరప్ పర్యటిస్తూ వియన్నా వచ్చారు. ఉదయం 8 గంటలకు ఇండియన్ క్లబ్ కు వచ్చారు. నన్ను హిందువులలో చేర్చుకొమ్మని ఆయననడిగాను. వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారెవరైనా హిందువులు కావచ్చునని ఆయన ఉద్దేశ్యం. ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు వెన్న, గోమూత్రం, గోపంచకం అనేవి హిందువు స్వీకరించాలని, అయితే గోమాంస భక్షణ మాత్రం కూడదని భాయీ సచ్చిదానంద చెప్పారు. అక్కడే నాకు మొట్టమొదటిసారిగా రామచంద్ర అని నామకరణం చేశారు. భాయీ సచ్చిదానంద పెట్టిన పేరే చాలకాలం స్థిరపడింది. అంతటితో నేను హిందువుగా మారాను. ఈ బాల్యదశ విషయం ముగించే ముందు మరికొన్ని వివరాలు చెప్పి అంతటితో పూర్వాశ్రమానికి స్వస్తి పలుకుతాను. మా తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలోను, ఆ తరువాత విమానదశంలోనూ కెప్టెన్ గా పనిచేశారు. ఆయన పోలో ఆడేవారు. మా తల్లి బాగా చదువుకున్నది.
తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది. ఆమె నోరు మంచిది కాదు. ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు. మా న్నానకు పుస్తకాలంటే అయిష్టం. ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు. అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను. అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు. కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది. ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి, స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాని, ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు. గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను. మతపరమైన విద్య కూడ కఠినంగా నేర్పేవారు.
నా చిన్న తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే వారు. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి. నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది. భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు జీవితాన్ని ప్రారంభించాను.

తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది. ఆమె నోరు మంచిది కాదు. ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు. మా న్నానకు పుస్తకాలంటే అయిష్టం. ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు. అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను. అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు. కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది. ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి, స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాని, ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు. గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను. మతపరమైన విద్య కూడ కఠినంగా నేర్పేవారు.
నా చిన్న తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే వారు. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి. నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది. భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు జీవితాన్ని ప్రారంభించాను.

No comments: