Thursday, July 12, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -ఆఖరి భాగం

అనువాదాలు

నా రచనల్లో అనేక అనువాదాలు ఒక భాగం. నేను అనువదించడానికి ఎంపిక చేసుకున్న వారిలో ఎం.ఎన్. రాయ్ అగ్రస్థానంలో వుండగా, మిగిలిన వారు- ఎ.బి.షా, శిబ్ నారాయణారే, పాల్ కర్జ్, వి.బి. కర్నిక్, లక్ష్మణ శాస్ర్తి జోషి, అగేహానంద భారతి, ఎ.ఆర్. దేశాయ్, ఇబ్న వారక్ నంబూద్రి పాద్ (కేరళ చరిత్ర), పింగళి జగన్మోహనరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, రిచర్డ్ డాకిన్స్, శాంహరిన్ పేర్కొనదగిన వారు. స్వదేశీ రంజన్ దాసు కూడా యీ జాబితాలో చేర్చవచ్చు. ఎం.ఎన్. రాయ్ రచనలలో కొన్ని అనువాదాల్ని ప్రజావాణి, రాడికల్ హ్యూమనిస్ట్, తెలుగువిద్యార్ధిలో ప్రచురించగా ఎ.బి.షా. వ్యాసాలు ప్రజావాణి, తెలుగు విద్యార్థి, సమీక్ష, వికాసం, హేతువాదిలో ప్రచురించారు. అనువాద గ్రంథాలలో అత్యధిక భాగం తెలుగు అకాడమీ, కొన్ని తెలుగు విశ్వవిద్యాలయం వెలువరించింది.
అనువాదాల పట్ల నాకు ఎప్పుడూ అసంతృప్తి వుంటుండేది. ఎ.బి.షా సైంటిఫిక్ మెధడ్ ను అలాంటి అసంతృప్తితోనే మరల మరలా దిద్దుకుంటూ చివరగా తెలుగు అకాడమీ ప్రచురణగా తెచ్చాను.
ఎం.ఎన్. రాయ్ రచన ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అనువాదానికి ఎడిటర్ గా సి. నారాయణ రెడ్డి వున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు ప్రొఫెసర్ గా ఆయన సూచనలు చేస్తూ, చదవడానికి సౌలభ్యం గురించి చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని తిరగరాశాను. ఇండియన్ హిస్టారికల్ సొసైటి వారి ఎంపిక. అది పుస్తకంగా వెలుగు చూడలేదు. అలాగే నంబూద్రిపాద్ కేరళ చరిత్రకూడా పుస్తకంగా రాలేదు. జి.వి. కృష్ణారావు హి.హెచ్.డి. సిద్ధాంతం కళా పూర్ణోదయంపై నా తెలుగు అనువాదం నా కేమీ తృప్తి కలిగించలేదు. సగం గ్రాంధికం సగం వ్యావహారికంలో రాశాను. ఆనాడు ఎ.సి. కాలేజీలో నాకు లెక్చరర్ గా వున్న ఎలవర్తి రోశయ్య ప్రభావం వలన అలా చేశాను. తరువాత అది సరిదిద్దడం కుదరలేదు. కొంత భాగం 1962లో గోలకొండ పత్రిక సీరియల్ గా ప్రచురించింది.
నేను అనుకరణలు చేసిన ప్రముఖులు కొందరున్నారు. అందులో ఎరిక్ ఫ్రాం, ఆర్.జి. ఇంగర్ సాల్, థామస్ సాజ్, కార్ల్ శాగన్, స్టీ ఫెన్ హాకింగ్, బెట్రాండ్ రస్సెల్, చెప్పదగిన వారు. వారి రచనల ఆధారంగా చేసిన వ్యాస రచనలో ఆ విషయం స్పష్టం చేశాను. కొందరి పుస్తకాలతో ప్రభావితుడనయ్యాను. అందులో బి.ఆర్. అంబేద్కర్, రిచర్డ్ డాకిన్స్, పేటర్ సింగర్, ప్రేమనాధ్ బజాజ్, క్రిస్టోఫర్ హిచిన్స్, వున్నారు.
మన పత్రికలు, ముఖ్యంగా దిన పత్రికలు కొన్ని విషయాలలో ఏక పక్షం వహించడం వలన చర్చకు సైతం తమ ప్రీతి పాత్ర విషయాలు స్వీకరించే వారు కాదు.
ఈ నాడులో హోమియో గురించి ఏక పక్ష ధోరణి యిందుకు నిదర్శనం. నా విమర్శలు ప్రచురించలేరు. మదర్ థెరీసా, హోమియో వంటివి ఆంధ్రజ్యోతి సైతం సెన్సిటివ్ గా పరిగణించేది. ఇవన్నీ జర్నలిజంలో అనుభవాలు.
జర్నలిస్ట్ గా కలసిన, మాట్లాడిన, ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తులలో-మదర్ థెరీసా (1976), సంజీవరెడ్డి (స్పీకర్) ఇందీరాగాంధీ (పదవి లేనప్పుడు (1979), పి.వి. నరసింహారావు, ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, వెంగళరావు, పి.వి. నరసింహారావు, చెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు, విజయ భాస్కర రెడ్డి, నాదెళ్ళ భాస్కరరావు, అంజయ్య, భవనం వెంకట్రాం, ఎన్. జనార్ధన రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి వున్నారు.
విద్యావేత్తలలో సి.డి. దేశముఖ్, పార్కిన్ సన్, సైంటిస్టు వై. నాయుడమ్మను ఇంటర్య్వూ చేశాను.
విదేశాలలో కార్ల్ శాగన్, థామస్ సాజ్, గ్రున్ బాం (Grun Balm in Pittsburgh) రిచర్డ్ డాకిన్స్, శాంహారిస్, తస్లీమా నస్రీన్, వారెన్ ఎలెన్ స్మిత్, ఫాల్ కర్జ్, గార్డన్ స్టైన్, టిం మాడిగన్, ఇబ్నవారక్, ఎలెన్ జాన్ సన్, మడల్య ఓహేర్, ఫ్రెడ్ ఎడ్వర్డ్, ఏడ్ డోర్, సోనియా ఎగ్ రిక్స్, జింహెరిక్స్, జిండ్లర్ ఫ్రాంక్, కెన్నెత్ ఫ్రేజర్ వున్నారు. అలాంటి వారితో కలసి మాట్లాడడం జర్నలిజానికి ఎంతో ఉపకరించాయి.
ఇండియాలో మణిబెన్ కారా (స్ర్తీ కార్మిక నాయకురాలు) ప్రేమనాథ్ బజాజ్, ఇందుమతి, పరేఖ్, ఎస్. రామనాధన్, (రేషనలిస్ట్ నాయకుడు) జే.బి. హేచ్ వాడియా, లక్ష్మణ శాస్త్రి, జోషి, రామ మనోహర్ లోహియా, జార్జి పెర్నాండజ్, అమ్లన్ దత్త, వి.ఎం. తార్కుండే, వి.బి. కర్నిక్, డి.బి. కర్నిక్, డబ్లు.హెచ్ కానియా, ఆర్.ఎల్. నిగం, ఎ.కె. ముఖర్జీ, (థాట్) సి. ఆర్. ఎం. రావు (చైనా రిపోర్ట్) లతో వ్యక్తి గత పరిచయాలుండటం వారి అనుభవాలు తెలుసుకోవడం విశేషం.

(అయిపోయింది)

-Innaiah Narisetti

1 comment:

Anonymous said...

అయిపోయిందా !అమ్మయ్య బ్రతికించారు.