Wednesday, January 21, 2009

జానపద గేయాల రాణులు సీత, అనసూయ

Anasuya




Seeta(left)





ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని దశాబ్దాల పాటు మారుమూల గ్రామాలలో ఉన్న మరుగున పడుతున్న జానపద సాహిత్యాన్ని వెలికి తీసిన ఖ్యాతి వింజమూరి సీత, అనసూయలదే. ఈ అక్క చెల్లెళ్ళలో సీత అవివాహిత, అనసూయ సంతానం అమెరికాలో ఉన్నారు. వీరిరువురూ అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. తెలుగు సభలలో పాల్గొన్నారు. ఆంధ్రరాష్ట్రంలో స్టేజి పై ఎన్ని చోట్ల జానపద సాహిత్య గోష్ఠులు జరిపారో లెక్కలేదు. రేడియో కార్యక్రమాలలో మదరాసు నుండి హైదరాబాదు వరకూ ప్రచారాలు సాగించారు. పుస్తకాలు వేశారు. క్యాసెట్లు వచ్చాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనగోడళ్ళు సీత, అనసూయ. హైదరాబాదులో ఆదర్శనగర్ లో ఉన్నప్పుడు నాకు పరిచయం. నా కుమార్తె వారి దగ్గర జానపద గేయాలు నేర్చుకున్నది. ఒకసారి నిజామ్ కాలేజిలో యువత జానపద గేయాల కార్యక్రమానికి జడ్జిగా సీతను పిలిచారు. అందులో ఏర్పాటు చేసింది నా కుమార్తె నవీన. పాటల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ రోజు పాడిన వారిలో ఉత్తమ బహుమతి నవీనకు ఇవ్వాలని సీత నిర్ణయిస్తే ఆర్గనైజరుగా ఉంటూ తాను ప్రైజు తీసుకోవడం మంచిది కాదని చెప్పగా, సీత మెచ్చుకున్నది.
తరవాత సీత, అనసూయలను అమెరికాలో కలుసుకున్నాను. మా అమ్మాయి నవీన యింటికి కూడా వచ్చారు. అప్పుడు సీత యిళ్ళకు వెళ్ళి తన పాటల కాసెట్ అమ్ముతుంటే, ఆ వయసులో అలా చేయవద్దని ఎవరైనా వ్యాపార రిత్యా అమ్మేవారికి ఆ పని అప్పగించమని సలహా ఇచ్చాను. ఆమె సహృదయంతో స్వీకరించింది. ఆమెను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురించాను.

2 comments:

krishna rao jallipalli said...

ఆ interview link ఇవ్వ ప్రార్థన.

naprapamcham said...

Interview was not put in internet but only published in Andhra Jyothi daily during 1999.