Friday, October 26, 2007

Ochre Robe- Swami Agehananda--1

ఏభై ఏళ్ళ ప్రాయంలో స్వీయచరిత్ర వ్రాసుకోవాలని చాలామంది పెద్దవాళ్ళన్నారు. నేను 37 సంవత్సరాలకే స్వీయచరిత్ర వ్రాశాను. ఇందుకు తగినంత సమాచార సేకరణ జరిగినందున పెద్దవారి సలహా పెడచెవిన పెట్టాను. శంకరాచార్య 33 ఏళ్ళకే చనిపోయాడు. అప్పటికే ఆయన కాలినడకన దేశం నలుమూలలా తిరిగి, నాలుగు పీఠాలు స్థాపించారు. 80 పుస్తకాలు వ్రాసి బౌద్ధాన్ని విస్మరించేటట్లుగా హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. మధ్యయుగాల్లో మతజ్ఞానిగా శంకరాచార్య ఖ్యాతి స్థాపితమైంది. 8 సంవత్సరాలకే ఆయన (720 క్రీ.శ.) సన్యాసి అయ్యాడు.

నేను 80 రచనలు చేసి, మా గురువు కంటె ఎక్కువగా కాలినడకన ఒక్కసారే దేశం తిరిగాను. మఠాలు స్థాపించలేదు గాని, కొత్త పద్ధతులతో హిందూ సంప్రదాయం అట్టి పెట్టాలనుకున్నాను.
ప్రస్తుత రచన ప్రత్యక్షంగానూ, నిర్మాణాత్మకంగానూ, పరోక్షంగానూ నా అనుభవాలను ఆధారంగా జీవన విధానం వుండాలని చూపే తీరు వివరించాలనుకున్నాను. జీవన తత్వం కూడా పేర్కొనాలనుకున్నాను.
విశ్వంలో పొందికను, ప్రేమను చూడాలని చాలా మంది అనుకొంటున్నారు. తాము జీవించిన సంప్రదాయం వారికి తృప్తినివ్వడం లేదు. చుట్టూ వున్న శక్తుల్ని గమనిస్తే, వారికి భయమేస్తుంది. పరిసరాలలో చూచే దానికంటె ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. విసుగెత్తే జీవనం నుండి విముక్తిపొందాలనుకొంటున్నారు. ప్రాపంచిక అనుభవ వాదిగా, ప్రయత్నించి సాఫల్యం పాక్షికంగా సాధించినవాడిగా నేను చెప్పదలచాను.
మానవవాదాన్ని కొత్త తరహాలో పెంపొందించదలచాను. ఇందులో మానవాళి ముఖ్యం కాదు. మానవులకు విలువ యివ్వాలి. మానవాళి అనే పదం గ్రంథాలలో వుంటుంది. కాని వాస్తవంగా మానవులు వున్నారు. మానవాళి కాదు తర్కం. తత్వంలో మానవాళి అంటారే గాని, మనుషుల్ని విస్మరిస్తారు. ప్లేటో ఇలాంటి తత్వవేత్త. ఆయన ప్రభావం మధ్యకాలాల వారి పైనా, హెగెల్, మార్క్స్, హిట్లరు పైనా, ఆ తరువాత కూడా కనిపించింది. అమానుషతత్వాన్ని గురించి కార్ల్ పాపర్ వంటివారు హెచ్చరించారు.
మానవవాదం విశ్వవ్యాప్తంగా వుండాలి. మానవవాది మనుషుల్ని ప్రేమిస్తాడు. ఇతరులు తనను ప్రేమించాలనుకొంటాడు. ప్రజలకు సహాయం ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో పరస్పరం విషయాలు తెలుసుకోవాలి.
మూకగా వుండేవారి మధ్య నేను ఒంటరిగా వుండడానికి యిష్ట పడతాను. నా మానవ వాదం విశ్వవ్యాప్తమైనది. ఇందులో పరస్పర సంబంధం వుంటుంది. ఇలా ఒకరితో ఒకరు విషయాల్ని తెలియపరచు కోవడం నా మానవవాదంలో నిత్యమూ వుంటుంది. సన్యాసిగా మానవ వాదాన్ని అనుసరించిన నేను ఇలాంటి తృప్తికరమైన పద్ధతుల్ని అవలంభిస్తాను. పాశ్చాత్య లోకంలోని మానవవాద సంప్రదాయాల నుండి భారతదేశం నేర్చుకోవచ్చు. రస్సెల్, విట్టిగెన్ స్ట్రెన్, జి.ఇ.మూర్, టి.యస్ ఇలియట్ నుండి చాలా నేర్చుకోవచ్చు. పిడివాదంతో కూడిన మతం కంటె, మానవవాదం మంచిది. మానవవాద మార్మికవాదం ఇంకా శైశవ దశలోనే వుంది. మనకు మానవవాదం విశ్వజనీన జీవన విధానం కావాలి.
చాలామతాలు మానవవాదాన్ని కాదంటున్నాయి మానవుడికి ప్రథమ స్థానం యివ్వని విలువల్ని నేను అంగీకరించను. మానవవాదిగా, మార్మికుడుగా ఒకేసారి వుండడానికి యోగం, తాంత్రికం, వేదాంతం అవకాశాన్నిస్తున్నవి. విజ్ఞానాన్ని మార్మికవాదాన్ని సమాంతరంగా చూస్తున్నారు. హృదయం, మేధస్సు పరస్పరం చేతులు కలపాలంటారు. తత్వం ముగిసినచోట మతం ఆరంభమౌతుందంటారు. ప్రపంచ వ్యాప్తంగా యీ వాదనలున్నాయి. ప్రపంచ మతాలన్నీ ఒకే తీరులో ప్రవచించవు. హిందూ, బౌద్ధ మతాలు మౌలికంగా ఒకటికాదు. కాని చాలా మంది యిలాంటి వాదన చేస్తూ ఊబిలోకి దిగారు.
అధికార భేదాన్ని అంగీకరించిన భారతీయ విందనాపరులు భినన మార్గాల్ని అనుసరించడాన్ని ఒప్పకున్నారు. మానవవాదం ఒక ఆలోచనా ధోరణి, మార్మికవాదం భౌతికపరమైన ధ్యాన సంబంధమైన విషయం. మానవవాదం ఆలోచిస్తుంది. మార్మిక వాదం ధ్యానంలో నిమగ్నమౌతుంది.
మాడం బ్లావట్ స్కీ పేర్కొన్న రహస్య సిద్ధాంతాల ప్రవక్తలు టిబెట్ లో ఎక్కడా కనిపించరు. ఇది నేను స్వానుభవంతో గ్రహించాను. మూల గ్రంథాలలో కూడా యీ ప్రస్తావన లేదు. లోబ్ సాంగ్ రాంపా చెప్పింది కూడా ఇప్పుడు బట్టబయలై తప్పని తేలింది. ఆయన పేర్కొన్న మూడో కన్నులేదని అర్థమైంది. పాశ్చాత్యులు కష్టపడకుండా, ఆలోచించకుండా యిలాంటి ఆకర్షణీయ రచనల వెంటబడ్డారు..
సంస్కృతం పాశ్చాత్యలోకంలో వ్యాప్తి చెందాలి. భారతీయ మూల గ్రంథాలు వారు తెలుసుకోవాలి. వేదాంతం, బౌద్ధ, జైనాలు కూడా బాగా వారు చదవాలి. ఇలా వ్యాప్తి చెందకపోవడానికి అడ్డంకి ఏమిటి? లోబ్ సాంగ్ రాంపా వంటి వారే పెద్ద అవరోధంగా నిలిచారు. కొంచెం శ్రమిస్తే సంస్కృతం, భారతీయ తత్వం తెలుసుకోవడం కష్టం కాదు. ఇండియా గురించి వెలువడుతున్న మౌలిక గ్రంథాలు పాశ్చాత్య లోకంలో కొద్దిగానే వున్నా, సంతృప్తికరంగానే అవి వెల్లడవుతున్నాయి. కాని, ఇండియాను గురించి చౌకబారు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా వచ్చి పాడుచేస్తున్నాయి. ఇండియాను గురించి చౌకబారు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా వచ్చి పాడు చేస్తున్నాయి. ఇండియా మార్మికమనీ అభూతకల్పనలతో వెలువడుతున్న పుస్తకాలు పాశ్చాత్య లోకాన్ని వక్రమార్గాన్ని పట్టిస్తున్నాయి. ఈ పుస్తకంలో నిజం చెప్పి, అలాంటి వక్రీకరణలను దూరం చేయదలిచాను. ఇండియాను గురించి ప్రత్యేక విషయాలు ఆచార్యుడిగా చెప్పదలచాను. భారతీయులకు విదేశీయులకు ఉపకరించేరీతుల్లో విషయాలు ఆచార్యుడిగా చెప్పదలచాను. భారతీయులకు విదేశీయులకు ఉపకరించే రీతుల్లో విషయాలు చెప్పడం ఈ రచన లక్ష్యం. ఇది అందరినీ తృప్తిపరచలేదు. మత అంధకారంలో పడి హేతువాద పద్ధతికి దూరంగా జరిగానని పాశ్చాత్య మానవవాదులు అనుకోవచ్చు. కాని నా దృష్టి అంతా మానవ వాదంపైనే. అది సన్యాసి జీవనానికి విరుద్ధం కాదు. ఆలోచనల అమచివేతకు దూరంగా పిడివాదాలకు భిన్నంగా మానవవాద సన్యసత్వం కావాలని నేను కోరుకున్నాను. భారతీయ సన్యసత్వంలో సహనం లేదు. జీవితానంతరం పునర్జన్మ. అవతారాలున్నాయని నమ్మడం ఆయా వ్యక్తుల అభిరుచికి సంబంధించిన విషయం. సంపూర్ణ మానవుడుగా మారడానికి ఎలాంటి ధ్యానం అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

.

No comments: