Sunday, August 17, 2008

సాహితీపరులతో సరసాలు














భట్టిప్రోలు హనుమంతరావు

చరిత్రను శాస్త్రీయంగా రాసి విద్యార్థులకు ఎంతో తోడ్పడిన మానవ వాది భట్టిప్రోలు హనుమంతరావు, కూచిపూడికి (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా) చెందిన బి.ఎస్.ఎల్. హైస్కూలు స్థాయినుండే హేతువాద ప్రభావంలో పెరిగారు. పూర్తిపేరు భట్టిప్రోలు శ్రీలక్ష్మి హనుమంతరావు. జీవితమంతా ఉపాధ్యాయ వృత్తిలో గడిపి ఎంతో మందిని ప్రభావితం చేశారు. అలాగే రచనలు ద్వారా మరెందరినో ముందుకు నడిపారు. హేస్కూల్లో ఉపాద్యాయ వృత్తితో ప్రారంభించి, గుంటూరు హిందూ కళాశాలలో చరిత్ర లెక్చరర్ గా ఉన్నారు.
నాగార్జున యూనివర్శిటీలో భౌద్ధ అధ్యయన కేంద్రంలో పరిశోధకులుగా పనిచేశారు. చివరి దశలో తెలుగు అకాడమీలో రచనలు చేస్తూ, రీసెర్చి సాగించారు. భౌద్ధంలో బాగా కృషి చేసి ఆంధ్రదేశంపై భౌద్ధ ప్రభావాన్ని గ్రంథస్తం చేశారు. త్రిపురనేని రామస్వామి హేతువాదంతో మొదలై, ఎమ్.ఎన్. రాయ్ మానవ వాదంతో పరిపుస్టిని సాధించారు.
1955 నుండి హనుమంతరావుతో నాకు గుంటూరులో పరిచయం అయ్యింది. అది చివరి వరకూ సాగింది. ఆయన రాడికల్ హ్యూమనిస్టు. అధ్యయన శిభిరాలకు వచ్చి చక్కని ప్రసంగాలు చేసేవారు. కల్లూరి బసవేస్వరరావుతో కలసి మధ్య యుగాలలో ఆంధ్రదేశ చరిత్రను రాశారు. అధి కళాశాల విధ్యార్ధులకు పాఠ్యగ్రంథంగా పెట్టారు. ఏ విషయానైనా సమగ్రంగా శాస్త్రీయంగా పరిశీలించి చరిత్ర వ్రాయటం బి.ఎస్.ఎల్.కు ఆనవాయితీ.
రచనలు : ఆంధ్రలో మతం, శాతవాహన యుగం, కేవల బోధి-భౌద్ధ జైన చరిత్ర, మధ్యయుగాలలో సాంఘిక-సాంస్కృతిక చరిత్ర.
బిఎస్ ఎల్ అనువాదం చేసిన ఎం ఎన్ రాయ్ జీవిత గాధలు గొప్ప తెలుగు సేత.
మేము కొన్ని రాడికల్ హ్యూమనిస్ట్ స్టడీ క్యాంపులలొ కలసి మాట్లాడాము.
1994 లో చనిపోయారు.

No comments: