Saturday, June 16, 2007

మీ ప్రశ్నలు, మా సమాధానాలు -1



వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -8

త్రిపురనేని రామస్వామి చౌదరి

నేను ఉదయం పత్రిక, వార పత్రిక అనుబంధం లోనూ రాశాను. త్రిపురనేని రామస్వామి పై రాసిన వ్యాసం, చర్చావివాదాలకు, దారితీసింది. చేకూరి రామారావు వంటివారు పాల్గొన్నారు. -Innaiah

త్రిపురనేని రామస్వామి మీద రాసిన వ్యాసం వివరాలు తెలుపగలరు. -Anil


త్రిపురనేని రామస్వామి చౌదరి అభ్యుదయవాది.వీరికి ముగ్గురు భార్యలు (ఒకరు చనిపోయిన తరువాత, మరొకరిని, ముగ్గురూ కమ్మ వారినే, వివాహమాడారు ); నలుగురు సంతానము. వారు గోపీ చంద్, పెద్ద కుమార్తె సరోజిని దేవి, గోకుల్ చంద్, చిన్న కుమార్తె చౌదరాణి. రామస్వామి గారు మతాభిమానాన్ని బాగా విమర్శించినారు.కులాంతర వివాహాలు ప్రోత్సాహించారు. తన జీవిత చివరి భాగంలో మాత్రమే, తన పేరులోని చౌదరి ని పరిత్యజించారు.తమ పిల్లలకు, కమ్మ కులంలోనే, వివాహాలు గావించారు.

రామస్వామిగారు న్యాయవాది.వీరు స్వగ్రామమైన అంగలూరు (గుడివాడ) నుంచి, గుంటూరు జిల్లా తెనాలికి వచ్చి స్థిరపడినారు. తెనాలి పురపాల సంఘానికి chairman గా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన, జస్టిస్ పార్టీ లో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు.అప్పటి కమ్మ మహాజన సంఘ సభలకు, రామస్వామి అధ్యక్షత వహించారు. ఆర్య సమాజ పద్ధతులంటే అభిమానంగా ఉండే వారు. మత గ్రంధాలను నిరసించే రామస్వామిగారు,వెదాలే సర్వస్వం, అందులోనే అన్నీ ఉన్నాయని భావించే,ఆర్య సమాజంలో ఉండటం, పరస్పర విరుద్ధమైన విషయంగా కనిపిస్తుంది.బ్రాహ్మణ పౌరోహిత్యానికి వ్యతిరేకంగా కమ్మ పురోహితులను రంగంలోకి తీసుకు వచ్చారు. కొంతకాలం అయ్యాక, కమ్మ పురొహితులే కాక, మిగత కులాల వారు కూడా పౌరోహిత్యం వహించటం అభ్యుదయం అని చెప్పాలి. వివాహ విధులు ల లో,మంత్రాలలో సంస్కృతం బదులుగా తెలుగును ప్రవేశ పెట్టారు.. ఈ మంత్రాల లోని దైవ ప్రస్తావనను,మత వాసనలను పరిష్కరించి, వివాహ విధులలో అభ్యుదయం తెచ్చారు.

రామస్వామి గారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో చివరిది భగవద్‌గీత.ఈ పుస్తక ప్రచురణ సమయంలో, రామస్వామిగారు తన పేరులో చౌదరి ని ప్రచురించలేదని, కొందరు చెప్తున్నారు. మలిముద్రణలలో కూడా చౌదరి తొలగించబడి ఉండ వచ్చు. ఏమైనా, ఇది ఆహ్వానించదగ్గ పరిణామము. మత చాందసాలను, చీల్చి చెండాడిన, రామ స్వామి గారు, వ్యక్తిగత జీవితంలో కుల తత్వాన్ని అధిగమించ లేకబోయారు.

ఈ విషయాలు, ఇన్నయ్య గారి వ్యాసములో చర్చనీయాంశాలయి,శ్రీయుతులు చేకురి రామారావు, కోటపాటి మురహరి రావు, రావెల సొమయ్య, ఇతరత్రా ప్రముఖుల కు మింగుడు బడలేదు.చివరకు కక్కా లేక మింగా లేక అయిష్టంగానైనా, వారంతా ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఈ వ్యాసాలు, చర్చలూ, State Archives, Tarnaka, Hyderabad లో భద్ర పరచబడ్డాయి.

Additional Notes: రామస్వామి గారు (1887—1943) చనిపోయేనాటికి చిన్న వయసు వారే.వయసుతో పాటే, వారి ఆలోచనలూ మారుతూ వచ్చాయి. మరికొంత కాలం జీవించి ఉంటే, చివరి దశలో, వారిలో వచ్చిన మార్పులు మరింత ప్రస్ఫుటంగా కనిపించి ఉండేవి. కులతత్వాన్ని అధిగమించిన గుర్తులూ, మనము సులభముగా పోల్చుకొనగలిగే వారము. వారి అకాల మృత్యువు, మన దురదృష్టము.

--------------------00000000--------------------

మిగతా ప్రశ్నలకు, వీలు వెంబడి, సమాధానాలు ప్రచురించటం జరుగుతుంది.

-cbrao

No comments: