Saturday, January 3, 2009

తెలుగులో ఎమ్.ఎన్. రాయ్ రచనలు








ఫోటోలో సి. లక్ష్మన్న, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఇంద్రారెడ్డి, రావిపూడి వెంకటాద్రి, ఎన్. ఇన్నయ్య ఉన్నారు






ఎమ్.ఎన్. రాయ్ శతజయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన రచనలు విడుదల చేశారు. రాయ్ గ్రంథాలలో 1. రష్యా విప్లవం, 2. చైనాలో విప్లవం, ప్రతి విప్లవం, 3. వివేచన, విప్లవం ఉద్వేగ వాదం (రెండు భాగాలు), 4. పార్టీలు, రాజకీయాలు, అధికారం, 5. ఎమ్.ఎన్. రాయ్ రాజకీయ జీవిత చరిత్ర వి.బి. కార్నిక్ రచన 1988లో విజయవాడలో ఆవిష్కరించారు. ఆ రచనలన్నీ తెలుగులోకి నేను తెచ్చాను. వీటిని చాలా తక్కువ ధర పెట్టి అకాడమీ అందించింది. అప్పట్లో వెంకారెడ్డి డైరెక్టర్ గా ఉండేవారు. ఆయనకు శాస్త్రీయ దృక్పదం ఉన్నది.

విజయవాడ కళామందిర్ లో జరిగిన పెద్ద సమావేశానికి ఆ నాటి రాష్ట్ర విద్యామంత్రి కీ.శే. ఇంద్రా రెడ్డి మరోక మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు ఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న వచ్చి పాల్గొని ప్రసంగించారు. నాడు ప్రధాన ప్రసంగాన్ని హేతువాద నాయకుడు రావిపూడి వెంకటాద్రి చేశారు. కమ్యూనిస్టు గా మొదలైన ఎమ్.ఎన్. రాయ్ మానవవాదిగా మారిన తీరును ఆయన అనర్గళంగా సమీక్షించారు.

ఫోటోలో సి. లక్ష్మన్న, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఇంద్రారెడ్డి, రావిపూడి వెంకటాద్రి, ఎన్. ఇన్నయ్య ఉన్నారు. ఈ రచనలన్నీ ఒక సెట్ గా అందుబాటు దరకు అందించటం అకాడమీ చేసిన కృషిలో ఒకటి. పునర్ ముద్రణకు వచ్చిన ఈ గ్రంథాలను అకాడమీ వెలువరించవలసి ఉన్నది.

No comments: