Monday, July 23, 2007

నర హంతకులు -10

Click on photo to enlarge

Durban Sign 1989: జాతి వివక్ష
Courtesy:Wikimedia Commons

రంగుటద్దాలలో జాతి వైషమ్యం
ఆఫ్రికాలో జాతి విచక్షణ సర్వసాధారణమైపోయింది. పేరుకు దక్షిణాఫ్రికాను వేలెత్తి చూపడమేగాని, ఆచరణలో ఆఫ్రికా అంతటా యీ జాడ్యం అమలులో వున్నది.
టునీషియా, ఈజిప్టు, లిబియా, అల్జీరియా మొరాకోలో యూదులను బలవంతంగా వెళ్ళగొట్టి మిగిలిన కొద్దిమందిని అంటరానివారుగా దూరం పెట్టారు. ఇది ఎప్పుడోకాదు 20వ శతాబ్దం రెండో భాగంలో, 1950, 1960లో 10 లక్షల మంది యూదులను తరిమేశారు. టాంజనియా రిపబ్లిక్ నుండి అరబ్బులను 1960లో దేశ బహిష్కరణ చేసి, యింకా మిగిలిన వారికి సమాన హక్కులు లేకుండా చేశారు. తూర్పు మధ్య ఆఫ్రికా దేశాలలో 1970 తరువాత కూడా ఆసియావాసులను వెళ్ళగొట్టారు. 1982 ఆసియా వారిని వెళ్ళిపొమ్మని కీన్యా ఆదేశించింది. 1972లో అమీన్ నాయకత్వాన ఉగాండాలో ఆసియా వారిని తరిమేశారు. ఆఫ్రికా అంతటా ఆసియావాసులపై దాడులకు, వెళ్ళగొట్టడానికి అక్కడి పత్రికలు కూడా తోడ్పడుతున్నాయి.
ఆసియా డాక్టర్లు ఆఫ్రికాలో నల్లవారిని చంపేస్తున్నారనేటంత వరకూ ప్రచారం వున్నది. ఆదివాసుల ముఠాల మధ్య కలహాలు తరచు పరస్పరం హత్యలు చేసుకునేటంత వరకూ పోతున్నది.
దక్షిణాఫ్రికా మాత్రం కొటోచ్చినట్లుగా జాతి విచక్షణ పాటించింది. ప్రపంచ దేశాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా దక్షిణాఫ్రికా యీ రంగు భేదాన్ని ఆచరించడానికి, వారి ఆర్థిక భద్రత చాలా వరకూ తోడ్పడుతున్నది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారు తక్కువ సంఖ్యలో వుంటూ అధిక సంఖ్యాకులైన నీగ్రోలపై పెత్తనం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వారు 38 లక్షల మంది వుండగా, నీగ్రోలు 1 కోటి 50 లక్షలున్నారు. మిగిలిన వారు 36 లక్షలున్నారు. దక్షిణాఫ్రికా జాతి విచక్షణలో రాక్షసకృత్యాలకు నాయకత్వం వహించినవారు స్మట్స్, వెర్ హార్డ్, బోతా 1911లోనే నల్లవారి సమ్మెలు చట్టవిరుద్దమని పేర్కొంటూ, కొన్ని రకాల ఉద్యోగాలు తెల్లవారికి మాత్రమే పరిమితం చేశారు. అంతేగాక తెల్లవారు, నల్లవారు వుండే ప్రాంతాలను పేర్కొంటూ 1913లో చట్టం చేశారు. ఆ తరువాత తరచు చేస్తూపోయిన చట్టాలన్నీ జాతి విచక్షణను పాటించినవే జీతాలలో ఉద్యోగాలలో, వివాహాలలో యీ విచక్షణ చూపారు.
స్మట్స్ ఆధ్వర్వాన 1921లో మూకుమ్మడి హత్యాకాండ ఆరంభమైంది. ఆఫ్రికాలోని ఇజ్రాయిల్ తెగను తెగనరికించాడు. 1922లో నీగ్రో తిరుగుబాటు దార్లలో 700 మందిని రాండ్లో చంపేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా స్మట్స్ తన దహనకొండను ఉధృతం చేశాడు. భారతీయులు తెల్లవారి నివాస ప్రాంతాలకు రాకూడదన్నారు. ప్రత్యేక ప్రాతినిధ్యపు చట్టం తెచ్చారు 1951లో.
తెల్లవారికీ, నల్లవారికి మధ్య వెళ్ళిళ్లు నిషేధిస్తూ 1949లో చట్టం చేశారు. షాపులు, నివాసాలు ఎవరికి వారే వుండేటట్లు వేరుపరచారు. దీనికి గాను అనేక చోట్ల బుల్ డోజర్లు పెట్టి ఇళ్లను, షాపులను నేల మట్టం చేశారు. 1950లో కమ్యూనిజం అణచివేత చట్టం తెచ్చారు.
1950లో వెర్ వోర్డ్ దేశీయ వ్యవహారాల మంత్రిగా రావడంతో హింసాకాండ యింకా హెచ్చు పెరిగి పోయింది. 1958లో యితడు దక్షిణాఫ్రికా ప్రథాని అయ్యాడు. ఈయన విద్యారంగంలో జాతి విచక్షణ ప్రవేశపెట్టి పాఠ్య ప్రణాళికను, స్కూళ్ళను వేరు పరచాడు సంస్కృతి ఆటలు, దేవాలయాలతో సహా అన్ని రంగాలకూ విచక్షణను వెర్ వోర్డ్ విస్తరించాడు. 1959 నాటికి ఈ కార్యక్రమం పూర్తి అయింది. 1960లో 69 నీగ్రోలను కాల్చి చంపారు. ఎప్పటికప్పుడు జాతి విచక్షణను సమర్ధించుకుంటున్న దక్షిణాఫ్రికా కామన్వెల్త్ నుండి వైదొలగింది.
1973లో సైతం 44885 నీగ్రో కుటుంబాలను, బలవంతంగా తెల్లవారి ప్రాంతాల నుండి తొలగించారు. 1513 తెల్లవారి కుటుంబాలను నీగ్రోలకు దూరం చేశారు. ప్రపంచమంతా నిరసిస్తున్నా దక్షిణాఫ్రికా జాతి విచక్షణ పాటిస్తూ, నీగ్రోలను దారుణంగా చంపించింది బోతా దీనికి ఆధ్వర్యం వహించాడు. విదేశీ పత్రికలు, రేడియో, టి.వి.లపై నిషేధం పెట్టారు. దక్షిణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థబాగా వున్నందువలన బోతా తన కిరాతక చర్యల్ని నిరాఘాటంగా సాగించాడు. దక్షిణాఫ్రికా పోరాటంలో తోడ్పడుతూ, గెరిల్లా పోరాటాలు చేస్తున్న వారిపై సరిహద్దు ప్రాంతాలలో తరచు దండయాత్ర చేసి చంపారు.

సుకర్నో విలాసవంత దారుణాలు



ఇండోనీషియా ఆధిపతిగా సుకర్నో విలాస జీవితం గడిపాడు. నగ్నసుందరులతో మాట్లాడుతున్న ఆయన్ను చూచి రష్యా అధినేత కృశ్చేవ్ ఆశ్చర్యపోయాడు. సుకర్నో ఎప్పటికప్పుడు కొత్త నినాదాలిస్తూ, జీవితాంతం తానే ఆధ్యక్షుడుగా వుండాలనే అధికారాన్ని సంక్రమింపచేసుకున్నాడు. అలీన దేశాల సమావేశం బాండుంగ్ లో జరిగినప్పుడు సుకర్నో అధ్యక్షత వహించాడు. దేశంలో పార్టీలు లేకుండా చేసిన సుకర్నో మార్గదర్శక ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ అంటూ కొత్త నినాదాలిచ్చాడు దేశంలోని సమస్యల నుండి దృష్టి మళ్ళించడానికి విదేశీ విధానంపై కొత్త ఆకర్షణీయ ప్రసంగాలు చేస్తుండేవాడు, తటస్త విధానాం కావాలనేవాడు.
ఇండో చైనాలో వున్న చైనీయులను, నానా హింసలు పాలు చేసి సుకర్నో జకార్తా-నాంపే, జీజింగ్, పై నోగియాంగ్ సమైక్యత అంటుండేవాడు. తన దేశంలో వున్న అంతర్జాతీయ బారస్కేట్ ఉద్యమంపై దాడి చేశాడు.
మలేషియాను అణచివేయాలనే దురాక్రమణ నినాదాన్ని యిచ్చిన సుకర్నో 1963లో మలేషియాను ఆక్రమించుకోవడంలో విఫలుడయ్యాడు. కాని అంతకుముందు సంవత్సరం పశ్చిమ ఇరియాను, కబళించి, విజయోత్సవం జరుపుకున్నాడు.
బహుభార్యలతో, ఉంపుడు గత్తెలతో కులుకుతూ కాలం గడిపిన సుకర్నో సెక్స్ జీవితాన్ని చైనీయులు సినిమా తీశారు. రాను రాను ఇండోనీషియా ఆర్ధిక జీవనం దుర్బరంగా తయారైంది దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర వహించిన చైనీయుల్ని సుకర్నో హతమార్చాడు. విదేశీయులెవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. 1965 నాటికి ఏమి చేయలేక తన నిస్సహాయతను బయటపెట్టుకోడానికి ఇష్టం లేని సుకర్నో ఇండోనీషియా కమ్యూనిస్టు పార్టీని కుట్ర చేయమని సైగ చేశాడు.
1963-64 రష్యా సహాయంతో మలేషియాపై దాడి చేసినప్పుడే సుకర్నో కుయుక్తులు కమ్యూనిస్టులకు తెలిసి వుండాలి. ఈసారి పెకింగ్ అనుకూల కమ్యూనిస్టు పార్టీ సహాయంతో సైనిక ప్రాబల్యాన్ని కొట్టేయాలని సుకర్నో తలపెట్టాడు. కమ్యూనిస్టులు అదే అదను అనుకొని కొన్ని జిల్లాలను కైవశం చేసుకున్నారు.
1965 అక్టోబరు 18న కమ్యూనిస్టులు, సైన్యాధిపతి జనరల్ అబ్దుల్ యానీని, మరో ఇరువుర్ని కాల్చి చంపారు. రక్షణ మంత్రి కుమార్తెను చంపారు. ముగ్గురు జనరల్స్ ను చిత్ర హింసచేసి చంపారు. చిత్రహింస అంటే ఇండోనేషియా పద్దతిలో కమ్యూనిస్టు స్ర్తీలు, వారి పిల్లలూ కలిసి, కళ్ళుపీకి, మర్మావయాలు కోసి, దేహాన్ని మొసళ్ళకు వేశారు. కమ్యూనిస్టులు చేసిన యీ కిరాతక కృత్యాలన్నీ క్రమంగా వెల్లడయ్యాయి.
జనరల్ సుహార్తో నాయకత్వాన సైన్యం కమ్యూనిస్టుల కుట్రను ఎదిరించి భగ్నం చేయగలిగింది. వారు పగ తీర్చుకున్నారు. 1965 అక్టోబరు 3న పగ సాధింపు ప్రారంభమైంది. ఒక క్రమ పద్దతిలో కమ్యూనిస్టులను వూచకోతకు గురిచేశారు. మొత్తం 3 లక్షల మంది కమ్యూనిస్టులను చంపారు.
సుకర్నో నిస్సహాయుడై, తన స్వయంకృతాపరాధాలకు పరిహారం అనుభవిస్తూ, నిర్బంధానికి గురైనాడు. తరువాత సుహార్తో రాజ్యాధిపతి అయ్యాడు. 20వ శతాబ్దంలో ఇంతమంది కమ్యూనిస్టులను చంపుతుంటే, కమ్యూనిస్టు అగ్ర రాజ్యాలు సైతం ఏమీ చేయలేక పోయాయి.

No comments: