Friday, June 27, 2008

Sahiti parulato Sarasaalu-Gopala Sastri


గోల శాస్త్రి
(1931-1994)










ప్రభుత్వ సమాచారశాఖకు వెడితే నిర్జీవంగా వుండేది. అలాంటి చోట పని చేసిన ఉపద్రష్ట గోపాల చక్రవర్తి తన చతుర సంభాషణలు, హాస్యంతో కాస్త ఉపశమనం యిచ్చేవారు. పైగా ఒకకాలు అవుడుగావడం వలన, నడకకు సహాయం అవసరమయ్యేది. ఆజానుబాహుడు. శారీరక లోపాల్ని మరచిపోయేట్లు చక్కగా సమయస్ఫూర్తి మాటలు, వ్యాఖ్యలు చేస్తుండేవారు.
గోరాశాస్త్రి మేనల్లుడుగా గోపాల చక్రవర్తితో పరిచయమైంది. అదే కొనసాగింది. వివిధ పత్రికలలో చమత్కార రచనలు, క్లుప్తంగా, విపరీతంగా రాసేవాడు. చదివి ఆనందించేవాళ్ళం. ఆమాటే చెప్పేవాళ్ళం.
అనేక మార్లు గోపాలశాస్త్రిని ఆయన ఇంట్లో, గోరాశాస్త్రి గృహంలో, సమాచారశాఖలో కలసి ముచ్చటించాను. ఎప్పుడూ ఆనందమేగాని, ఆయనతో మరొకటి వుండేదికాదు. అది విశేషం. వ్యక్తులను పేర్లు మార్చిచమత్కారంగా సంబోధించేవారు. డి. ఆంజనేయులును డాంజనేయులు అనేవారు. గోరాశాస్త్రి మాత్రం చనువుగా చివాట్లు పెడుతుండేవారు. ఉద్యోగ రీత్యా అనేక మారుపేర్లతో వివిధ చిన్న, పెద్ద పత్రికలలో రాశారు.
రచనలు : కలం కలలు, ఆనంద జీవనది, నాతి కథలు, నీతి కథలు, గోలా యణం, నవ్వు గోపాలం.
పత్రికలలో నిర్వహించిన శీర్షికలు : సల్లాపం (ఈనాడు), చెవిలో జోరీగ (ఆంధ్రజ్యోతి), గోపాల భూపాలం (ఉదయం), మిరపకాయ బజ్జీలు (ఆంధ్రజనత), శ్రవణానందం (ఆంధ్రప్రభ) యిత్యాదులు. చిన్న పత్రికలలోనూ నిర్వహించారు.

No comments: