Sunday, August 31, 2008

విగ్రహం కన్నీరు పెడుతోంది








లోకంలో పాపం పెరిగిపోయింది. అది చూడలేక మేరీమాత విగ్రహం కన్నీరు పెట్టుకుంటున్నది. ప్రభువు ఆగ్రహిస్తాడు. పాపం పోగొట్టుకోవాలి అని క్రైస్తవ ఫాదర్ బోధిస్తున్నాడు. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెడుతుందనే వార్త పత్రికలలో వచ్చింది. భక్త జనం తండోపతండాలుగా వచ్చి అద్భుతాన్ని తిలకించి, కానుకలు సమర్పించారు. ప్రార్థనలు చేశారు. క్షమించమని వేడుకున్నారు. ఒక రోజు కన్నీరు పెట్టుకున్న విగ్రహం మరునాడు ఆపేసింది. ఈలోగా వచ్చిన కానుకల్ని దైవకార్యం నిమిత్తం ఫాదర్ స్వీకరించాడు.
మాంత్రికుడు జేమ్స్ రాండి (అమెరికా)కి వార్త తెలిసివచ్చాడు. విగ్రహాన్ని పరిశీలిస్తానన్నాడు. వీల్లేదన్నారు. నిజంగా కన్నీరు కారుస్తుంటే, పరిశీలనకు ఆటంకం ఏమిటన్నారు. అయినా సరే ఒప్పుకోలేదు. భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించకూడదన్నారు. హేతువాదులు జేమ్స్ రాండిని వివరం అడిగారు. విగ్రహాన్ని తరువాత పరిశీలించిన రాండి విపులీకరించి, ఏం జరిగిందో తెలియపరచాడు.
మేరీమాత విగ్రహం మెడ లోపలి భాగం ఖాళీగా వుంది. తలపై చిన్న రంధ్రం పెట్టి నీళ్ళు పోశారు. తలపై ముసుగు కప్పారు. విగ్రహం రెండు కళ్ళకూ మైనం పెట్టి, నీళ్ళు పోసినప్పుడు మైనం తొలగించారు. లోన పోసిన నీరు బొట్టుబొట్టుగా బయటకు వచ్చింది. మేరీమాత ఏడుస్తున్నట్లు ప్రచారం చేసి, భక్తుల వద్ద కానుకలు స్వీకరించారు.
మైసూరులో చాముండేశ్వరి విగ్రహం యిలాగే ఏడుస్తున్నట్లు లోగడ ఒకసారి ప్రచారం చేశారు. మాంత్రికుడు యీ గుట్టు బయట పెట్టాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహమైతే, లోన ఉప్పునీరుపోస్తే, సన్నని రంధ్రాలనుండి చెమ్మ వస్తుంది. అది కూడా భక్తుల్ని నమ్మించడానికి ప్రచారం చేసేవారు. విగ్రహాలను తయారు చేసేది మనుషులే. వాటిని పూజించేది మనుషులే. విగ్రహాలను రాళ్ళుగా, బోమ్మలుగా ఆడుకునేంది పురోహిత వర్గమే.

2 comments:

భరత్ said...

ఇన్నయ్య గారు,
చాలా చక్కగా వివరించారు, బ్లాగ్ లు చదవడం వల్ల ఇలాంటి విషయాలు నాకు తెలిసింది.

Anonymous said...

నీకు తొడపాశం పెడితే బొలబొల కన్నీల్లొస్తాయి. బబ్బ బబ్బ బా